వేమూరి నరసింహారెడ్డి

1939లో వరంగల్ జిల్లాలోని పల్లగుట్ట గ్రామంలో జన్మించారు.

వేమూరి నరసింహారెడ్డి ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త.

వరంగల్ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. 1962, 65లలో చైనా, పాకిస్తాన్‌ల దండయాత్రల సందర్భంగా పలువురు కవుల రచనలతో సమరగీతి, సమరభారతి అను కవితా సంకలనలను ప్రచురించారు.

చేతనావర్తం మొదటి సంపుటిలో ఈయన రచించిన జన్మష్టమి ప్రతీకాత్మకంగా సాగిన కవిత. కృష్ణుని ఉద్దేశించి ఇలా రాశారు.

"నువ్వు పుట్టడం మాత్రమే కటకటాలలో/ నేను పుట్టింది మొదలు కటకటాలలోనే/ ఈ ఇక్కట్ల ఉక్కు చువ్వల నడుమ/ చిక్కుల చీకట్ల కట్ల నడుమ/ తడబడే అడుగులతో వెతుకున్నారు/ నీ కోసం-నీ అడుగు జాడల కోసం"

ఇలా శ్రీకృష్ణు జన్మష్టమికి, ఆధునిక జీవితంలో ఎదురయ్యే అష్టకష్టాలకు భేదం లేదని తెలియజేయడం కనిపిస్తుంది.

అదేవిధంగా ఆయన రచించిన కవిత్వమే నా ఊపిరి, నీ కాళ్ల మీద నువ్వు, పిరికిగా చావకు, కాలాన్ని కత్తిరించి చూడకు మొదలైన కవితల్లో మహత్తర సందేశం ఉంది

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.