మోటుపల్లి

మోటుపల్లి, ప్రకాశం జిల్లా, చినగంజాము మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్: 523 184., ఎస్.ట్.డి.కోడ్ = 08594.

మోటుపల్లి
  రెవిన్యూ గ్రామం  
మోటుపల్లి
అక్షాంశరేఖాంశాలు: 15.711669°N 80.282306°E / 15.711669; 80.282306
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం చినగంజాము
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,567
 - పురుషుల సంఖ్య 1,820
 - స్త్రీల సంఖ్య 1,747
 - గృహాల సంఖ్య 1,068
పిన్ కోడ్ 523184
ఎస్.టి.డి కోడ్

మోటుపల్లి రేవు (Motupalli), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము ప్రకాశం జిల్లాలోని చినగంజాము నుండి 12 కిలోమీటర్ల దూరములో ఉంది.

గ్రామ చరిత్ర

1298లో ప్రసిద్ధ యాత్రికుడు మార్కోపోలో ఇక్కడే తీరాన్ని చేరాడని భావిస్తారు. చరిత్రకారులకు, పరిశోధకులకు ఈ ప్రదేశము చాలా ముఖ్యమైనది. ప్రాచీన ఓడ రేవైన మోటుపల్లి 1వ శతాబ్దము నుండి అనేక రాజ వంశాల పాలనలో విరాజిల్లినది. పూర్వము బౌద్ధ క్షేత్రమైన మోటుపల్లిలో అనేక బౌద్ధ స్థూపాలు, శిల్పాలు కూడా ఉన్నాయి. మోటుపల్లిలో ఒక ప్రాచీన రామాలయము కూడా ఉంది. కాకతీయ గణపతి దేవుడు తన పాలనాకాలములో కట్టించిన ఏకైక దేవాలయము మోటుపల్లిలో 1249 ప్రాంతంలో కట్టించిన ఆలయమే.[2]

మార్కోపోలో సందర్శనా కాలములో మోటుపల్లిని ఒక తెలివైన రాణి పాలించేదని, ఆమె తన ప్రజలను న్యాయముగా సమానముగా పాలించేదని పేర్కొన్నాడు. ఆమె రాజ్యములోని ప్రజలు బియ్యము, మాంసము, పాలు, పండ్లు మరియు చేపలు తిని జీవించేవారని రాసాడు. ఇతరత్రా చెప్పుకోదగిన విషయాలలో రాజ్యంలోని వజ్రాల ఉత్పాదన గురించి, రాజులకు తగినటువంటి సున్నితమైన వస్త్రాల గురించి, పుష్కలమైన మృగసంపద, భారీ గొర్రెలను గురించిన సంగతులు రాసాడు.[3]

ఈ గ్రామానికి తూర్పుదిశలో అరమైలు విస్తీర్ణంలో బౌద్ధమత స్థల ఆనవాళ్ళు ఉన్నట్లు గుర్తించారు. 200 అడుగుల విస్తీర్ణం, 12 అడుగుల ఎత్తు ఉన్న దీనిని కాసులదిబ్బ అనిపిలుస్తున్నారు. ఇక్కడ నీటిగుంతలకోసం త్రవ్వడంతో ఇత్తడిసామాగ్రి, స్థూపానికి సంబంధించిన కొన్ని ఆధారాలు లభించినవి. ఒకప్పుడు ఇక్కడ మహా వెలుగు వెలిగిన బౌద్ధస్థూపం ఉన్నట్లు, తరువాత కాలగర్భంలో కలిసిపోయి, ఇక్కడ వీరభద్రస్వామి, కోదండరామస్వామి ఆలయాల నిర్మాణం జరిగినట్లు తెలియుచున్నది. [7]

గ్రామ భౌగోళికం

సమీప పట్టణాలు

వేటపాలెం 11.6 కి.మీ, నాగులుప్పలపాడు 16.8 కి.మీ, చీరాల 19.4 కి.మీ, ఇంకొల్లు 17.3 కి.మీ.

గ్రామ పంచాయతీ

  1. ఈ గ్రామ పంచాయతీ ఏర్పాటయినప్పటినుండి 1963-64 నుండి 1989 వరకూ, 5 విడతలుగా శ్రీ పండ్రాజు వెంకటరామారావు, మొత్తం 25 సంవత్సరాలు, ఈ గ్రామ సర్పంచిగా పనిచేశారు. మొదటి ధరావతు రు. 100-00. ఈయనకు పెద్దలు సంపాదించిన 120 ఎకరాలూ, 1989 నాటికి 50 ఎకరాలకు వచ్చింది. అంతా గ్రామానికి ఖర్చు చేశారు. కృష్ణానగరులో పేదలకు ఎసైన్ మెంట్, సీలింగు భూములు 40 ఎకరాలు, అడవీధిపాలెంలో 20 ఎకరాలు, రుద్రమాంబాపురంలో 70 ఎకరాలు, పేదలకు పంపిణీ చేయించారు. ప్రభుత్వ పాఠశాలలు, పేదలకు ఇళ్ళు, రహదర్ల అభివృద్ధి చేశారు. [4]
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కొండూరి గోవిందు, 22 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం.

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గామ విశేషాలు

మోటుపల్లి గ్రామ పంచాయతీ యానాదిసంఘంలో, 2015, ఏప్రిల్-30వతేదీనాడు, సింహవాహనంపై ఉన్న, లోహంతో చేసిన కనకదుర్గమ్మ ప్రతిమ బయటపడినది. [6]

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 3,567 - పురుషుల సంఖ్య 1,820 - స్త్రీల సంఖ్య 1,747 - గృహాల సంఖ్య 1,068

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,838.[4] ఇందులో పురుషుల సంఖ్య 1,433, మహిళల సంఖ్య 1,405, గ్రామంలో నివాస గృహాలు 763 ఉన్నాయి.

మూలాలు

వెలుపలి లంకెలు

[4] ఈనాడు ప్రకాశం; 2013, జూలై-11; 8వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2013, జూలై-25; 8వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2015, మే-2; 15వపేజీ. [7] ఈనాడు ప్రకాశం; 2015, డిసెంబరు-12; 8వపేజీ.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.


This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.