సహాయ నిరాకరణోద్యమం

1920-22 లో బ్రిటిష్ ప్రభుత్వం పట్ల భారతదేశంలో తీవ్రమైన నిరాశ, నిస్పృహ, అసంతృప్తి అలుముకొని ఉన్న సమయంలో, జలియన్ వాలాబాగ్ సంఘటన, ఖిలాఫత్ సమస్య, చాలీ చాలని సంస్కరణలతో మరింత అసంతృప్తి చెందిన గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించారు.

కారణాలు

రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా 1919 ఏప్రిల్ 13వ 'జలియన్ వాలాబాగ్' లో భారతీయులు ఆందోళనకు దిగారు. బ్రిటిషర్లు ఆందోళన కారులపై సాముహిక హత్యాకాండకు పాల్పడ్డారు. ఆ సంఘటనకు సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యులైన వారిపై చర్యతీసుకొనే బదులు విచారం వ్యక్తం చేసింది. మొదటి ప్రపంచయుద్ధంలో ఇస్లామిక్ దేశమైన టర్కీ ఇంగ్లాండ్ ను వ్యతిరేకించడంతో ఖలీఫా పదవిని రద్దు చేశారు. దాన్ని తిరిగి పునరుద్దరించాలని భారతీయులు కోరారు. సహాయ నిరాకరణోద్యమం ప్రారంభం అయ్యేటప్పటికి నైతికంగా దెబ్బతిని వెనుకబడి, కుంగి ఉన్న భారతీయులు అకస్మాత్తుగా నిలబడి, తలెత్తి జాతీయ స్థాయిలో సాముహిక ఉద్యమంలో పాల్గొనడానికి సిద్దంగా ఉన్నారని జవహర్ లాల్ నెహ్రూ అభిప్రాయపడ్డారు. ఖిలాఫత్, పంజాబ్ ధురంతాలు, చాలిచాలని సంస్కరణలు త్రివేణి సంగమం జాతీయ అసంతృప్తి అనే ప్రవాహాన్ని ఉద్దృతం చేసింది.

సహాయనిరాకరణోద్యమ లక్ష్యాలు

ఎదహి కాలంలో స్వరాజ్యాన్ని సాధించడమే ప్రధాన లక్ష్యము మరియు ఖలీఫా పదవిని పురరుద్దరించడం. T.v.

సహాయ నిరాకరణోద్యమ కార్యక్రమాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.