రామన్నపేట్ (యాదాద్రి జిల్లా)

రామన్నపేట, తెలంగాణ రాష్ట్రములోని యాదాద్రి - భువనగిరి జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రం,గ్రామం.[1]

ఇది సమీప పట్టణం నల్గొండకు ఉత్తరాన 36 కిలోమీటర్ల దూరంలోఉంది.రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది,

గణాంక వివరాలు

రామన్నపేట బస్టాండు

మండల జనాభా: 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 51,534 - పురుషులు 25,683 - స్త్రీలు 25,851

గ్రామ జనాభా:2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2066 ఇళ్లతో, 10537 జనాభాతో 902 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5291, ఆడవారి సంఖ్య 5246.ఇక్కడ తెలుగు స్థానిక భాష.

సమీప మండలాలు

రామన్నపేట ఏరియా వైధ్యశాల

రామన్నపేట దక్షిణాన చిట్యాల మండల్, ఉత్తర దిశగా వలిగొండ మండల్, తూర్పు వైపున నార్కేట్పల్లి మండల్, పశ్చిమాన చౌటుప్పల్ మండల్ ఉన్నాయి.

సమీప పట్టణాలు

చిట్యాల్, చౌటుప్పల్,వలిగొండ ఉన్నాయి.

సమీప నగరాలు

భోనగిరి, జంగాన్, సూర్యపేట్, హైదరాబాద్,నల్గొండ

రవాణా సౌకర్యం

రోడ్డు ద్వారా

సమీప పట్టణం నల్గొండ నుండి రోడ్డు మార్గం రామన్నపేట వరకు ఉంది.

రైలు ద్వారా

రeమన్నపేట్ రైల్వే స్టేషన్, చిట్యాల్ రైలు స్టేషన్లు రామన్నపేట్కు దగ్గరి రైల్వే స్టేషన్లు.సికింద్రాబాద్ జంక్షన్ ప్రధాన రైల్వే స్టేషన్ రామన్నపేట్కు 72 కిలోమీటర్ల దూరంలో ఉంది

విశేషాలు

రామన్నపేట గ్రామంలో ఉన్న అలిసాహెబ్ హిల్స్ అనే సాంప్రదాయ రాజభవనము ఉంది.

రామన్నపేట్ 2009 వరకు అసెంబ్లీ నియోజకవర్గంగా కలిగి ఉంది.

రామన్నపేట్ నగరంలో మన్సిఫ్ కోర్టుతో సహా ప్రతి ప్రభుత్వ కార్యాలయాలతోఅన్ని ప్రాథమిక సదుపాయాలను కలిగి ఉంది. 

    ** సాగునీటి వనరులు **
     రామన్నపేట మండలం లో ప్రధాన సాగునీటి వనరు అయిన ఆసిఫ్ నహార్ కాలువ పారుతున్నది. ఈ కాల్వను నాటి నిజాం నవాబులు 1904 సంవత్సరంలో వలిగొండ మండలం నెమలి కాల్వ గ్రామం వద్ద మూసి నది కాల్వ పై ఆనకట్ట కట్టి కాలువను తవ్వించారు. ఈ కాలువ నీరు మొదటగా మండలంలోని ఇంద్రపాలానగరం పెద్ద చెరువు లోకి వెళ్లి అక్కడి నుండి లక్ష్మాపురం, శోభనాద్రిపురం, నీర్నేముల, దుబ్బాక, మునిపంపుల, పల్లివాడ, ఏన్నారం గ్రామాల చెరువులను, కుంటలను నింపుతూ ప్రవహిస్తోంది. పల్లివాడ గ్రామం వద్ద మూసీ నదిపై ఆనకట్ట కట్ట నుండి వరద కాలువ ద్వారా బాచుప్పల, సూరారం, కుంకుడుపాముల, బి తుర్కపల్లి గ్రామాల మీదుగా శాలిగౌరారం ప్రాజెక్ట్ లోనికి ఈ నీరు ప్రవహిస్తోంది. ఈ కాలువల ద్వారా సుమారు పదివేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 
  • లక్ష్మాపురం ఏటీ కాలువ ద్వారా 1890 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ కాలువ శోభనాద్రిపురం గ్రామంలోని మూసీ నది కత్వా నుండి ప్రవహిస్తూ మునిపంపుల చెరువులో కలుస్తుంది. ప్రస్తుతం ఈ కాలువ శిథిలావస్థలో ఉంది.
  • ధర్మరెడ్డిపల్లి, పిలాయిపల్లి, పాతరాచ కాలువలు

ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి, పాతరాచ కాల్వల నిర్మాణం పూర్తి అయితే మండలంలోని వెల్లంకి, సిరిపురం, రామన్నపేట, కోమ్మాయిగూడెం, జనంపల్లి, ఇస్కిల్ల, ఉత్తటూరు, కక్కిరేణి గ్రామాలలోని సుమారు 8వేల నుండి 10వేల ఎకరాల వరకు సాగు నీరు అందే అవకాశం ఉంది.  ప్రస్తుతం ఈ కాల్వలో మన పనులు సాగుతున్నయి.

    * కాలేశ్వరం కాల్వ...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు నుండి గోదావరి నీరు మండలానికి రానున్నాయి. ఈ మేరకు కు అధికారులు కాలువ తవ్వకం కోసం భూ సేకరణ పనులు ముమ్మరం చేశారు. ఈ కాలువ నిర్మాణం పూర్తయితే మండలంలో మరి కొన్ని వేల ఎకరాలకు సాగు నీరుతో పాటు త్రాగునీరు అందనుంది.

         

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.