వెల్లాల సదాశివశాస్త్రి

వెల్లాల సదాశివశాస్త్రి (1861-1925) మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కవి. జిల్లాలోని పెబ్బేరు మండలంలోని అయ్యవారిపల్లె వీరి స్వగ్రామం[1]. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి శంకరజ్యోసులు. వీరు ప్రధానంగా చరిత్ర సంబంధిత రచనలు చేశారు.

రచనలు

  1. వెలుగోటి వంశచరిత్రము
  2. సురభి వంశచరిత్రము
  3. ఆంధ్రుల చరిత్ర - విమర్శనము
  4. వీరభద్రీయ ఖండనము
  5. కంఠీరవ చరిత్రము
  6. రామచంద్ర చరిత్రము
  7. నామిరెడ్డి చరిత్రము
  8. యతినిండా నిరాకరణము
  9. రామానుజ గోపాల విజయము
  10. ఆంధ్ర దశరూపక విమర్శనము

మూలాలు

  1. తెలుగు సాహితీ వేత్తల చరిత్ర, రచన: మువ్వల సుబ్బరామయ్య, కృష్ణవేణి పబ్లికేషన్స్, విజయవాడ,2014, పుట-28.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.