వెంకటాద్రిపురం
వెంకటాద్రిపురం, కృష్ణా జిల్లా, నూజివీడు మండలానికి చెందిన గ్రామము. ఇది నూజివీడు-తిరువూరు మార్గంలో నూజివీడునుండి షుమారు 5 కి.మీ. దూరంలో ఉంది. గ్రామం జనాభా షుమారు 1000. వోట్ల సంఖ్య 520. ఇది వ్యవసాయ ప్రధానమైన వూరు. ఇది అన్నవరం పంచాయితీలో ఉంది.

| వెంకటాద్రిపురం | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | నూజివీడు |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 521201 |
| ఎస్.టి.డి కోడ్ | |
గ్రామ భౌగోళికం
సమీప గ్రామాలు
సమీప మండలాలు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గ్రామములో మౌలిక వసతులు
గ్రామంలో ప్రధ;అన పంటలు
వరి, అపరాలు, కాయగూరలు, పండ్లతోటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గణాంకాలు
గ్రామం పేరు వెనుక చరిత్ర
ఈ గ్రామానికి షుమారు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. 1922లో ఈ గ్రామం వ్వవస్థాపన జరిగింది. గ్రామం వ్యవస్థాపకుడైన చలసాని మల్లికార్జునుడు వుయ్యూరు మండలానికి (నెప్పల్?) చెందిన వ్యక్తి. అతను, మరికొంతమంది కలిసి ఈ గ్రామాన్ని స్థాపించినపుడు స్మారకచిహ్నంగా ఒక శంకుస్థాపన రాయిని పాతారు. వుయ్యూరు జమీందారు మేకా వెంకటాద్రి అప్పారావు వీరికి 50 ఎకరాల భూమిని కేటాయించాడు. ఇలా "వెంకటాద్రిపురం" అనే పేరు వచ్చింది. పొనుకుమాడుకు చెందిన సుంకర రాజయ్య ఈ గ్రామానికి వలస వచ్చి ఒక ధర్మసత్రాన్ని కట్టించాడు. అలా ఈ వూరికి "సత్రపు అన్నవరం" లేదా "క్రొత్త అన్నవరం" అనే పేర్లు కూడా వచ్చాయి. గ్రామానికి తూర్పు దిశలో "కావిళ్ళ చెరువు" అనే చెరువు ఉంది. పశ్చిమాన 150 ఎకరాల అడవి భూమి ఉంది. దీనిని 1985లో పేదవారికి పంచారు.
గ్రామానికి చెందిన కొందరు ప్రముఖులు

- చలసాని వెంకటేశ్వరరావు 1931-33 కాలంలో భారత స్వాతంత్ర్య పోరాటంలో పాళ్గొన్నాడు.
- బొబ్బా వెంకటేశ్వరరావు స్వాతంత్ర్ర్య పోరాఠంలోను, తెలంగాణా సాయుధ పోరాటంలోను పాల్గొన్నాడు.
పై ఇద్దరి పేర్లమీద ఇప్పుడొక స్మారక గ్రంథాలయం ఉంది.
- వేములపల్లి కృష్ణమూర్తి
- వీరంకి వసంతరాయుడు
- చలసాని గోపాలకృష్ణమూర్తి
- చలసాని జగన్నాధరావు - కమ్యూనిస్టు నాయకుడు
- చలసాని వెంకటరామారావు - కమ్యూనిస్టు నాయకుడు
ఉత్సవాలు
ప్రతి సంవత్సరం వినాయకచవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. 9 రోజుల ఉత్సవాల తరువాత "కావిడి చెరువు"లో విగ్రహాలను నిమజ్జనం చేస్తారు.