సట్లెజ్ నది
పంచనదులు ప్రవహించే భూమిగా పేరుపొందిన పంజాబ్లో ప్రవహించే ఐదు నదులలో పెద్దదైన సట్లెజ్ నది (Sutlej River) వింధ్య పర్వతాలకు ఉత్తరాన, హిందూకుశ్ మరియు హిమాలయా పర్వతాలకు దిగువన భారతదేశం మరియు పాకిస్తాన్ లలో ప్రవహిస్తుంది. టిబెట్టులోని కైలాస పర్వత శిఖరాలలో జన్మించి, పశ్చిమాన మరియు నైరుతి దిక్కులలో ప్రవహించి అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ పంజాబ్ రాష్ట్రంలో బియాస్ నదిలో కలుస్తుంది. బియాస్ నది సింధూనదికి ఉపనది. చివరికి సింధూనది పాకిస్తాన్ గుండా ప్రవహించి అరేబియా సముద్రములో కలుస్తుంది.

Sutlej Valley from Rampur ca. 1857
భారతదేశంలో ప్రముఖ బహుళార్థసాధక ప్రాజెక్టులలో ఒకటైన భాక్రానంగల్ ప్రాజెక్టును ఈ నదిపైనే నిర్మించారు. సింధూనది ఒప్పందం ప్రకారం ఈ నది నీటిలో భారత్-పాకిస్తాలు వాటాలకు కలిగియున్నాయి. వేదకాలంలో ఈ నది సుతుద్రిగా పిలువబడింది.
ఇవి కూడా చూడండి
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.