శ్లోకం
సంస్కృత భాషలో రెండు వాక్యాలను శ్లోకంగా వ్యవహరిస్తారు. ఇది కావ్య-కథనాలకు మూల పరిమాణం. శ్లోకాల ద్వారా ఒక విషయాన్ని, కథను తెలుపవచ్చు, శ్లోకాలు సాధారణంగా ఛందోబద్ధమై ఉంటాయి. అనగా వీటిలో యతి, లయ మరియు ప్రాసలు ఉంటాయి. ఛందోబద్ధమవటం వలన ఇవి త్వరగా కంఠస్థమవుతాయి. గురుకులాలలో గురు-శిష్య పరంపరగా జ్ఞానం మౌఖికంగా వారసత్వంగా రావటం వలన వీటికి ఈ రూపం వచ్చింది. అనుష్టుప్ ఛందస్సుకు పాత పేరే ఈ శ్లోకం. కానీ ఈ మధ్య సంస్కృతంలో రాసిన ఏ పద్యాన్ని లేక ఛందస్సు కలిగిన వాక్యాన్ని శ్లోకం అంటున్నారు.
శ్లోక స్వరూపము
అనుష్టుప్ ఛందస్సులో ఉన్న శ్లోకాన్ని ఈసుకుంటే, రెండు వాక్యాలలో ఉండే ఈ శ్లోకంలో ఒక్కో శ్లోకానికి 16 వర్ణాలు (అక్షరాలు) ఉంటాయి. ఒక్కో వాక్యానికి రెండు పాదాలు ఉంటాయి. ఒక్కో పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. ఒక్కో పాదం ఒక్కో శ్వాసలో పఠించాల్సి ఉంటుంది.
శ్లోకం అనే పదానికి గల నానార్ధాలు
సంస్కృతంలో శ్లోకం అనే పదానికి ఎన్నో అర్ధాలు ఉన్నాయి. వాటిలో కొన్ని:
తెలుగువారిలో ప్రాచుర్యం పొందిన శ్లోకాలు
- జానక్యాః కమలామలాఞ్జలిపుటే యాః పద్మరాగాయితాః
న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కున్దప్రసూనాయితాః
స్రస్తాశ్శ్యామలకాయకాన్తికలితా యా ఇన్ద్రనీలాయితాః
ముక్తాస్తాశ్శుభదా భవన్తు భవతాం శ్రీరామవైవాహికాః
- ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ ||
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః || ||
- ఓంకార పంజరశుకీం
ఉపనిషదుద్యానకేళి కలకంఠీం
ఆగమ విపిన మయూరీం
ఆర్యాం అంతర్విభావయేత్ గౌరీం