రేలంగి నరసింహారావు
రేలంగి నరసింహారావు తెలుగు సినిమా దర్శకులు. అనేక సినిమాలకు దర్శకత్వం వహించి సుపర్ హిట్ కామెడీ చిత్రాల దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్ వంటి హీరోలకు మంచి హిట్ సినిమాలనందించారు. ఆయన దర్శకత్వం వహించిన ప్రముఖ సినిమాలు ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, పోలీసు భార్య, చిన్నోడు పెద్దోడు, డబ్బెవరికి చేదు, సంసారం, మామా అల్లుడు మరియు గుండమ్మగారి కృష్ణులు
| రేలంగి నరసింహారావు | |
|---|---|
| జననం | రేలంగి నరసింహారావు 1951 సెప్టెంబరు 30 పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం |
| నివాసం | మధురా నగర్, హైదరాబాదు |
| వృత్తి | సినిమా దర్శకులు |
| జీవిత భాగస్వామి | రేలంగి సాయిలక్ష్మి (m. 1979–ప్రస్తుతం) |
| పిల్లలు | రేలంగి కిరణ్ రేలంగి సతీష్ |
| తల్లిదండ్రులు | రేలంగి శ్రీరంగనాయకులు రేలంగి శివరామమ్మ |
| బంధువులు | రేలంగి గీతాపల్లవి (Daughter In-law) రేలంగి సంధ్యానాయుడు (Daughter In-law) |
జీవిత విశేషాలు
ఆయన పాలకొల్లులో శ్రీరంగనాయకులు, శివరామమ్మ దంపతులకు 1951 సెప్టెంబరు 30 న జన్మించారు.
ఆయన సుమారు 70 చిత్రాలకు దర్శకత్వం వహించారు.[1] ఆయన చిత్రాలలో అధికంగా తెలుగుమరియు కన్నడ చిత్రాలు ఉన్నాయి. తమిళంలో కూడా చిత్రాలను తీసారు. ఆయన తెలుగు టెలివిజన్ లో సీరియళ్లకు కూడా దర్శకత్వం వహించారు. సుందరి సుబ్బారావు చిత్రం యొక్క స్క్రీన్ రచనలకు గానూ నంది అవార్డును అందుకున్నారు[2]. ఆ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన దివాకర్ బాబు మరియు శంకరమంచి పార్థసారధి వంటి రచయితలకు చిత్రసీమకు పరిచయం చేసారు.[3] ఆయన సుమన్[3], రేవతి మరియు కిన్నెర వంటి సినిమా నటులను కూడా చిత్రసీమకు పరిచయం చేసారు.
సినిమా ప్రస్థానం
సినిమాలలో ప్రవేశం
ఆయన చిన్నప్పుడు రంగస్థల నాటకాలు వేసేవారు. ఫోటోలు తీసే హాబీ ఉండేది, 14వ యేటనే రంగస్థల నాటకాలు, మోనో యాక్షన్ చేసేవారు. ఆవిధంగా తనలోని నటుడునే పరిశీలించిన తన తండ్రీ, రెడ్డి గారు స్నేహితుడు ద్వారా "బ్రహ్మచారి" నాటకంలో అవకాశం కల్పించారు. అప్పటికి కాలేజిలో పి.యు.సి చదువుతూ విరివిగా నాటకాలు వేసేవారు . అతని క్లాస్ మేట్ అయిన కోడి రామకృష్ణతో కలిసి నాటకాలు వేసేవాడు. బి.యస్.సిలో చేరినా చదువు పై ఆసక్తి లేకపోవడంతో ఆయన నాన్న గారు సినిమా రంగంలో ప్రవేశానికి 1971- మద్రాస్ లో అడుగు పెట్టారు. ఆ విధంగా దర్శకుడైయ్యారు.
1971లో ప్రముఖ దర్శకుడు బి.వి.ప్రసాద్ గారి వద్ద అప్రెంటిస్ గా మహమ్మద్ బిన్ తుగ్లక్ సినిమాకు చేరారు. 1972లో ఆయన కె.ఎస్.ఆర్.దాస్ వద్ద అసిస్టెంట్ డైరక్టరుగా ఊరికి ఉపకారి చిత్రానికి పనిచేసారు. తరువాత ఆయన 1973లో సాగర సంగమం చిత్రానికి దాసరి నారాయణరావు గారి వద్ద పనిచేసారు. 1980లో దర్శకునిగా మారే వరకు దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్ డైరక్టరు, అసోసియేట్ డైరక్టరు మరియు కో డైరక్టరుగా పనిచేసారు.
డైరక్టరుగా
ఆయన 1980 నుండి దర్శకత్వాన్ని చేపట్టారు. మొదట చందమామ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది పూర్తి కుటుంబ చిత్రం. కానీ ఈ చిత్రం విడుదల ఆలస్యమయింది.[4] ఈ చిత్రం 1982 వరకు విడుదల కాలేదు. ఆయన రెండవ, మూడవ మరియు నాల్గవ సినిమాలు వరుసగా నేను మా ఆవిడ, ఏమండోయ్ శ్రీమతిగారు మరియు ఇల్లంతా సందడి. ఈ చితాలు పరిపూర్ణ హాస్యభరితమైనవి.[4] యాదృచ్ఛికంగా చంద్రమోహన్ తో తీసిన 18 సినిమాలు విజయాలనందించాయి. ఆయన ప్రముఖ సినిమా నటులైన అక్కినేని నాగేశ్వరరావు (దాగుడు మూతల దాంపత్యం), శోభన్ బాబు ( సంసారం) మరియు కృష్ణంరాజు (యమధర్మరాజు) లతో కూడా సినిమాలూ చేసారు.
కొన్ని సినిమాలు
కామెడీ సినిమాలు
- పోలీస్ భార్య
- ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం
- ఇద్దరి పెళ్ళాల ముద్దుల పోలీస్
- రొటేషన్ చక్రవర్తి
- చిక్కడు దొరకుడు
- పరుగో పరుగు
- సుందరి సుబ్బారావు
- పెళ్ళాం చాటు మొగుడు
- సాహసం చేయరా డింబకా
- జ్యోతి బావకు పెళ్ళంట
ప్రేమ కథా చిత్రాలు
- తెల్లగులాబిలు
- సంసారము
- శిక్ష
- మానస వీణ
వ్యక్తిగత జీవితం
ఆయనకు భార్య (సాయిలక్ష్మి) మరియు ఇద్దరు కుమారులు (కిరణ్ మరియు సతీష్) ఉన్నారు.
మూలాలు
- A legacy of humour, The Hindu.
- Nandi Awards List (pp 15), Nandi Awards pdf file.
- ‘No greater school than a film studio’, The Hindu.
- Comedy is his forte, The Hindu.