మైసూరు సామ్రాజ్యం
మైసూర్ రాజ్యం (కన్నడ ಮೈಸೂರು ಸಂಸ್ಥಾನ maisūru saṃsthāna ) (ఉర్దూ میسور سلطنت ) (1399–1947 AD) అనేది దక్షిణ భారతదేశంలో ఒక రాజ్యం, సాంప్రదాయికంగా ఆధునిక మైసూర్ నగర పరిసరాల్లో 1399లో దీనిని స్థాపించారనే భావన ఉంది. వడయార్ కుటుంబం పాలించిన ఈ సంస్థానం మొదట విజయనగర సామ్రాజ్యంలో ఒక సామంత రాజ్యంగా ఉండేది. విజయనగర సామ్రాజ్యం పతనం కావడంతో (సుమారుగా 1565) ఇది స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. 17వ శతాబ్దంలో నరసరాజ వడయార్ మరియు చిక్క దేవరాజ వడయార్ హయాంలో దీని యొక్క భూభాగం క్రమక్రమంగా విస్తరించబడింది, ప్రస్తుత దక్షిణ కర్ణాటక మరియు తమిళనాడులోని కొన్ని భాగాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఇది దక్షిణ దక్కను పీఠభూమి (దక్షిణాపథం) లో శక్తివంతమైన రాజ్యంగా అవతరించింది.
| దక్షిణ ఆసియా చరిత్ర సారాంశము భారత ఉపఖండ చరిత్ర | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
సొయనియన్ ప్రజలు (500,000 బిపి)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
రాతి యుగం (7000–3000 బిసి)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
కాంస్య యుగం (3000–1300 బిసి)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
ఇనుప యుగం (1200–26 బిసి)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
మధ్యకాలం సామ్రాజ్యాలు (21–1279 ఎడి)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
మధ్యయుగ దివంగత కాలం (1206–1596)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
ప్రారంభ ఆధునిక కాలం (1526–1858)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
వలసరాజ్యాల కాలం (1510–1961)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
ఇతర రాష్ట్రాలు (1102–1947)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
శ్రీలంక రాజ్యాలు
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
దేశచరిత్రలు
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
ప్రాంతీయ చరిత్రలు
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
ప్రత్యేక చరిత్రలు
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||
18వ శతాబ్దం ద్వితీయార్ధ భాగంలో అసలు పాలకుడు హైదర్ అలీ మరియు ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ హయాంలో ఈ రాజ్యం యొక్క సైనిక శక్తి మరియు అధికార పరిధి ఉన్నత స్థితికి చేరుకుంది. ఈ సమయంలో, మరాఠాలు, బ్రిటీష్వారు మరియు గోల్కొండ నిజాం రాజులతో ఈ రాజ్యం యుద్ధం చేసింది, నాలుగు ఆంగ్లో-మైసూర్ యుద్ధాలతో ఈ పోరు అంతిమ దశకు చేరుకుంది. మొదటి రెండు ఆంగ్లో-మైసూర్ యుద్ధాల్లో మైసూర్ రాజ్యం విజయం సాధించగా, మూడు మరియు నాలుగో యుద్ధాల్లో పరాజయం చవిచూసింది. 1799లో నాలుగో యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించిన తరువాత, ఈ రాజ్యంలో ఎక్కువ భూభాగాలను బ్రిటీష్వారు స్వాధీనం చేసుకున్నారు, ఈ పరిణామంతో దక్షిణ దక్షిణాపథంలో మైసూర్ రాజ్య ఆధిపత్యానికి తెరపడింది. అయితే బ్రిటీష్వారు ఒక స్వాధీన రాజ్యం రూపంలో మైసూర్ సింహసనాన్ని తిరిగి వడయార్ కుటుంబీకులకు అప్పగించారు, తరువాత ప్రాబవం కోల్పోయిన మైసూర్ రాజ్యం ఒక రాచరిక రాష్ట్రం (ప్రిన్స్లీ స్టేట్) గా అవతరించింది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు వడయార్లు ఈ రాష్ట్రాన్ని పాలించారు, తరువాత మైసూర్ భారతదేశంలో భాగమైంది.
రాచరిక రాష్ట్రంగా ఉన్నప్పటికీ, మైసూర్ భారతదేశంలో అత్యంత ఆధునిక మరియు పట్టణీకరణ చెందిన ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ కాలం (1799-1947) లో మైసూర్ భారతదేశంలో కళలు మరియు సాంస్కృతిక పరంగా ఒక ముఖ్యమైన కేంద్రంగా అవతరించింది. మైసూర్ రాజులు లలిత కళల్లో నైపుణ్యంగల భాష్యకారులుగా మరియు లేఖకులుగా మాత్రమే కాకుండా గొప్ప పోషకులుగా కూడా ఖ్యాతి గడించారు, ఈ రోజుకు కూడా సంగీతం మరియు కళల్లో వారి వారసత్వం కనిపిస్తుంది.
చరిత్ర
ప్రారంభ చరిత్ర

అనేక శిలా మరియు రాగి ఫలక శాసనాలు, మైసూర్ ప్యాలస్కు చెందిన గ్రంథాలు మరియు కన్నడ, పర్షియన్ మరియు ఇతర భాషల్లోని సమకాలీన సాహిత్య గ్రంథాలు ఈ రాజ్యం యొక్క చరిత్రకు మూలాలుగా ఉన్నాయి.[1][2][3] సాంప్రదాయిక మూలాలు ప్రకారం, ఆధునిక మైసూర్ నగరాన్ని కేంద్రంగా చేసుకొని ఒక చిన్న రాజ్యంగా ఈ సంస్థానం స్థాపించబడింది, దీనిని ఇద్దరు సోదరులు స్థాపించారు, వారి పేర్లు యడురాయ (విజయ అనే పేరుతో ఆయనను కూడా గుర్తిస్తారు) మరియు కృష్ణరాయ. వీరి మూలాలపై భిన్నమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి, ఇప్పటికీ ఈ అంశం చర్చనీయాంశంగా ఉంది; కొందరు చరిత్రకారులు వీరు ఉత్తర భారతదేశంలోని ద్వారక ప్రాంతానికి చెందినవారని సూచిస్తున్నారు, [4][5] ఇతరులు వీరు కర్ణాటకకు చెందినవారనే వాదన వినిపిస్తున్నారు.[6][7] యడురాయ స్థానిక రాజకుమారి చిక్కదేవరశిని వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది, "వడయార్" (వాచ్యంగా "ప్రభువు") అనే భూస్వామ్య పట్టాన్ని స్వీకరించారు, తరువాతి రాజవంశం ఈ పట్టాన్ని కొనసాగించింది.[8] వడయార్ కుటుంబం యొక్క మొదటి స్పష్టమైన ప్రస్తావన విజయనగర రాజు అచ్యుత దేవరాయ (1529-1542) హయాంలో 16వ శతాబ్దపు కన్నడ సాహిత్యంలో ఉంది; వడయార్లు తమ గురించి తాము ఏర్పాటు చేసిన మొట్టమొదటి శాసనాన్ని 1551 సంవత్సరానికి చెందినదిగా గుర్తించారు, దీనిని తిమ్మరాజ పాలనాకాలంలో ఏర్పాటు చేశారు.[9]
స్వయంప్రతిపత్తి: పురోగమనాలు మరియు తిరోగమనాలు
1565లో విజయనగర సామ్రాజ్యం పతనమయ్యే వరకు మైసూర్ దానికి ఒక సామంత రాజ్యంగా ఉండేది. ఈ సమయానికి, 300 మంది సైనిక సిబ్బంది రక్షకులుగా ఈ రాజ్యం ముప్పైమూడు గ్రామాలకు విస్తరించింది.[10] రాజు తిమ్మరాజ II కొన్ని పరిసర సంస్థానాలను స్వాధీనం చేసుకున్నారు, [11] మరియు రాజు బోలా చామరాజ IV (వాచ్యంగా "ముక్కుసూటి") ఈ రాజవంశంలో రాజకీయ ప్రాధాన్యత గల మొదటి రాజుగా ఖ్యాతి గడించారు, ఆయన నామమాత్రపు విజయనగర చక్రవర్తి అరవీడు రామరాయ హయాంలో స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు.[12] అరవీడు రామరాయ మరణం తరువాత, వడయార్లు తమ ఉనికిని చాటుకోవడం ప్రారంభించారు, రాజ వడయార్ I విజయనగర గవర్నర్ (మహామండలేశ్వరా ) అరవీడు తిరుమల నుంచి శ్రీరంగపట్నాన్ని స్వాధీనం చేసుకున్నారు - విజయనగర సామ్రాజ్యం పతనమవుతున్న దశలో చంద్రగిరిని రాజధానిగా చేసుకొని పాలించిన వెంకటపతిరాయ, ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో పరిధిలో, ఈ పరిణామానికి రహస్య ఆమోదం తెలిపారు.[13] రాజ వడయార్ I పాలనా కాలంలో కూడా భూభాగ విస్తరణ జరిగింది, ఈ సమయంలో ఉత్తరంవైపు జగ్గదేవరాయ నుంచి చెన్నపట్నాన్ని స్వాధీనం చేసుకున్నారు[13][14] - ఈ పరిణామం మైసూర్ను ఒక ప్రాంతీయ రాజకీయ శక్తిగా వెలుగులోకి తీసుకొచ్చింది.[15][16]
ఆపై, 1612-13 సమయానికి, వడయార్లు విస్తృతమైన స్వయంప్రతిపత్తిని పొందారు, అప్పటికీ వీరిని అరవీడు రాజులకు సామంతులుగానే పరిగణిస్తున్నప్పటికీ, చంద్రగిరికి కప్పం చెల్లింపులు మరియు ఆదాయ బదిలీలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే వీరికి భిన్నంగా తమిళ దేశ పాలకులు (నాయకులు ) చంద్రగిరికి 1630వ దశకం వరకు కప్పాలు చెల్లించారు.[13] చామరాజ V మరియు కాంతిరవా నరసరాజ I తమ భూభాగాన్ని ఉత్తరంవైపుకు మరింత విస్తరించడానికి ప్రయత్నించారు, బీజాపూర్ సల్తనత్ మరియు దాని యొక్క మరాఠా సామంత రాజ్యాలు వీరి ప్రయత్నాలను అడ్డుకున్నాయి, ఇదిలా ఉంటే 1638లో శ్రీరంగపట్నాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిన రాణాదుల్లా ఖాన్ నేతృత్వంలోని బీజాపూర్ సైన్యాన్ని వడయార్ రాజులు సమర్థవంతంగా తిప్పికొట్టారు.[17][18] తరువాత విస్తరణ చర్యలను దక్షిణంవైపు ఉన్న తమిళ దేశంపై చేపట్టారు, నరసరాజ వడయార్ సత్యమంగళం ప్రాంతాన్ని (ఆధునిక ఉత్తర కోయంబత్తూరు జిల్లా) స్వాధీనం చేసుకున్నారు, ఆయన తరువాత అధికారంలోకి వచ్చిన దొడ్డ దేవరాజ వడయార్ మరింత ముందుకెళ్లి మదురై రాజులపై విజయం సాధించడం ద్వారా తమిళ ప్రాంతాలైన ఈరోడ్ మరియు ధర్మపురిలను స్వాధీనం చేసుకున్నారు. మల్నాడుకు చెందిన కెలాడి నాయకాల దండయాత్రను కూడా విజయవంతంగా తిప్పికొట్టారు. ఈ కాలం తరువాత ఒక సంక్లిష్టమైన భౌగోళిక-రాజకీయ మార్పులు సంభవించాయి, ఈ సమయంలో, అంటే 1670వ దశకంలో, మరాఠాలు మరియు మొఘల్వారిని దక్కను ప్రాంతానికి పరిమితం చేశారు.[17][18]
మైసూర్ ప్రారంభ రాజుల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన చిక్క దేవరాజ (1672-1704) ఈ కాలంలోనే పాలన సాగించారు, ఆయన అత్యంత కఠిన పరిస్థితుల్లో మనుగడ సాధించడంతోపాటు, తమ భూభాగాన్ని మరింత విస్తరించారు. మరాఠాలు మరియు మొఘల్ రాజులతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా ఆయన ఈ విజయాలు సాధించారు.[19][20] రాజ్యం తరువాత కొద్ది కాలానికే తూర్పున సేలం మరియు బెంగళూరు, పశ్చిమాన హస్సాన్, ఉత్తరాన చిక్కమంగళూరు మరియు తుంకూర్ మరియు దక్షిణాన కోయంబత్తూరు వరకు విస్తరించింది.[21] ఈ విస్తరణ ఫలితంగా పశ్చిమ కనుమల నుంచి కోరమండలం మైదానం యొక్క పశ్చిమ సరిహద్దుల వరకు దక్షిణ భారతదేశం నడిబొడ్డున గణనీయమైన భూభాగాన్ని హస్తగతం చేసుకున్నప్పటికీ, ఈ రాజ్యం ఎటువంటి సముద్రతీరం లేకుండా అన్నివైపులా భూహద్దులకే పరిమితమైంది. దీనికి పరిష్కారం కోసం చిక్క దేవరాజ చేసిన ప్రయత్నాలు మైసూర్ రాజ్యానికి ఇక్కెరీకి చెందిన నాయకా రాజులు మరియు కొడగు (ఆధునిక కూర్గ్) రాజుల (రాజాలు ) తో యుద్ధాన్ని తెచ్చిపెట్టాయి; ఈ కాలంలో ఇక్కెరీ మరియు కొడగు రాజులు కనరా తీరాన్ని (ఆధునిక కర్ణాటక తీర ప్రాంతాలు) మరియు మధ్యలోని కొండ ప్రాంతాన్ని తమ మధ్య పంచుకొని పాలించేవారు.[22] ఈ యుద్ధం మిశ్రమ ఫలితాలు ఇచ్చింది, పెరియపట్నాన్ని మైసూర్ స్వాధీనం చేసుకున్నప్పటికీ, పాలుపారే వద్ద వెనుకంజ వేయాల్సి వచ్చింది.[23]

ఏదేమైనప్పటికీ, సుమారుగా 1704లో మూకరసు కాంతీరవా నరసరాజా II పాలనా పగ్గాలు చేపట్టిన తరువాత రాజ్యం మనుగడ మరియు విస్తరణ సాధ్యపడింది, భాగస్వామ్యం, చర్చలు, సందర్భానుసార సహాయక చర్యలు మరియు అన్ని దిశల్లోనూ దండయాత్రల ద్వారా ఇది సాధ్యపడింది. చరిత్రకారులు సంజయ్ సుబ్రమణ్యం మరియు సేతు మాధవరావు వెల్లడించిన వివరాల ప్రకారం, మైసూర్ గతంలో మొఘల్ సామ్రాజ్యంలో సామంత రాజ్యంగా ఉండేది. మైసూర్ రాజులు తనకు ఎప్పటికప్పుడు కప్పం (పేష్కష్ ) చెల్లించినట్లు మొఘల్ గ్రంథాలు సూచిస్తున్నాయి. ఇదిలా ఉంటే, చరిత్రకారుడు సూర్యనాథ్ కామత్ అభిప్రాయం ప్రకారం మొఘల్ రాజులు మైసూర్ను తమకు మిత్రరాజ్యంగా భావించేవారు, దక్షిణ భారతదేశంలో ఆధిపత్యం కోసం మొఘల్-మరాఠాల పోటీ ఫలితంగా ఈ పరిస్థితి ఏర్పడిందని సూచించారు.[24] 1720వ దశకానికి, మొఘల్ సామ్రాజ్యం పతనం కావడంతో, ఆర్కాట్ మరియు సిరా రెండు ప్రాంతాల్లో మొఘల్వారికి కప్పం వసూలు చేయడంలో ఇబ్బందులు తలెత్తాయి.[19] తరువాతి సంవత్సరాల్లో కృష్ణరాజ వడయార్ I కొడుగు పాలకులు మరియు మరాఠాలను తీరం వద్ద ఉంచుతూ ఈ విషయంపై జాగ్రత్తగా స్పందించారు. ఆయన తరువాత చామరాజ వడయార్ VI పాలనా పగ్గాలు చేపట్టారు, ఆయన పాలనా కాలంలో అధికారం ప్రధానమంత్రి (దాల్వాయ్ లేదా దాలావోయ్ ) నాంజరాజయ్య (లేదా నాంజరాజా) మరియు ముఖ్యమంత్రి (సర్వాధికారి ) దేవరాజయ్య (లేదా దేవరాజా) చేతుల్లోకి వెళ్లిపోయింది, నాంజన్గుడ్ సమీపంలోని కలాలే పట్టణానికి చెందిన ప్రభావవంతమైన ఈ ఇద్దరు సోదరులు తరువాతి మూడు దశాబ్దాలపాటు రాజ్యపాలన సాగించారు, వడయార్ కుటుంబీకులు నామమాత్రపు అధిపతులుగా ఉండిపోయారు.[25][26] కృష్ణరాజా II తరువాతి పాలనా కాలంలో దక్కను సుల్తానేట్లు మొఘల్ వారి ప్రభావంతో మరుగున పడ్డాయి, ఈ గందరగోళంలో ఒక సేనాధిపతి అయిన హైదర్ అలీ ప్రాచుర్యంలోకి వచ్చారు.[18] 1758లో బెంగళూరు వద్ద మరాఠాలపై సాధించిన విజయం ఫలితంగా వారి భూభాగం హైదర్ అలీ చేతికి వచ్చింది, ఆయన ఒక్కసారిగా ప్రముఖ నాయకుడిగా తెరపైకి వచ్చారు. ఆయన సాధనలకు గౌరవసూచకంగా, రాజు ఆయనకు "నవాబ్ హైదర్ అలీ ఖాన్ బహదూర్" పట్టం ఇచ్చారు[26]. అయితే అప్పటికే హైదర్ అలీ కొన్ని సైనిక విజయాలను చవిచూశారు. కర్నూలు నవాబును గెలిచి ఆయన రాజ్యాన్ని మైసూరు సామ్రాజ్యానికి సామంత రాజ్యం చేశారు[27].
హైదర్ మరియు టిప్పు హయాం

నిరక్ష్యరాస్యుడైనప్పటికీ, యుద్ధ నైపుణ్యాలు మరియు చురుకైన పాలన ఫలితంగా హైదర్ అలీ కర్ణాటక చరిత్రలో సుప్రసిద్ధ స్థానాన్ని పొందారు.[28][29] ఉపఖండంలో ముఖ్యమైన రాజకీయ పరిణామాలు సంభవిస్తున్న తరుణంలో హైదర్ అధికార పగ్గాలు చేపట్టారు. ఈ సమయంలో యూరోపియన్ రాజ్యాలు తమను తాము వాణిజ్య సంస్థల రూపం నుంచి రాజకీయ శక్తులుగా మార్చుకోవడంలో నిమగ్నమై ఉండగా, మొఘల్ సూబేదార్గా నిజాం దక్కను ప్రాంతంలో తన లక్ష్యాలను సాధించారు, మరాఠాలు పానిపట్ యుద్ధంలో పరాజయం తరువాత దక్షిణాదిలోని సురక్షిత ప్రాంతాలవైపు వెనుకంజ వేశారు. ఈ కాలంలో కర్ణాటకపై పట్టు కోసం బ్రిటీష్వారితో ఫ్రెంచ్వారు పోటీ పడ్డారు- ఈ పోటీలో బ్రిటీష్వారు అంతిమ విజేతలుగా నిలిచారు, బ్రిటీష్ కమాండర్ సర్ ఐర్ కూట్ నేతృత్వంలోని సైన్యం 1760లో జరిగిన వాండ్విష్ యుద్ధంలో కాంమ్టే డి లిల్లీ నేతృత్వంలోని ఫ్రెంచ్ సైన్యంపై నిర్ణయాత్మక విజయం సాధించింది, దక్షిణాసియాలో బ్రిటీష్వారి ఆధిపత్యాన్ని పటిష్ఠపరిచిన ఈ యుద్ధం భారతదేశ చరిత్రలో ఒక కీలక పరిణామంగా గుర్తించపడుతుంది.[30] ఈ కాలంలో మైసూర్కు వడయార్లు నామమాత్రపు అధిపతులుగా కొనసాగినప్పటికీ, అసలు అధికారం మాత్రం హైదర్ అలీ మరియు ఆయన కుమారుడు టిప్పు చేతుల్లోకి వెళ్లింది.[31]
1761నాటికి మరాఠాల ముప్పు తొలగిపోయింది, 1763నాటికి హైదర్ అలీ కెలాడీ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు, బిల్గీ, బిద్నూర్ మరియు గుత్తి రాజులపై కూడా విజయం సాధించారు, దక్షిణంవైపు మలబార్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు, 1766లో అలవోకగా జామోరిన్ రాజధాని కాలికట్ను కూడా స్వాధీనం చేసుకున్నారు, మైసూర్ రాజ్యాన్ని ధార్వాడ్ వరకు మరియు ఉత్తరాన బళ్లారి వరకు విస్తరించారు.[32][33] ఆపై ఉపఖండంలో మైసూర్ ఒక ప్రధాన రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది, ఎటువంటి ప్రాచుర్యంలేని స్థితి నుంచి ఒక్కసారిగా హైదర్ బలీయ శక్తిగా ఎదగడం మరియు ఆయన ధిక్కరణ భారత ఉపఖండంపై బ్రిటీష్వారు పూర్తి పెత్తనం సాధించేందుకు మిగిలిన చివరి సవాళ్లలో ఒకటిగా నిలిచాయి - బ్రిటీష్వారు హైదర్ అలీ నుంచి ఎదురైన ఈ సవాలును అధిగమించేందుకు మూడు దశాబ్దాల సమయం పట్టింది.[34]
హైదర్ అలీ మరింత బలీయమైన శక్తిగా మారకుండా అడ్డుకునేందుకు, బ్రిటీష్వారు మరాఠాలు మరియు గోల్కొండ నిజామ్తో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు, 1767లో జరిగిన మొదటి ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో ఈ భాగస్వామ్యంతోనే బ్రిటీష్వారు పోరాడారు. సంఖ్యాపరమైన ఆధిపత్యం సాధించినప్పటికీ, హైదర్ అలీ చెంఘామ్ మరియు తిరువన్నామళై యుద్ధాల్లో పరాజయం పాలైయ్యారు. హైదర్ అలీ వ్యూహాత్మకంగా మద్రాస్ (ఆధునిక చెన్నై) కు ఐదు మైళ్ల దూరం వరకు తన సైన్యాన్ని తరలించే వరకు బ్రిటీష్వారు ఆయన శాంతి చర్చల ప్రస్తావనను విస్మరించారు, చివరకు ఆయన ఈ వ్యూహం ద్వారా విజయవంతంగా బ్రిటీష్వారితో శాంతి కుదుర్చుకున్నారు.[30][33][35] 1770లో మాధవరావు పేష్వా యొక్క మరాఠా సైన్యం మైసూర్ను ఆక్రమించుకుంది (1764 మరియు 1772 మధ్యకాలంలో మాధవరావు మరియు హైదర్ అలీ మధ్య మూడు యుద్ధాలు జరిగాయి, వీటిలో హైదర్ పరాజయం పాలైయ్యారు), 1769 ఒప్పందంలో భాగంగా హైదర్ ఈ యుద్ధాల్లో బ్రిటీష్వారి మద్దతు అందుతుందని ఆశించారు, అయితే ఈ పోరుకు దూరంగా ఉండటం ద్వారా బ్రిటీష్వారు హైదర్ను మోసగించారు. బ్రిటీష్వారు చేసిన మోసం మరియు తరువాత తనకు ఎదురైన పరాజయాలు ఫలితంగా బ్రిటీష్వారిపై హైదర్ తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకున్నారు - ఈ ద్వేషాన్నే ఆయన కుమారుడు కూడా పంచుకున్నారు, తరువాతి మూడు దశాబ్దాల్లో జరిగిన ఆంగ్లో-మైసూర్ యుద్ధాలకు ఈ పగే ప్రధాన కారణంగా ఉంది.
1779లో హైదర్ అలీ ఆధునిక తమిళనాడు మరియు దక్షిణాన కేరళలోని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు, తద్వారా రాజ్యం యొక్క వైశాల్యాన్ని సుమారుగా 80,000 మై² (205,000 కిమీ²) కు పెంచారు.[33] 1780లో ఫ్రెంచ్వారితో స్నేహ సంబంధాలు పెట్టుకోవడం ద్వారా మరాఠాలు మరియు నిజామ్తో శాంతి కుదుర్చుకున్నారు.[36] అయితే హైదర్ అలీని మరాఠాలు మరియు నిజామ్ మోసగించారు, వీరు బ్రిటీష్వారితో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. జూలై 1779లో హైదర్ అలీ 80,000 మందితో కూడిన తన సైన్యంతో కర్ణాటకను ఆక్రమించుకున్నారు, ఈ సైన్యంలో ఎక్కువగా అశ్వదళం ఉంది, మంటల్లో భగ్గుమంటున్న గ్రామాల నడుమన కనుమల గుండా కిందివైపుకు వెళ్లి ఉత్తర ఆర్కాట్లోని బ్రిటీష్వారి కోటలను ముట్టడించేందుకు సన్నద్ధమయ్యారు, దీనితో రెండో ఆంగ్లో-మైసూర్ యుద్ధం మొదలైంది. హైదర్ అలీ బ్రిటీష్వారిపై కొన్ని ప్రారంభ విజయాలు సాధించారు, ముఖ్యంగా పొల్లిలూర్ వద్ద విజయం సాధించారు, చిల్లియన్వాలా మరియు ఆర్కాట్ యుద్ధాలు జరిగే వరకు భారతదేశంలో బ్రిటీష్వారికి ఎదురైన అతిపెద్ద పరాజయంగా ఇది గుర్తించబడింది, సర్ ఐర్ కూట్ రాకతో పరిస్థితి మారిపోయింది, తదనంతర పరిణామాల బ్రిటీష్వారికి అనుకూలంగా మారాయి.[37] 1781 జూన్ 1న సర్ ఐర్ కూట్ నిర్ణయాత్మక పోర్టో నోవో యుద్ధంలో హైదర్ అలీపై మొదటి ఘన విజయం సాధించారు. ప్రతి ఒక్కరికి ఐదు ప్రత్యర్థి మరణాలతో ఈ యుద్ధంలో సర్ ఐర్ కూట్ విజయం సాధించారు, భారతదేశంలో బ్రిటీష్వారు సాధించిన అత్యంత గొప్ప విజయాల్లో ఇది ఒకటిగా గుర్తించబడుతుంది. ఆగస్టు 27న పొల్లిలూర్ (బ్రిటీష్ సైన్యంపై హైదర్ ప్రారంభ విజయం ఇక్కడే సాధించారు) వద్ద హోరాహోరీగా సాగిన మరో యుద్ధంలో బ్రిటీష్వారు మరో విజయాన్ని దక్కించుకున్నారు, ఒక నెల తరువాత షోలింగూర్ వద్ద మైసూర్ సైన్యాన్ని బ్రిటీష్వారు వెనక్కు తప్పికొట్టారు. 1782 డిసెంబరు 7న హైదర్ అలీ మరణించారు, అప్పటికీ బ్రిటీష్వారితో యుద్ధం కొనసాగుతూనే ఉంది. తరువాత ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ అధికారంలోకి వచ్చారు, బిదనూర్ మరియు మంగళూరును తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా టిప్పు సుల్తాన్ కూడా బ్రిటీష్వారిపై యుద్ధాలు కొనసాగించారు.[33][38]
1783 వరకు బ్రిటీష్ సామ్రాజ్యం లేదా మైసూర్ రాజ్యానికి ఎవరికీ స్పష్టమైన సంపూర్ణ విజయం లభించలేదు. ఐరోపాలో శాంతి ఒప్పందం కుదిరిన ఫలితంగా మైసూర్ రాజ్యానికి ఫ్రెంచ్వారు తమ మద్దతు ఉపసంహరించుకున్నారు.[39] మైసూర్ పులిగా కీర్తించబడే టిప్పు సుల్తాన్ అయినప్పటికీ ఏమాత్రం భయపడలేదు, బ్రిటీష్వారిపై యుద్ధాన్ని కొనసాగించారు, అయితే ఆధునిక తీరప్రాంత కర్ణాటకలో కొన్ని ప్రాంతాలను బ్రిటీష్వారికి కోల్పోయారు. ఆయన తరువాత కిట్టూర్, నార్గుండ్ మరియు బదామీ భూభాగాలను మరాఠాలకు కోల్పోయారు. 1784లో మంగళూరు ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా బ్రిటీష్వారితో పోరుకు తాత్కాలిక మరియు సుఖశాంతులులేని విరామం లభించింది. ఇతరుల భూభాగాల్లో యుద్ధానికి ముందు స్థితి పునరుద్ధరించబడింది.[40][41] భారతదేశ చరిత్రలో ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన పత్రంగా గుర్తింపు పొందింది, ఒక భారతీయ రాజ్యం బ్రిటీష్వారికి నిబంధనలను నిర్దేశించిన చివరి ఒప్పంద పత్రం ఇదే కావడం గమనార్హం, శాంతి కోసం దీనిలో బ్రిటీష్వారు వినయపూర్వకమైన సరఫరాదారుల పాత్రను మాత్రమే పోషించాలని నిర్దేశించబడింది. బ్రిటీష్ మరియు ఫ్రెంచ్ వారి మధ్య ఐరోపాలో తాజాగా యుద్ధాలు మొదలు కావడంతో, టిప్పు సుల్తాన్ తన ఒప్పందం నుంచి బయటకు వచ్చేందుకు సమంజసమైన కారణం లభించింది, అంతేకాకుండా బ్రిటీష్వారిపై దాడి చేయాలనే తన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దీనిని ఆయన అవకాశంగా భావించారు.[42] నిజాం, మరాఠాలు, ఫ్రెంచ్వారు మరియు టర్కీ రాజుతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు టిప్పు సుల్తాన్ ప్రయత్నించారు, అయితే ఈ ప్రయత్నాల ద్వారా ఆయనకు ఎటువంటి ప్రత్యక్ష సైనిక సాయం లభించలేదు.[42]
1789లో బ్రిటీష్వారి మిత్రరాజ్యమైన ట్రావెన్కోర్ను స్వాధీనం చేసునేందుకు టిప్పు విఫలయత్నం చేశారు, ఈ పరాజయాన్ని టిప్పు సుల్తాన్ జీర్ణించుకోలేకపోయారు, అతి పరిమిత సంఖ్యలో ఉన్న ప్రత్యర్థి సైన్యం నుంచి ఎదురైన కాల్పులతో టిప్పు సైన్యం భయభ్రాంతులకు గురైంది, దీని ఫలితంగా మూడో ఆంగ్లో-మైసూర్ యుద్ధం ప్రారంభమైంది. ప్రారంభంలో బ్రిటీష్వారికి విజయాలు దక్కాయి, వారికి కోయంబత్తూరు జిల్లా స్వాధీనమైంది, అయితే టిప్పు ప్రతిదాడిలో వారు స్వాధీనం చేసుకున్న అనేక భూభాగాలను కోల్పోయారు. 1792లో వాయువ్యం నుంచి దాడి చేసిన మరాఠాలు మరియు ఈశాన్యంవైపు నుంచి దాడికి సైన్యాన్ని పంపిన నైజాం సాయంతో లార్డ్ కార్న్వాలిస్ నేతృత్వంలోని బ్రిటీష్ సైన్యం విజయవంతంగా శ్రీరంగపట్నాన్ని స్వాధీనం చేసుకుంది, దీంతో టిప్పు సుల్తాన్ పరాజయం పాలైయ్యారు, ఆపై శ్రీరంగపట్నం ఒప్పందం కుదిరింది. మైసూర్ రాజ్యంలో సగ భాగాన్ని మిత్రరాజ్యాలకు పంచిపెట్టారు, ఆయన ఇద్దరు కుమారులను విడిపించేందుకు ధనం చెల్లించాల్సి వచ్చింది.[40] అయినప్పటికీ అధైర్యపడని టిప్పు సుల్తాన్ తన ఆర్థిక మరియు సైనిక శక్తిని పునర్నిర్మించడంపై దృష్టి పెట్టారు. విప్లవ మార్పులకు లోనైన ఫ్రాన్స్, ఆఫ్ఘనిస్తాన్ అమీర్ మరియు ఒట్టోమన్ సామ్రాజ్యం మరియు అరేబియా నుంచి మద్దతు పొందేందుకు రహస్యంగా ప్రయత్నించారు. ఇదిలా ఉంటే, ఫ్రెంచ్వారి ప్రమేయం కోసం చేసిన ఈ ప్రయత్నాలు బ్రిటీష్వారికి త్వరగానే తెలిసిపోయాయి, మరాఠాలు మరియు నిజాం మద్దతుతో బ్రిటీష్వారు ఆ సమయంలో ఈజిప్టులో ఫ్రెంచ్వారితో యుద్ధం చేస్తున్నారు. 1799లో జరిగిన నాలుగో ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నాన్ని రక్షించడం కోసం యుద్ధం చేస్తూ మరణించారు, దీంతో మైసూర్ రాజ్యం యొక్క స్వాతంత్ర్యానికి పూర్తిగా తెరపడింది.[43] ఆధునిక భారతీయ చరిత్రకారులు టిప్పు సుల్తాన్ను బ్రిటీష్వారికి ఒక చిరకాల శత్రువుగా పరిగణిస్తారు, ఆయనను ఒక సమర్థవంతమైన పాలకుడిగా మరియు ఒక పరిశోధకుడిగా గుర్తిస్తున్నారు.[44]
రాచరిక రాష్ట్రం
టిప్పు పతనం తరువాత, మైసూర్ రాజ్యంలో ఒక భాగాన్ని స్వాధీనం చేసుకుని, మద్రాస్ ప్రెసిడెన్సీ మరియు నిజాం మధ్య పంచారు. నిజాంకు నేటి కడప, కర్నూలు జిల్లాలను పంచినట్టే పంచి క్రీ.శ.1800లో సైన్యఖర్చుల బాకీల కింద తిరిగి ఈస్టిండియావారే మద్రాస్ ప్రెసిడెన్సీలోకి జమకట్టుకున్నారు[27]. దీని ప్రకారం మిగిలిన భూభాగాన్ని ఒక రాచరిక రాష్ట్రం (ప్రిన్స్లీ స్టేట్) గా మార్చారు; వడయార్ కుటుంబంలోని ఐదేళ్ల వారసుడు కృష్ణరాజ IIIను సింహాసనాన్ని అధిష్టించే రాజుగా ఎంపిక చేశారు, గతంలో టిప్పు కింద పనిచేసిన పూర్ణయ్యను ముఖ్యమంత్రి (దివాన్ ) గా నియమించారు, రెజెంట్ మరియు లెప్టినెంట్ కల్నల్ బ్యారీ క్లోజ్ బ్రిటీష్ పాలకుడిగా పాలనా పగ్గాలు చేపట్టారు. మైసూర్ రాజ్యం యొక్క విదేశాంగ విధానం బ్రిటీష్వారి చేతుల్లోకి వెళ్లడంతోపాటు, మైసూర్లో ఒక బ్రిటీష్ దళాన్ని నిర్వహించేందుకు ఒక వార్షిక కప్పాన్ని మరియు సబ్సిడీని పొందారు.[45][46][47] బాల రాజు 16వ పుట్టినరోజు తరువాత 1811లో పదవీ విరమణ చేసే వరకు దివాన్గా పూర్ణయ్య (తరువాత కొంతకాలానికే ఆయన మరణించారు) పురోగమన మరియు వినూత్న పరిపాలనతో మంచి పేరు గడించారు.[48][49]

తరువాతి సంవత్సరాల్లో బ్రిటీష్వారు మరియు మైసూర్ పాలకుల మధ్య మంచి మైత్రీ బంధం ఏర్పడింది, 1820వ దశకంలో మరోసారి ఈ సంబంధాలు దెబ్బతినడం మొదలైంది. మైసూర్లో బ్రిటీష్వారి ప్రతినిధి ఏ.హెచ్. కోల్ ఆరోపించినట్లుగా ఎటువంటి ఆర్థికపరమైన అవకతవకలు జరగలేదని మద్రాస్ గవర్నర్ థామస్ మన్రో 1825లో జరిపిన ఒక వ్యక్తిగత దర్యాప్తులో గుర్తించినప్పటికీ, దశాబ్దం చివరి సమయానికి పెల్లుబికిన పౌర తిరుగుబాటు పరిస్థితులను గణనీయంగా మార్చివేసింది. 1831లో తిరుగుబాటు తీవ్రస్థాయికి చేరుకునే దశలో తప్పుడు పరిపాలన నెపంతో బ్రిటీష్వారు ఈ రాచరిక రాష్ట్రాన్ని తమ ప్రత్యక్ష నియంత్రణలోకి తీసుకున్నారు.[50][50][51] తరువాతి యాభై సంవత్సరాలపాటు, మైసూర్ బ్రిటీష్ కమిషనర్ల పాలనలో ఉంది; మంచి పాలకుడిగా పేరొందిన సర్ మార్క్ కుబ్బాన్ 1834 నుంచి 1861 వరకు పాలించారు, మైసూర్ను బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దిన సమర్థవంతమైన మరియు విజయవంతమైన పాలనా యంత్రాంగాన్ని ఆయన ఏర్పాటు చేశారు.[52] ఇదిలా ఉంటే, 1876-77లో, బ్రిటీష్ ప్రత్యక్ష పాలన ముగింపు సమయానికి మైసూర్ తీవ్రమైన కరువు కోరల్లో చిక్కుకుంది, ఈ కరువు కారణంగా సుమారుగా 700,000-1,100,000 లేదా జనాభాలో ఐదో వంతు మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనాలు ఉన్నాయియ[53] ఆ తరువాత కొద్దికాలానికే, బ్రిటీష్ వ్యవస్థలో విద్యావంతుడైన మహారాజా చామరాజా IX 1881లో మైసూర్ పాలనను చేపట్టారు, వడయార్ కుటుంబం నేతృత్వంలో ఏర్పాటు చేసిన చర్చా బృందం విజయవంతంగా పాలన అప్పగింతకు బ్రిటీష్వారిని ఒప్పించింది. దీని ప్రకారం ఒక బ్రిటీష్ అధికారి మైసూర్ కోర్టులో నియమించబడతారు, దివాన్ పాలనా కార్యకలాపాలు చూస్తారు.[54] ఆ తరువాత నుంచి 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు, బ్రిటీష్ రాజ్లో ఒక రాచరిక రాష్ట్రంగా నిలిచిపోయింది, వడయార్ల కుటుంబం అప్పటివరకు దానిని పాలించింది.
మహారాజా చామరాజా IX మరణించిన తరువాత, పదకొండు ఏళ్ల బాలుడిగా ఉన్న కృష్ణరాజా IV 1895లో సింహాసనాన్ని అధిష్టించారు. 1902 ఫిబ్రవరి 8న కృష్ణరాజా పాలనా పగ్గాలు చేపట్టే వరకు ఆయన తల్లి మహారాణి కెంపరాజామన్నియావరు రాజప్రతినిధిగా పాలన సాగించారు.[55] ఆయన పాలనలో సర్ ఎం. విశ్వేశ్వరయ్య దివాన్గా పనిచేశారు, మహారాజా ఈ కాలంలో మైసూర్ను పురోగమన మరియు ఆధునిక రాష్ట్రంగా తీర్చిదిద్దారు, ముఖ్యంగా పరిశ్రమలు, విద్య, వ్యవసాయం మరియు కళల్లో రాష్ట్రం పురోభివృద్ధి సాధించింది. మైసూర్లో సాధించిన ఈ పురోభివృద్ధి కారణంగా మహాత్మా గాంధీ మహారాజాను ఒక "రాజర్షి "గా కీర్తించారు.[56] బ్రిటీష్ తత్వవేత్త మరియు ఆసియా దేశాల నిపుణుడు పాల్ బ్రుంటన్ మరియు అమెరికా రచయిత జాన్ గుంథర్ మరియు బ్రిటీష్ పాలకుడు లార్డ్ సామ్యేల్ ఆయన చర్యలను ప్రశంసించారు. ఈ కాలంలో విద్యాపరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం చేసిన ప్రయత్నాలు తరువాతి దశాబ్దాల్లో కర్ణాటకకు అనేక అవకాశాలు తెచ్చిపెట్టాయి.[57] మహారాజా ఒక ప్రసిద్ధ సంగీత కళాకారుడు, తన పూర్వీకుల మాదిరిగానే లలిత కళల అభివృద్ధికి పోషకుడిగా ఉన్నారు.[58] ఆయన తరువాత సోదర తనయుడు జయచామరాజా అధికారంలోకి వచ్చారు, 1947 ఆగస్టు 9న భారత సమాఖ్యలో మైసూర్ను విలీనం చేస్తూ సంతకం చేయడంతో ఆయన పాలనకు తెరపడింది.
మైసూర్ రాజ్య పరిపాలన

విజయనగర సామ్రాజ్యం యొక్క పాలన సందర్భంగా (1399-1565) మైసూర్ భూభాగంలో పాలనా వ్యవహారాలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదు. మంచి వ్యవస్థీకృత మరియు స్వతంత్ర పరిపాలనకు సంబంధించిన సంకేతాలు రాజా వడయార్ I హయాం నుంచి కనిపించాయి, ఆయన రైతు ల పక్షపాతిగా ఉండేవారని తెలుస్తోంది, తన హయాంలో రైతులను పన్నుల పెంపు నుంచి మినహాయించినట్లు తెలుస్తోంది.[18] ముందుకాలపు విజయనగర సామ్రాజ్యంలో చెలామణిలో ఉన్నవాటిని పోలిన బంగారు నాణేలను (కాంతీరయి ఫణం ) ఈ రాజ్యం తమ భూభాగంలో విడుదల చేసినట్లు మొట్టమొదటి ఆధారాలు నరసరాజ వడయార్ పాలనలో లభించాయి.[59]
చిక్క దేవరాజా హయాంలో అనేక సంస్కరణలు అమలు చేయబడ్డాయి. రాజ్యం పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా అంతర్గత పరిపాలనలో మార్పులు చేయబడ్డాయి. తద్వారా పాలన మరింత సమర్థవంతంగా మారింది. ఒక తపాలా వ్యవస్థ ఆచరణలోకి వచ్చింది. సమాజంలో మరింత మందికి చేరువయ్యే ఆర్థిక సంస్కరణలు కూడా ప్రవేశపెట్టబడ్డాయి. ప్రత్యక్ష పన్నుల స్థానంలో అనేక సూక్ష్మ పన్నులు విధించారు, దీని ఫలితంగా భూమి పన్ను రూపంలో రైతులు మరింత ధనం చెల్లించాల్సి వచ్చింది.[60] కోశాగారంలోకి వచ్చే రోజువారీ ఆదాయం 90,000,000 పగోడా (ఒక నగదు ప్రమాణం) లో రాజు వ్యక్తిగత వాటాను తీసుకునేవారు- దీనిలో ఆయన తన వాటా కింద "తొమ్మిది కోట్ల నారాయణా"ల మొత్తం (నవకోటి నారాయణ ) తీసుకుంటారు. 1700లో ఔరంగజేబు దర్బారుకు రాజు ఒక దౌత్య బృందాన్ని పంపారు, ఈ సందర్భంగా రాజుకు ఔరంగజేబు జుగ్ దేవ రాజా అనే పట్టాన్ని ప్రదానం చేశారు, అంతేకాకుండా దంతపు సింహాసనంపై కూర్చునేందుకు అనుమతించారు. దీని తరువాత, ఆయన జిల్లా కార్యాలయాలు (అట్టారా కచేరీ ), పద్దెనిమిది విభాగాలతో కూడిన కేంద్ర సచివాలయాన్ని స్థాపించారు, ఆయన పాలనా యంత్రాంగం మొఘల్ వారి రూపంలోకి మార్చబడింది.[61]
హైదర్ అలీ పాలనా కాలంలో, రాజ్యాన్ని సమానమైన భూభాగాలు ఉన్న ఐదు రాష్ట్రాలు (అసోఫీస్ ) గా విభజించబడింది, వీటిలో మొత్తంమీద 121 తాలూకాలు (పరగణాలు ) ఉన్నాయి.[62] టిప్పు సుల్తాన్ నిజమైన పాలకుడిగా బాధ్యతలు చేపట్టే సమయానికి 160,000 kమీ2 (1.722225666674×1012 చ .అ) (62,000 మై²) వైశాల్యానికి రాజ్యం విస్తరించింది, దీనిని 37 ప్రావీన్స్లుగా విభజించారు, దీనిలో మొత్తం 124 తాలూకాలు (అమీల్ ) ఉన్నాయి. ప్రతి ప్రావీన్స్కు ఒక గవర్నర్ (అసోఫ్ ) మరియు ఒక డిప్యూటీ గవర్నర్ ఉండేవారు. ప్రతి తాలూకాకు అమీల్దార్ అని పిలిచే ఒక అధిపతి మరియు ప్రతి గ్రామ సమూహానికి పటేల్ అనే ఒక అధిపతి ఉండేవారు.[46] కేంద్ర పాలనా యంత్రాంగంలో ఆరు విభాగాలు ఉంటాయి, వీటికి మంత్రులు అధిపతులుగా ఉండేవారు, ప్రతి విభాగానికి నలుగురు సభ్యులతో కూడిన ఒక సలహా మండలి సహకరిస్తుంది.[63]
1831లో బ్రిటీష్వారి ప్రత్యక్ష పాలనలోకి వచ్చి రాచరిక రాష్ట్రంగా మారిన తరువాత ప్రారంభ కమిషనర్లుగా లూషింగ్టన్, బ్రిగ్స్ మరియు మోరిసన్ పనిచేశారు, వీరి తరువాత మార్క్ కుబ్బాన్ బాధ్యతలు చేపట్టారు, కుబ్బాన్ 1834లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.[64] ఆయన బెంగళూరును రాజధానిగా చేశారు, రాచరిక రాష్ట్రాన్ని నాలుగు డివిజన్లుగా విభజించారు, ప్రతి డివిజన్కు ఒక బ్రిటీష్ సూపరిండెంట్ ఉంటారు. రాష్ట్రాన్ని ఆపై 85 తాలూకా కోర్టులతో 120 తాలూకాలుగా ఉప విభజన చేశారు, దిగువ స్థాయి పాలన మొత్తం కన్నడ భాషలో జరిగేది.[64] కమిషనర్ కార్యాలయంలో ఎనిమిది శాఖలు ఉంటాయి; అవి రెవెన్యూ, తపాలా, పోలీస్, అశ్విక దళం, ప్రజా పనులు, వైద్య, జంతు సంరక్షణ, న్యాయ మరియు విద్యా శాఖలు. అత్యున్నత స్థాయిలో కమిషనర్ కోర్టుతో న్యాయవ్యవస్థలో అధికార క్రమం ఉంటుంది, కమిషనర్ కోర్టు కింద హుజూర్ అదాలత్, నాలుగు సూపరింటెండింగ్ కోర్టులు మరియు దిగువ స్థాయిలో ఎనిమిది సదర్ మున్సిఫ్ కోర్టులు ఉంటాయి.[65] 1862లో లెవిన్ బౌరింగ్ ప్రధాన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు, 1870 వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగారు. ఈ కాలంలో ఆస్తి రిజిస్ట్రేషన్ చట్టం, భారత శిక్షా స్మృతి మరియు నేర విచారణ ప్రక్రియ నిబంధన అమల్లోకి వచ్చాయి, న్యాయ వ్యవస్థను పాలనా యంత్రాంగం యొక్క కార్యనిర్వాహక భాగాల నుంచి వేరు చేశారు.[65]
అప్పగింత తరువాత, చెన్నైకు చెందిన రంగాచార్లును దివాన్గా చేశారు. ఆయన హయాంలో, 1881లో 144 మంది సభ్యులతో బ్రిటీష్ ఇండియాలో మొట్టమొదటి ప్రతినిధుల సభ ఏర్పాటయింది.[66] ఆయన తరువాత 1883లో శేషాద్రి బాధ్యతలు చేపట్టారు, ఆయన హయాంలోనే కోలార్ బంగారు గనుల్లో బంగారం త్రవ్వకం మొదలైంది. శివసముద్రం జలవిద్యుత్ ప్రాజెక్టు 1899లో ప్రారంభమైంది (భారతదేశంలో ఈ దిశగా జరిగిన మొదటి ప్రధాన ప్రయత్నం ఇదే కావడం గమనార్హం), బెంగళూరుకు విద్యుత్ మరియు త్రాగునీరు (తరువాత పైపుల ద్వారా) సరఫరా చేయబడింది.[67] శేషాద్రి అయ్యర్ తరువాత బాధ్యతలు చేపట్టిన పి.ఎన్. కృష్ణమూర్తి 1905లో రికార్డులు నిర్వహించేందుకు సచివాలయ పుస్తకాన్నిఏర్పాటు చేయడంతోపాటు, కో-ఆపరేటివ్ విభాగాన్ని ఏర్పాటు చేశారు, [67] ఆయన తరువాత బాధ్యతలు చేపట్టిన వి.పి. మాధవరావు అడవుల పరిరక్షణపై దృష్టి పెట్టారు, తరువాత టి. ఆనందరావు కన్నంబేడి జలాశయ ప్రాజెక్టును ఖరారు చేశారు.[68]
ఆధునిక మైసూర్ రూపకర్తగా ప్రసిద్ధి చెందిన సర్ ఎం.విశ్వేశ్వరయ్య కర్ణాటక చరిత్రలో ముఖ్య స్థానాన్ని పొందారు.[69] ఇంజనీర్గా విద్యావంతుడైన విశ్వేశ్వరయ్య 1909లో దివాన్గా బాధ్యతలు చేపట్టారు.[68][70] ఆయన హయాంలో మైసూర్ చట్ట సభలో సభ్యుల సంఖ్య 18 నుంచి 24కు పెంచారు, దీనికి రాష్ట్ర బడ్జెట్పై చర్చలు జరిపే అధికారాన్ని కల్పించారు.[68] మైసూర్ ఆర్థిక సదస్సును మూడు కమిటీలుగా విస్తరించారు; అవి పరిశ్రమ మరియు వాణిజ్యం, విద్య మరియు వ్యవసాయం, వీటికి ఆంగ్లం మరియు కన్నడ భాషల్లో ప్రచురణలు ఉన్నాయి.[71] ఆయన హయాంలో ప్రారంభమైన ముఖ్యమైన ప్రాజెక్టుల్లో కన్నంబాడీ జలాశయ నిర్మాణం ఒకటి, అంతేకాకుండా భద్రావతిలో మైసూర్ ఐరన్ వర్క్స్ ఏర్పాటు, 1916లో మైసూర్ విశ్వవిద్యాలయం స్థాపన, బెంగళూరులో యూనివర్శిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్థాపన, మైసూర్ రాష్ట్ర రైల్వే విభాగాన్ని ఏర్పాటు చేయడం మరియు మైసూర్లో అనేక ఇతర పరిశ్రమల స్థాపన ఆయన హయాంలోనే జరిగాయి. 1955లో ఆయనకు భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న అవార్డు లభించింది[71][72]
1926లో సర్ మీర్జా ఇస్మాయిల్ దివానుగా బాధ్యతలు స్వీకరించి ముందువారు చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కృషి చేశారు. భద్రావతి ఐరన్ వర్క్స్ను విస్తరించడం, భద్రావతిలో సిమెంట్ మరియు కాగిత కర్మాగారాన్ని స్థాపించడం, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్థాపన ఆయన హయాంలో జరిగాయి. ఉద్యానవనాలపై ఎంతో మక్కువ కనబర్చిన ఆయన బృందావన్ గార్డెన్స్ (కృష్ణరాజ సాగర్) ను నిర్మించడంతోపాటు, ఆధునిక మాండ్య జిల్లాలో 120,000 acres (490 kమీ2)లలో వ్యవసాయం కోసం కావేరీ నది నుంచి పెద్ద కాలువను త్రవ్వించారు.[73]
ఆర్థిక వ్యవస్థ
అధిక సంఖ్యలో ప్రజలు గ్రామాల్లో నివసించేవారు, వీరికి వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండేది. రాజ్యం యొక్క ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపై ఆధారపడి వుండేది. ధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు మరియు పువ్వులు పండించేవారు. చెరుకు మరియు పత్తి ప్రధాన వాణిజ్య పంటలుగా ఉండేవి. వ్యవసాయ జనాభాలో భూస్వాములు (గావుండా, జమీందార్, హెగ్గాడే ) కూడా భాగంగా ఉంటారు, భూమిలేని అనేక మంది కూలీలను ఉపయోగించు కొని వీరు వ్యవసాయం చేసేవారు, వీరికి జీతం కింద ధాన్యాన్ని ఇచ్చేవారు. అవసరమైనట్లయితే సన్నకారు రైతులు కూడా కూలీలుగా పని చేసేందుకు వెళ్లేవారు.[74] భూమిలేని కూలీలు అందుబాటులో ఉండటంతో రాజులు మరియు భూస్వాములు రాజ భవనాలు, ఆలయాలు, మసీదులు, జలాశయాలు మరియు చెరువుల వంటి నిర్మాణాలు చేపట్టారు.[75] భూమి అపారంగా అందుబాటులో ఉండటం, జనాభా అతి తక్కువగా ఉండటం వలన భూమి యజమాని వద్ద ఎటువంటి కౌలు వసూలు చేసేవారు కాదు. దీనికి బదులుగా, భూమి యజమానులు పంటసాగుకు పన్ను చెల్లించేవారు, మొత్తం పంటలో సగ భాగం వరకు పన్నుగా తీసుకునేవారు.[75]
టిప్పు సుల్తాన్ తన రాజ్యంలో వివిధ ప్రదేశంలో ప్రభుత్వ వ్యాపార గోదాములను స్థాపించారు. అంతేకాకుండా, కరాచీ, జెడ్డా మరియు మస్కట్ వంటి విదేశీ ప్రాంతాల్లో కూడా టిప్పు సుల్తాన్ గోదాములను ఏర్పాటు చేశారు, వీటిలో మైసూర్ ఉత్పత్తులు విక్రయించబడేవి.[76] టిప్పు సుల్తాన్ హయాంలో మొట్టమొదటిసారి వడ్రంగి మరియు లోహ పనులకు ఫ్రెంచ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు చెరుకు సాగుకు చైనీస్ పరిజ్ఞానాన్ని ఉపయోగించడం జరిగింది, పట్టు పురుగుల పెంపక పరిశ్రమలో బెంగాల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో మెరుగైన ఫలితాలు సాధ్యపడ్డాయి.[77] కనకపురా మరియు తారామండలం పేట్ ప్రదేశాల్లో వరుసగా ఫిరంగులు మరియు తుపాకీ మందు తయారీ కోసం ప్రభుత్వ కర్మాగారాలు ఏర్పాటు చేశారు. చక్కెర, ఉప్పు, ఇనుము, మిరియాలు, ఏలకులు, వక్క, పొగాకు మరియు చందనం వంటి నిత్యావసరాల ఉత్పత్తిలో ప్రభుత్వం గుత్తాధిపత్యం కలిగివుండేది, అంతేకాకుండా చందనం చెట్ల నుంచి సుగంధ నూనెను తీయడం మరియు వెండి, బంగారం మరియు విలువైన రాళ్ల త్రవ్వకాలు కూడా ప్రభుత్వ నియంత్రణలో ఉండేవి. చందనాన్ని చైనా మరియు పర్షియన్ గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసేవారు. రాజ్యంలో 21 ప్రదేశాల్లో పట్టు పురుగుల పెంపక కేంద్రాలు అభివృద్ధి చేయబడ్డాయి.[78]
బ్రిటీష్వారి హయాంలో ఈ వ్యవస్థలో మార్పు వచ్చింది, ఈ కాలంలో పన్ను చెల్లింపులు నగదు రూపంలో జరిగాయి, ఈ పన్నులను సైన్యం, పోలీసులు మరియు ఇతర పౌర మరియు ప్రభుత్వ కేంద్రాల నిర్వహణకు ఉపయోగించేవారు. భారతీయులు చెల్లించే కప్పంగా పన్నులో ఒక భాగం ఇంగ్లాండ్కు వెళ్లేది.[79] సాంప్రదాయిక ఆదాయ వ్యవస్థను కోల్పోవడంపై అసంతృప్తి మరియు తాము ఎదుర్కొంటున్న సమస్యల ఫలితంగా దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో రైతులు తిరుగుబాటు చేశారు.[80] 1800 తరువాత కార్న్వాలిస్ భూ సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. రీడ్, మున్రో, గ్రాహం మరియు థాకరే తదితరులు ప్రజల్లో ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు కృషి చేసినవారిలో కొందరు అధికారులు.[81] ఇదిలా ఉంటే స్వదేశీ వస్త్ర పరిశ్రమ బ్రిటీష్వారి హయాంలో తీవ్రంగా దెబ్బతింది, గ్రామీణ ప్రజల్లో ఆదరణ ఉన్న నాణ్యమైన వస్త్రాలు మరియు ముతక వస్త్రాలకు మాత్రం గిరాకీ తగ్గలేదు. మాంచెస్టర్, లివర్పూల్ మరియు స్కాట్లాండ్లలో ఉన్న వస్త్ర తయారీ కర్మాగారాల్లో వేగవంతమైన స్పిన్నింగ్ మరియు నేత కార్యకలాపాలకు స్థానిక చేనేత పరిశ్రమ ఏమాత్రం సరితూగలేకపోయింది, ఈ కారణంగానే దేశీయ చేనేత పరిశ్రమ కష్టాల్లో చిక్కుకుంది.[82][83]
ఇంగ్లాండ్లో ఆర్థిక విప్లవం మరియు బ్రిటీష్వారి రుసుము విధానాలు కూడా భారతదేశం మరియు మైసూర్ వ్యాప్తంగా తీవ్రమైన పారిశ్రామీకరణ వ్యతిరేక పరిస్థితికి కారణమయ్యాయి. ఉదాహరణకు, నార సంచులు నేసే వ్యాపారంలో గోనిగా పౌరుల గుత్తాధిపత్యం ఉండేది, ఈ ప్రాంతాన్ని బ్రిటీష్వారు పాలిస్తున్నప్పుడు వీరు ఈ గుత్తాధిపత్యాన్ని కోల్పోయారు. సాల్ట్పెట్రి (పొటాషియం నైట్రేట్) కోసం ఒక రసాయన ప్రత్యామ్నాయాన్ని దిగుమతి చేయడం ఉన్నత వర్గాన్ని కూడా ప్రభావితం చేసింది, వీరు తుపాకీ మందుగుండులో ఉపయోగించేందుకు అవసరమయ్యే సాల్ట్పెట్రికి సాంప్రదాయిక తయారీదారులుగా ఉండేవారు. కిరోసిన్ దిగుమతి చమురులు సరఫరా చేసే గానిగా వర్గాన్ని ప్రభావితం చేసింది. విదేశీ ఎనామిల్ మరియు టపాకాయల పరిశ్రమలు స్థానిక మృణ్మయ వ్యాపారాన్ని ప్రభావితం చేశాయి, మిల్లుల్లో తయారు చేసిన దుప్పట్లు, కంబళ్లుగా పిలిచే దేశీయ దుప్పట్ల స్థానాన్ని ఆక్రమించాయి.[84] ఈ ఆర్థికపరమైన పతనం వర్గ ఆధారిత సామాజిక సంక్షేమ సంస్థల ఏర్పాటుకు దారితీసింది, కొత్తగా ఏర్పడిన ఆర్థిక పరిస్థితిని తట్టుకొని నిలబడేందుకు తమ వర్గంలోని ప్రజలకు సాయం అందించడానికి, ముఖ్యంగా విద్య మరియు ఆవాసం కోరుకునే విద్యార్థుల కోసం యువజన వసతి కేంద్రాల ఏర్పాటు కోసం ఈ సంస్థలు ఏర్పడ్డాయి.[85] ఇదిలా ఉంటే బ్రిటీష్వారి ఆర్థిక విధానాలు ఒక తరగతి నిర్మాణాన్ని సృష్టించాయి, కొత్తగా ఏర్పడిన మధ్యతరగతిలో వివిధ వృత్తులవారు, వివిధ రంగాల ఉద్యోగులు చేరారు, ప్రతినిధులు, మధ్యవర్తులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ సిబ్బంది మరియు వైద్యులు ఈ తరగతిలోకి వచ్చారు. మరింత వహనీయ కుల అధిక్రమం కారణంగా, మధ్యతరగతిలో వివిధ కులాలకు చెందిన పౌరులు వచ్చి చేరారు.[86]
సంస్కృతి
మతం
_at_Shravanabelagola.jpg)

వడయార్ రాజవంశంలో ప్రారంభ రాజులు హిందూ దేవుడు శివుడిని పూజించారు. తరువాతి రాజులు, ముఖ్యంగా 17వ శతాబ్దం నుంచి వైష్ణవాన్ని స్వీకరించారు, ఆపై హిందూ దేవుడు విష్ణువును పూజించారు.[87] సంగీత అధ్యయనకారుడు మీరా రాజారామ్ ప్రాణేష్ అభిప్రాయం ప్రకారం, రాజ వడయార్ I విష్ణు భక్తుడు, బ్రాహ్మణులకు అండగా నిలబడటం ద్వారా రాజు దొడ్డ దేవరాజాకు బ్రాహ్మణుల పరిరక్షకుడిగా (దేవ బ్రాహ్మణ పరిపాలకుడు ) పట్టం పొందారు, మహారాజా కృష్ణరాజా III దేవత చాముండేశ్వరీ (హిందూ దేవత దుర్గ యొక్క ఒక అవతారం) భక్తుడు.[88] విల్క్స్ ("హిస్టరీ ఆఫ్ మైసూర్", 1800) అదనపు పన్ను వసూళ్లకు సంబంధించి ఒక జంగమ (శివుడిని ఆరాధించే వీరశైవులు) తిరుగుబాటు గురించి రాశారు, అయితే ఈ తిరుగుబాటును చిక్క దేవరాజా సమర్థవంతంగా అణిచివేశారు. చరిత్రకారుడు డి.ఆర్. నాగరాజ్ అభిప్రాయం ప్రకారం నాలుగు వందల మంది జంగమలు ఈ ప్రక్రియలో హత్య చేయబడ్డారు, ఈ వివాదం గురించి వీరశైవ సాహిత్యంలో ఎటువంటి ప్రస్తావన లేదు.[89] చరిత్రకారుడు సూర్యనాథ్ కామత్ వాదన ప్రకారం రాజు చిక్క దేవరాజా శ్రీవైష్ణవాన్ని పాటించేవారు (శ్రీ వైష్ణవాన్ని ఆచరించేవారు, ఇది వైష్ణవంలో ఒక వర్గం), ఆయితే ఆయన వీరశైవులకు వ్యతిరేకి కాదని అభిప్రాయపడ్డారు.[90] చరిత్రకారుడు అయ్యంగార్ వాదన ప్రకారం ప్రసిద్ధి చెందిన నరసరాజా I మరియు చిక్క దేవరాజలతోపాటు కొందరు రాజులు వైష్ణవులు, అయితే అందరు వడయార్ పాలకులు వైష్ణవులు కాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.[91] దక్షిణ భారతదేశ సాంస్కృతిక కేంద్రంగా ఆధునిక రోజు మైసూర్ నగరం అభివృద్ధి చెందడానికి సంబంధించిన ఆధారాలను వారు సార్వభౌమత్వం పొందిన కాలంలో గుర్తించారు.[92] రాజా వడయార్ I మైసూర్లో దసరా వేడుకలు నిర్వహించే సంప్రదాయాన్ని ప్రారంభించారు, వీరికి ముందు విజయనగర రాజ కుటుంబం కూడా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేది.[92][93]
మధ్యయుగం చివరి కాలంలో జైన మతం క్షీణించినప్పటికీ, మైసూర్ రాజులు ఈ మతానికి పోషకులుగా ఉన్నారు, మైసూర్ రాజులు శ్రావణబెళగోలా పట్టణంలో జైన సన్యాస కేంద్రాలకు ఉదారంగా విరాళాలు ఇచ్చారు.[92][94] శ్రావణబెళగోలాలో ముఖ్యమైన జైన మత కార్యక్రమం అయిన మహామస్తకాభిషేకం వేడుకలో కొందరు వడయార్ రాజులు పాల్గొనడంతోపాటు, 1659, 1677, 1800, 1825, 1910, 1925, 1940, మరియు 1953 సంవత్సరాల్లో వ్యక్తిగతంగా పూజలు కూడా నిర్వహించారు.[95]
దక్షిణ భారతదేశం మరియు ఇస్లాం మధ్య సంబంధాలు 7వ శతాబ్దం నుంచి ఉన్నాయి, ఈ సమయంలోనే హిందూ సామ్రాజ్యాలు మరియు ఇస్లామిక్ ఖిలాఫత్ ల మధ్య వ్యాపార సంబంధాలు బాగా వృద్ధి చెందాయి. ఈ ముస్లిం వ్యాపారులు మలబార్ తీరంలో స్థిరపడి, స్థానిక హిందూ మహిళలను వివాహం చేసుకున్నారు, వీరి వారసులు మాపిలాస్గా గుర్తింపు పొందారు.[96] 14వ శతాబ్దం సమయానికి ముస్లింలు దక్షిణ భారతదేశంలో గణనీయమైన మైనారిటీ వర్గంగా మారింది, పోర్చుగీసు మిషనరీల రాకతో వారి వృద్ధి నిలిచిపోయింది.[96] ముస్లిం మతస్తుడైనప్పటికీ హైదర్ అలీ తాను పాలిస్తున్న ఈ హిందూ రాజ్య పాలనా వ్యవహారాల్లో తన మత విశ్వాసాల జోక్యాన్ని అనుమతించలేదు. ఇదిలా ఉంటే చరిత్రకారులు హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్ యొక్క ఉద్దేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టిప్పు హిందువులకు తన పాలనా యంత్రాంగంలో ఉన్నత స్థానాలు కల్పించారని తెలుస్తోంది, హిందూ ఆలయాలకు మరియు బ్రాహ్మణులకు ఉదారంగా విరాళాలు ఇచ్చినట్లు మరియు ఇతర మత విశ్వాసాలను గౌరవించినట్లు చెబుతున్నారు, అయితే ఆయన హయాంలో జరిగిన మత మార్పిళ్లు తన అధికారంపై తిరుగుబాటు చేసినవారికి విధించిన శిక్షలు మాత్రమేనని చరిత్రకారులు సూచిస్తున్నారు.[97] ఇదిలా ఉంటే మలబార్, రాయచూర్ మరియు కొడగు ప్రాంతాల్లోని వారికంటే మైసూర్లోని ముస్లిం యేతరులను బాగా గౌరవించేవారని ఇతర చరిత్రకారులు వాదిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో క్రైస్తవులు మరియు హిందువుల చేత సామూహిక మత మార్పిళ్లు చేయించడానికి టిప్పు సుల్తాన్ బాధ్యుడని అభిప్రాయపడుతున్నారు, బలవంతంగా లేదా పన్ను ప్రోత్సాహకాలు కల్పించడం మరియు ఆదాయ ప్రయోజనాలు కల్పించడం వంటి మార్గాల ద్వారా మత మార్పిళ్లకు పాల్పడినట్లు వాదిస్తున్నారు.[98][99]
సమాజం

18వ శతాబ్దానికి పూర్వం, ప్రజల మధ్య సామాజిక సంబంధాల్లో పురాతన మరియు లోతుగా పాతుకుపోయిన నిబంధనలు పాటించేవారు. ఆ కాలానికి చెందిన యాత్రికులు అందించిన వివరాల ప్రకారం, సమాజంలో విస్తృతంగా హిందూ కుల వ్యవస్థ ఉండేది, తొమ్మిది రోజుల వేడుకలు సందర్భంగా (మహానవమి ) జంతు బలులు ఇచ్చేవారు.[100] తరువాత స్థానిక మరియు విదేశీ శక్తుల మధ్య పోరాటాల ఫలితంగా సైద్ధాంతిక మార్పులు సంభవించాయి. హిందూ సామ్రాజ్యాలు మరియు సుల్తానేట్ల మధ్య యుద్ధాలు కొనసాగినప్పటికీ, స్థానిక పాలకులు (ముస్లింలతోసహా) మరియు కొత్తగా వచ్చిన బ్రిటీష్వారి మధ్య పోరాటాలు ప్రధానమయ్యాయి.[62] ఆంగ్ల విద్య వ్యాప్తి చెందడం, ముద్రణ యంత్రం ప్రవేశపెట్టడం మరియు క్రైస్తవ మిషనరీలు స్థానిక సామాజిక వ్యవస్థపై చేసిన విమర్శల ఫలితంగా సమాజంలో పరిస్థితి మెరుగుపడింది. భారతదేశం వ్యాప్తంగా ఆధునిక జాతీయవాదం వృద్ధి చెందడం మైసూర్ను కూడా ప్రభావితం చేసింది.[101]
బ్రిటీష్వారు అధికారంలోకి రావడంతో, స్థానిక భాషల్లో సాంప్రదాయిక విద్యతోపాటు, ఆంగ్ల విద్యకు ప్రాధాన్యత పెరిగింది. ఈ మార్పులకు మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ లార్డ్ ఎల్ఫిన్స్టోన్ ఆజ్యులుగా గుర్తింపు పొందారు. ఆయన ప్రణాళిక 1841లో సెంట్రల్ కాలేజియేట్ ఇన్స్టిట్యూషన్ లేదా విశ్వవిద్యాలయ బోర్డు యొక్క రాజ్యాంగంగా మారింది.[102] అదే విధంగా, విశ్వవిద్యాలయం యొక్క ఉన్నత పాఠశాల విభాగం కూడా ఏర్పాటు చేయబడింది. మారుమూల ప్రాంతాల్లోకి విద్యను తీసుకెళ్లేందుకు ప్రధాన పట్టణాల్లో పాఠశాలలు ఏర్పాటు చేశారు, ఇవి చివరకు కళాశాల స్థాయికి అభివృద్ధి చెందాయి, ప్రతి కళాశాల అనేక స్థానిక పాఠశాలలకు (జిల్లా పాఠశాలలు) కేంద్రంగా మారింది.[103] మొట్టమొదటి ఆంగ్ల-మాధ్యమ పాఠశాల 1833లో మైసూర్లో ఏర్పాటు చేశారు, ఇటువంటి విద్య తరువాత ఈ ప్రాంతమంతా విస్తరించింది. 1858లో మైసూర్లో విద్యా శాఖ ఏర్పాటు చేయబడింది, 1881నాటికి మైసూర్ రాష్ట్రంలో సుమారుగా 2,087 ఆంగ్ల-మాధ్యమ పాఠశాలలు ఏర్పాటు చేశారు. బెంగళూరులో బెంగళూర్ సెంట్రల్ కాలేజ్ (1870), మైసూర్లో మహారాజా కాలేజ్ (1879), మహారాణి కాలేజ్ (1901) మరియు మైసూర్ విశ్వవిద్యాలయం (1916), మంగళూరులో సెయింట్ ఆగ్నెస్ కాలేజ్ (1921) ఏర్పాటు చేయడంతో ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది.[104]
సతి మరియు అంతరానితనము ఆధారిత సామాజిక వివక్ష వంటి దురాచారాలను తొలగించే లక్ష్యంతో జరిగిన సంఘ సంస్కరణలు, దిగువ తరగతుల దాస్య విమోచనకు డిమాండ్లు యావత్ భారతదేశంతోపాటు, మైసూర్ భూభాగాన్ని కూడా ప్రభావితం చేశాయి.[105] 1894లో ఎనిమిదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల వివాహాలను నిషేధించేందుకు రాజ్యంలో చట్టాలు చేయబడ్డాయి. వితంతు వివాహాలు మరియు నిరాశ్రయులైన మహిళలను వివాహం చేసుకోవడం ప్రోత్సహించబడ్డాయి, 1923లో మహిళలకు ఎన్నికల్లో ఓటు వేసేందుకు హక్కులు కల్పిస్తూ అనుమతి మంజూరు చేశారు.[106] ఇదిలా ఉంటే మైసూర్ భూభాగంలో బ్రిటీష్వారి అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు కూడా జరిగాయి, వీటిలో ముఖ్యమైనవి 1835నాటి కొడుగు తిరుగుబాటు (స్థానిక పాలకుడు చిక్కవీరరాజాను తొలగించిన తరువాత ఈ తిరుగుబాటు జరిగింది) మరియు 1837నాటి కనరా తిరుగుబాటు.[107] క్రైస్తవ మిషనరీలు ప్రవేశపెట్టిన ముద్రణ యంత్రాలు ఫలితంగా రాజ్యం వ్యాప్తంగా ముద్రణ కేంద్రాలు స్థాపించబడ్డాయి. పురాతన మరియు సమకాలీన కన్నడ పుస్తకాలు (పంపా భారత మరియు జైమినీ భారత వంటివి), ఒక కన్నడ-భాషా బైబిల్, ఒక ద్విభాషా పదకోశం మరియు కన్నడ సమాచార అని పిలిచే ఒక కన్నడ వార్తాపత్రిక ముద్రణలు 19వ శతాబ్దం ఆరంభంలో ప్రారంభమయ్యాయి.[108] ఆలూరు వెంకటరావు కన్నడ పౌరుల సాధనల గురించి వివరిస్తూ తన యొక్క కర్ణాటక గాథా వైభవ పుస్తకంలో ఒక సమగ్ర కన్నడ చరిత్రను అందించారు.[109]
సాంప్రదాయిక ఆంగ్ల మరియు సంస్కృత నాటకాలు, [110] మరియు స్థానిక యక్షగాన నాటకాలు కన్నడ నాటక రంగాన్ని ప్రభావితం చేశాయి, గుబ్బి వీరన్న వంటి ప్రసిద్ధ నాటక కళాకారులు వీటి ద్వారా ఆవిర్భవించారు.[111] ప్యాలస్ మైదానంలో పబ్లిక్ అడ్రస్ వ్యవస్థల ద్వారా ప్రసారం చేయబడే కర్ణాటక సంగీతాన్ని ప్రజలు ఆస్వాదించడం మొదలుపెట్టారు.[112] బెంగాల్ పునరుజ్జీవనోద్యం ద్వారా స్ఫూర్తి పొందిన మైసూర్ చిత్తరువులను సందరయ్య, అల సింగరయ్య మరియు బి. వెంకటప్ప తదితర కళాకారులు గీశారు.[113]
సాహిత్యం


కన్నడ సాహిత్యం అభివృద్ధిలో మైసూర్ రాజ్యపాలనా కాలం ఒక ముఖ్యమైన యుగంగా ఉంది. మైసూరు ఆస్థానంలో ప్రసిద్ధ బ్రాహ్మణ మరియు వీరశైవ రచయితలు మరియు సంగీత కళాకారులతోపాటు, [94][114] రాజులు కూడా లలిత కళల్లో తమ ప్రతిభను చాటుకున్నారు.[115][116] తత్వ శాస్త్రం మరియు మతానికి సంబంధించిన సాంప్రదాయిక సాహిత్యం ప్రాచుర్యంలోనే ఉండగా, చారిత్రక రచన, జీవిత చరిత్ర, చరిత్ర, విజ్ఞాన సర్వస్వం, నవల, నాటక మరియు సంగీత గ్రంథాల వంటి కొత్త కళా ప్రక్రియలు కూడా ప్రాధాన్యత పొందాయి.[117] యక్షగానా అనే పేరుతో పిలిచే నాటకీయ ప్రాతినిధ్యం గల జానపద సాహిత్యం యొక్క ఒక స్థానిక రూపం జనాదరణ పొందింది.[118][119] కన్నడ భాషపై తరువాతి కాలంలో ఆంగ్ల సాహిత్యం మరియు సాంప్రదాయిక సంస్కృత సాహిత్యం ప్రభావం చూపడం ఒక చిరస్మరణీయ పరిణామంగా గుర్తించబడుతుంది.[120]
శ్రీరంగపట్నానికి చెందిన గోవింద వడయ కాంతీరవా నరసరాజ విజయ అనే గ్రంథాన్ని రాశారు, ఇది తన పోషకుడైన రాజు నరసరాజా ఐను స్తుతిస్తూ రాయబడింది. దీనిని సాంగత్య ప్రమాణంలో (ఒక సంగీత పరికరాన్ని కనిపెట్టినందుకు గుర్తుగా దీనిని రాశారు), ఈ గ్రంథంలోని ఇరవై ఆరు అధ్యాయాల్లో రాజు యొక్క ఆస్థానం, జనరంజక సంగీతం మరియు ఆ కాలానికి చెందిన సంగీత కూర్పుల్లో రకాలను ప్రస్తావించారు.[121][122] రాజవంశంలో ప్రారంభ స్వరకర్తగా రాజు చిక్క దేవరాజా గుర్తింపు పొందుతున్నారు.[26][92] గీతా గోపాలా అని పిలిచే సంగీత ప్రసిద్ధ గ్రంథం ఆయనను ఉద్దేశించి రాయబడింది. జయదేవా యొక్క సంస్కృత రచన గీతా గోవింద నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ, దీనికి సొంత ప్రత్యేకత ఉంది, దీనిని సప్తపది ప్రమాణంలో రాశారు.[123] కన్నడ మాట్లాడే మొత్తం ప్రాంతంపై తమదైన ముద్రవేసిన సమకాలీన రచయితల్లో బ్రాహ్మణ రచయిత లక్ష్మీసా మరియు దేశదిమ్మరి అయిన వీరశైవ రచయిత సర్వాజ్ఞ ముఖ్యులు. సాహిత్య పరిణామాల్లో మహిళా రచయితలు కూడా తమ వంతు పాత్ర పోషించారు, చెలువాంబ (కృష్ణరాజ వడయార్ I పట్టపురాణి), హెలవనకట్టే గిరియమ్మ, శ్రీ రంగమ్మ (1685) మరియు సాంచి హోన్నమ్మ (హాదిబాడెయా ధర్మా, 17వ శతాబ్దం) ప్రసిద్ధ రచనలు చేశారు.[124][125]
బహుముఖ ప్రజ్ఞాశాలి నరసరాజా II వివిధ భాషల్లో పద్నాలుగు యక్షగానాలు రశారు, అయితే అన్నింటినీ ఆయన కన్నడ లిపిలోనే రాయడం జరిగింది.[126] మహారాజా కృష్ణరాజా III కన్నడలో ఒక ప్రసిద్ధ రచయితగా పేరొందారు, ఇందుకుగాను ఆయనకు అభినవ భోజా (మధ్యయుగ రాజు భోజాతో పోలుస్తూ ఈ బిరుదు ఇచ్చారు) అనే గౌరవ బిరుదు లభించింది.[58] ఆయన నలభైకిపైగా రచనలు చేసినట్లు తెలుస్తోంది, వీటిలో సంగీత గ్రంథం శ్రీ తత్వనిధి మరియు రెండు రూపాల్లో రాసిన సౌగంధికా పరిణయ అనే శృంగార కవిత, ఒక సాంగత్య మరియు ఒక నాటకం ప్రసిద్ధి చెందాయి.[127] మహారాజా పోషణలో, కన్నడ సాహిత్యం ఆధునిక హంగులు పొందింది. కెంపు నారాయణ యొక్క ముద్రమంజుషా ("ది సీల్ కాస్కెట్", 1823) ఆధునిక గద్య భాగంతో రూపొందిన మొట్టమొదటి రచనగా గుర్తింపు పొందింది.[128] ఇదిలా ఉంటే ముద్దన్న రాసిన చారిత్రాత్మకంగా ముఖ్యమైన అద్భుత రామాయణ (1895) మరియు రామాశ్వమేధం (1898) బాగా ప్రాచుర్యం పొందాయి, కన్నడ అధ్యయనకారుడు నరసింహ మూర్తి ఆయనను ఆధునిక కన్నడ సాహిత్యానికి జానూస్ (సాహిత్యంతో ముడిపడిన ఒక రోమన్ దేవత) గా పరిగణించారు. ముద్దన్న ఈ పురాతన ఇతిహాసాన్ని పూర్తిగా ఆధునిక కోణంలోకి మలిచారు.[129]
మైసూర్కు చెందిన మరియు మహారాజా కృష్ణరాజా III మరియు మహారాజా చామరాజా IX ఆస్థానంలో ప్రశస్తి గల వ్యక్తి బసవప్ప శాస్త్రి కన్నడ నాటక రంగ పితామహుడు (కన్నడ నాటక పితామహా ) గా ప్రసిద్ధి చెందారు.[92] ఆయన విలియం షేక్స్పియర్ యొక్క ఓథెల్లోను షురసేనా చారిట్గా అనువదించడంతోపాటు, కన్నడలో నాటకాలు రాశారు. సంస్కృతం నుంచి కన్నడలోకి ఆయన అనువదించిన అనేక ప్రసిద్ధ అనువాదాల్లో కాళిదాసా, అభిజ్ఞాన శాకుంతలా తదితరాలు ఉన్నాయి.[130]
సంగీతం
మహారాజా కృష్ణరాజా III మరియు ఆయన వారసులు చామరాజా IX, కృష్ణరాజా IV మరియు చివరి పాలకుడు జయచామరాజా హయాంలో మైసూరు ఆస్థానం అతిపెద్ద మరియు అత్యంత ప్రసిద్ధ సంగీత పోషణా కేంద్రంగా వెలుగొందింది.[131] తంజావూరు మరియు ట్రావెన్కోర్ ఆస్థానాలు కూడా కళాకారులకు గొప్ప సౌకర్యాలు కల్పించినప్పటికీ, కళను రక్షించడానికి కృషి చేయడం మరియు ఒక్కో సంగీత కళాకారుడికి రాజ మర్యాదలు చేయడం, ప్రజల్లో ఆసక్తి కల్పించేందుకు సంగీత పాఠశాలలు ఏర్పాటు చేయడం, ఐరోపా సంగీత ప్రచురణకర్తలు మరియు నిర్మాతలను పోషించడం ద్వారా మైసూర్ ఆస్థానం తన ప్రత్యేకత చాటుకుంది.[132] స్వయంగా సంగీత కళాకారుడు మరియు సంగీత అధ్యయనకారుడు అయిన మహారాజా కృష్ణరాజా III కన్నడ భాషలో అనుభవ పంచరత్న అనే పేరుతో అనేక జావలీస్ (తేలిక పాటలు) మరియు భక్తి గీతాలు స్వరపరిచారు. ఆయన స్వరకూర్పుల్లో వడయార్ రాజ కుటుంబ దైవత "చాముండి" లేదా "చాముండేశ్వరి"కి గౌరవసూచకంగా నోమ్ డి ప్లుమ్ (ముద్ర ) ఉంటుంది.[92] ఆయన వారసుడు చామరాజా IX 1891లో ఓరియంటల్ లైబ్రరీని స్థాపించారు, దీనిలో సంగీత గ్రంథాలు ఉంటాయి, ప్యాలస్ గ్రంథాలయం కోసం అనేక మంది సంగీత కళాకారుల యొక్క ఫోనోగ్రాఫ్ రికార్డింగ్లను కూడా ప్రారంభించారు.
కృష్ణరాజా IV హయాంలో కళకు మరింత పోషణ లభించింది. రాగా మరియు భావా లకు ప్రాధాన్యత ఇచ్చిన ఒక ప్రత్యేక సంగీత పాఠశాల ప్రారంభమైంది.[113][133][134] కళ యొక్క వ్యవస్థీకృత బోధనకు సాయపడిన రాయల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ను ప్యాలస్లో స్థాపించారు. కర్ణాటక స్వరాలు ముద్రించబడ్డాయి, రాజ సంగీత కళాకారులు ఐరోపా సంగీత సంకేతాలను ఉపయోగించడం మొదలుపెట్టారు. పాశ్చాత్య సంగీతం కూడా ప్రోత్సహించబడింది - రాజభవనం యొక్క సంగీత బృందంతో మార్గరెట్ కజిన్స్ పియానో కార్యక్రమాన్ని బెంగళూరులో బీథోవెన్ శతాబ్ది ఉత్సవాల్లో నిర్వహించారు.[131] ప్రసిద్ధ కర్ణాటక కృతుల (ఒక సంగీత స్వరం) స్వరకర్తగా పేరొందిన మహారాజా జయచామరాజా రష్యా సంగీత కళాకారుడు నికోలస్ మెడ్నెర్ మరియు ఇతరుల యొక్క రికార్డింగ్లను ప్రాయోజితం చేశారు.[131] ఆస్థానం కర్ణాటక సంగీతానికి కూడా ప్రాధాన్యత కల్పిస్తూ కార్యకలాపాలు నిర్వహించింది. రాజభవనం యొక్క సంగీత బృందం గ్రామోఫోన్ రికార్డింగ్లు తయారు చేసి, వాటిని విక్రయించింది.[135] సంగీత పరిజ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చారు. వివిధ పరికరాలను సేకరించేందుకు పెద్దఎత్తున నిధులు ఖర్చు చేశారు, సాంప్రదాయకంగా కాని కొమ్ములుండే వయోలిన్, థియర్మిన్ మరియు ఒక యాంత్రిక సంగీత వాయిద్యం అయిన కాలియాఫోన్లు కూడా సేకరణల్లో భాగంగా ఉన్నాయి.[136]
ఆ సమయానికి చెందిన అనేక మంది ప్రసిద్ధ విద్వాంసులు (విద్వాన్ ) మైసూరు ఆస్థానంలో ఉండేవారు. ఒక ఆస్థాన సంగీత కళాకారుడు వీణా శేషన్నా మహారాజా చామరాజా IX హయాంలో ఉన్నారు, [92] వీణను వాయించడంలో అత్యంత గొప్ప కళాకారుల్లో ఆయన ఒకరిగా పేరొందారు.[137] శాస్త్రీయ సంగీతంలో ఆయన సాధనల ఫలితంగా వాయిద్య కర్ణాటక సంగీత కళలో మైసూర్కు ఒక ప్రధాన స్థానం దక్కింది, ఆయనను మహారాజా కృష్ణరాజ వడయార్ IV వైనిక శిఖామణి అనే గౌరవ బిరుదుతో సత్కరించారు.[138][139] మైసూర్ వాసుదేవాచార్య ఒక ప్రసిద్ధ సంగీత కళాకారుడు, మైసూర్లో ఆయన సంస్కృతం మరియు తెలుగు భాషల్లో స్వరాలు కూర్చారు.[140] ఆయన మైసూర్ రాజుల్లో నాలుగు తరాల వారి పోషణను పొందిన ఏకైక కళాకారుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు, ముగ్గురు రాజుల వద్ద ఆయన ఆస్థాన సంగీత కళాకారుడిగా పని చేయడం గమనార్హం.[92][92] హెచ్.ఎల్. ముత్తయ్య భగవతార్ మైసూర్ ఆస్థానంలో ఉన్న మరో సంగీత స్వరకర్త.[141] త్యాగరాజ కాలం తరువాత అత్యంత ముఖ్యమైన స్వరకర్తల్లో ఆయన ఒకరిగా గుర్తించబడుతున్నారు, [92] సంస్కృతం, కన్నడ, తెలుగు మరియు తమిళ భాషల్లో ఆయన 400లకుపైగా స్వరాలు కూర్చారు, ఆయన కలం పేరు "హరికేశా". వయోలిన్ కళాకారుల్లో టి.చౌడయ్య ఆ కాలంలో ఒక అత్యంత ప్రసిద్ధ కళాకారుడిగా గుర్తింపు పొందారు. ఏడు తీగలు ఉండే వయోలిన్ను ఆయన కనిపెట్టినట్లు గుర్తిస్తున్నారు.[111][142] మహారాజా కృష్ణరాజ వడయార్ IV 1939లో చౌడయ్యను ఆస్థాన సంగీత కళాకారుడిగా నియమించారు, "సంగీత రత్న" మరియు "సంగీత కళానిధి" అనే బిరుదులు పొందారు. ఆయన కన్నడ, తెలుగు మరియు సంస్కృత భాషల్లో "త్రిమకుట" అనే కలం పేరుతో స్వర రచన చేశారు.[92]
వాస్తుశిల్పం

రాజ్యంలో రాజాస్థాన మరియు రాజ నిర్మాణాల యొక్క నిర్మాణ శైలి బ్రిటీష్వారి పాలనలో అనేక ప్రధాన మార్పులకు లోనైంది, స్థానిక శైలులతో ఐరోపా సంప్రదాయాలు కలిసిపోయాయి. రాజ్యంలోని హిందూ ఆలయాలను విలక్షణ దక్షిణ భారతదేశ ద్రావిడ శైలిలో - అంటే విజయనగర నిర్మాణ శైలిని సరళీకృతం చేసిన రూపం-లో నిర్మించారు.[143] అధికారంలో ఉన్నప్పుడు టిప్పు సుల్తాన్ తన రాజధాని శ్రీరంగపట్నంలో ఒక రాజ భవనాన్ని మరియు ఒక మసీదును నిర్మించారు. ఇదిలా ఉంటే మైసూర్ నగరం రాజ భవనాలకు ప్రసిద్ధి చెందింది, తద్వారా ఇది సిటీ ఆఫ్ ప్యాలెసెస్ అనే మారు పేరు పొందింది. నగరం యొక్క ప్రధాన రాజ భవనం మైసూర్ ప్యాలస్ను అంబా విలాస్ ప్యాలస్గా కూడా గుర్తిస్తారు. అగ్నిప్రమాదంలో అసలు భవన సముదాయం నాశనం కావడంతో, తాత్కాలిక అధిపతిగా ఉన్న మహారాణి ఒక కొత్త రాజభవనం నిర్మాణాన్ని ప్రారంభించారు, దీనికి ఆంగ్ల వాస్తుశిల్పి హెన్రీ ఇర్విన్ 1897లో నమూనా రూపొందించారు.[144] మొత్తంమీద ఈ నమూనాలో హిందూ, ఇస్లామిక్, ఇండో-సార్సెనిక్ మరియు మూరిష్ శైలులు అన్నీ కనిపిస్తాయి, దీని కోసం భారతదేశంలో మొట్టమొదటిసారిగా కొలమిలో కాల్చిన ఇనుప స్తంభాలు మరియు పైకప్పు ఫ్రేములను ఉపయోగించారు. వెలుపలివైపు చూడగానే ఆకట్టుకునేలా గ్రానైట్ స్తంభాలు ఉంటాయి, భవనం ముఖభాగంపై తోరణాలకు ఇవి మద్దతుగా ఉన్నాయి, నగిషీ చెక్కిన గోపురంతో ఉండే పొడవైన స్తంభంపై ఒక గొడుగు (చత్రి ) ఉంటుంది, దీని చుట్టూ ఇతర గోపురాలు ఉంటాయి.[145] పాలరాతి గోడలతో లోపలి భాగం ఆకర్షణీయంగా అలంకరించబడి ఉంటుంది, టీక్వుడ్ కప్పుపై హిందూ దేవతల శిల్పాలు చెక్కబడి ఉంటాయి. దర్బారు మందిరం నుంచి వెండి తలుపుల గుండా అంతర్గత వ్యక్తిగత మందిరంలోకి మార్గం ఉంటుంది. ఈ సంపన్నమైన గది నేలపై విలువైన జాతి రాళ్లతో పొదిగిన గచ్చు ఉంటుంది, స్తంభాలు మరియు తోరణాల మద్దతుతో మధ్యలో గాజు పైకప్పు చూడవచ్చు. రాజమందిర సముదాయంలోని కళ్యాణ మందిరంపై (కళ్యాణ మండపం ) నెమళ్ల నేపథ్యంతో అష్ణభుజ గాజు గోపురం ఉంటుంది.[146]


మహారాజా కృష్ణరాజా IV ఆదేశాలపై 1921లో ఈ.డబ్ల్యూ ఫ్రిట్చ్లెయ్ లలిత మహల్ ప్యాలస్ను నిర్మించారు. ఈ భవనం నిర్మాణ శైలి "పునరుజ్జీవనోద్యమ శైలి"గా పిలువబడింది, ఆంగ్ల మనోర్ హోస్లు మరియు ఇటాలియన్ పాలాజ్జోల వాస్తుశిల్ప కళా రీతులు దీనిలో కనిపిస్తాయి.[147] మధ్యలో ఉండే గోపురాన్ని లండన్లోని సెయింట్ పాల్స్ కేథడ్రల్ గోపురాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిర్మించినట్లు భావిస్తారు. దీనిలో ఇతర ముఖ్యమైన అంశాలు ఏమిటంటే ఇటాలియన్ పాలరాతి మెట్ల వరస, బాంక్వెట్ మరియు నృత్య మందిరాల్లో పాలిష్ చేసిన కలప గచ్చు మరియు బెల్జియన్ కట్ గాజు దీపాలు.[147] జగన్మోహన్ ప్యాలస్ నిర్మాణం 1861లో ప్రారంభమై 1910లో పూర్తయింది. మూడు అంతస్తుల ఈ భవనంలో ఆకర్షణీయమై గోపురాలు, ఫినియల్లు మరియు కుపోలాలు ఉంటాయి, ఇది అనేక రాజ వేడుకలకు వేదికగా ఉంది. ఇప్పుడు దీనిని చామరాజేంద్ర ఆర్ట్ గ్యాలరీగా పిలుస్తున్నారు, దీనిలో అనేక కళాఖండాల సేకరణను చూడవచ్చు.[148]
మానస గంగోత్రిగా కూడా పిలిచే మైసూర్ విశ్వవిద్యాలయం యొక్క ప్రాంగణంలో వాస్తుశిల్పానికి సంబంధించి ఆసక్తికరమైన పలు భవనాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఐరోపా శైలిలో ఉంటాయి, వీటి నిర్మాణం 19వ శతాబ్దం చివరి కాలంలో పూర్తయింది. వీటిలో జయలక్ష్మి విలాస్ మాన్షన్, క్రాఫోర్డ్ హాలు, ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (1887 మరియు 1891 మధ్యకాలంలో నిర్మించారు) భవనాల లోనిక్ మరియు కోరిన్థియాన్ స్తంభాలతో కనిపిస్తాయి, జిల్లా కార్యాలయాలు (అథరా కచేరీ, 1887) కూడా ఆసక్తికరమైన నిర్మాణాలు. ఒకప్పుడు బ్రిటీష్ కమిషనర్ కార్యాలయంగా ఉన్న అథరా కచేరీలో ఒక అష్టభుజ గోపురం మరియు దీని అందాన్ని మరింత పెంచే ఫైనియల్ ఉంటాయి.[149] 1880లో నిర్మించిన మహారాజా వేసవి విడిది భవనాన్ని లోకరంజన్ మహల్గా పిలుస్తారు, ఇది మొదట రాజ వంశీయులకు పాఠశాలగా ఉండేది. చాముండి కొండపై ఇండో-బ్రిటీష్ శైలిలో ఉన్న రాజేంద్ర విలాస్ ప్యాలస్ నిర్మాణాన్ని 1922లో ప్రారంభించారు, మహారాజా కృష్ణరాజా IV 1938లో దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు.[147] మైసూర్ పాలకులు నిర్మించిన ఇతర రాజ భవనాల్లో మైసూర్లోని చిత్తరంజన్ మహల్ మరియు బెంగళూరులో బెంగళూర్ ప్యాలస్ ముఖ్యమైనవి, బెంగళూర్ ప్యాలస్ను ఇంగ్లాండ్ యొక్క విండ్సోర్ కాజిల్ స్ఫూర్తితో నిర్మించారు.[150] సెంట్రల్ ఫుడ్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (చెలువాంబ మాన్షన్) ను బారోక్ యూరోపియన్ పునరుజ్జీవన శైలిలో నిర్మించారు, ఈ భవనం ఒకప్పుడు మహారాజా కృష్ణరాజ IV సోదరి, రాకుమారి చెలువంబామణి అవరు నివాసంగా ఉండేది. దీనిలో విస్తృతమైన పాలిస్టర్ అలంకరణలు మరియు మొసాయిక్ గచ్చు గమనార్హమైనవి.[151]
వడయార్లు నిర్మించిన అనేక ఆలయాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన చాముండేశ్వరీ ఆలయం చాముండి కొండపై ఉంది. ప్రారంభ నిర్మాణం 12వ శతాబ్దంలో జరిగింది, తరువాత ఈ ఆలయానికి మైసూర్ పాలకులు పోషకులుగా మారారు. మహారాజా కృష్ణరాజా III 1827లో ఈ ఆలయంలో ద్రావిడ-శైలి గోపురాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి దేవతల చిత్రాలు ఉన్న వెండి-ఫలకాలతో తలుపులు ఉంటాయి. ఇతర చిత్రాల్లో హిందూ దేవుడు వినాయకుడు మరియు మహారాజా కృష్ణరాజా III తన ముగ్గురు రాణులతో ఉంటారు.[152] మైసూర్లో ప్రధాన ప్యాలస్ పరిసరాల్లో మరియు కోట లోపల ఐదు ఆలయాలు ఉన్నాయి, వీటిని వివిధ కాలాల్లో నిర్మించారు. అవి ప్రసన్న కృష్ణస్వామి ఆలయం (1829), లక్ష్మీరమణ స్వామి ఆలయం (ఈ ఆలయం యొక్క ప్రారంభ నిర్మాణం 1499లో జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి), త్రినేశ్వర స్వామి ఆలయం (16వ శతాబ్దం), హోయసాలా శైలి వాస్తుశిల్పంతో పూర్ణయ్య నిర్మించిన శ్వేత వరాహ స్వామి ఆలయం, ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం (1836, ఈ ఆలయంలో పన్నెండు మంది వడయార్ పాలకుల కుడ్యచిత్రాలు ఉన్నాయి).[153] మైసూర్ నగరం వెలుపల ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో యాలీ ("పురాణ మృగం") స్తంభాలుగల వెంకటరమణ ఆలయం ముఖ్యమైనది, దీనిని బెంగళూరు కోటలో 17వ శతాబ్దం చివరి కాలంలో నిర్మించారు, శ్రీరంగపట్నంలోని రంగనాథ ఆలయం కూడా ప్రసిద్ధి చెందింది.[154]
టిప్పు సుల్తాన్ 1784లో శ్రీరంగపట్నంలో దరియా దౌలత్ ప్యాలస్ (వాచ్యంగా "సముద్ర సంపద తోట") అనే పేరుతో పిలిచే ఒక కలప స్తంభాలు గల రాజ భవనాన్ని నిర్మించారు. ఇండో-సార్సెనిక్ శైలిలో నిర్మించిన ఈ ప్యాలస్ ఆభరణాలను పోలిన తోరణాలు, నగిషీలు చెక్కిన స్తంభాలు మరియు గచ్చు ఆకృతులు మరియు చిత్తరువులకు ప్రసిద్ధి చెందింది. ప్యాలస్ యొక్క పశ్చిమ గోడపై కల్నల్ బైలీ సైన్యంపై కాంచీపురం సమీపంలోని పొల్లిలూర్ వద్ద టిప్పు సుల్తాన్ సాధించిన విజయాన్ని వర్ణించే కుడ్యచిత్రాలు ఉంటాయి. వీటిలో యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నప్పుడు టిప్పు సుల్తాన్ ఒక పుష్పగుచ్చం పరిమళాన్ని ఆస్వాదిస్తున్నట్లు చూపించే కుడ్యచిత్రం ఒకటి ఉంది. ఈ చిత్రంలో, ఫ్రెంచ్ సైనికులు మీసాలతో మరియు బ్రిటీష్ సైనికులు మీసాలు లేకుండా కనిపిస్తారు.[155][156] శ్రీరంగపట్నంలో టిప్పు సుల్తాన్ 1784లో గుంబాజ్ సమాధి నిర్మించారు. టిప్పు మరియు హైదర్ అలీ సమాధులు దీనిలో ఉన్నాయి. పాలరాతి ఆధారంపై ఇటుక మరియు పాలిస్టర్తో నిర్మించిన ఒక గోపురం ఉంటుంది.[157]
సైనిక పరిజ్ఞానం
మొట్టమొదటి ఇనుప-కేస్ గల మరియు లోహ-స్తంభంతో నిర్మించిన రాకెట్ ఫిరంగి దళాన్ని మైసూర్ రాజ్యాన్ని పాలించిన ముస్లిం రాజ టిప్పు సుల్తాన్ మరియు ఆయన తండ్రి హైదర్ అలీ 1780వ దశకంలో అభివృద్ధి చేశారు. ఆంగ్లో-మైసూర్ యుద్ధాల సందర్భంగా బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన అతిపెద్ద సైనిక బలంపై ఆయన విజయవంతంగా లోహ-స్తంభం గల రాకెట్లను ఉపయోగించారు. బ్రిటీష్వారు ఉపయోగించేవాటి కంటే మైసూర్ రాకెట్లు ఈ కాలంలో అత్యంత అధునాతనమైనవిగా గుర్తింపు పొందాయి, ముఖ్యంగా పేలుడు పదార్థాన్ని ఉంచేందుకు ఇనుప గొట్టాలు ఉపయోగించడం ద్వారా ఇవి సమర్థవంతమైనవిగా పేరొందాయి; దీని ద్వారా అధిక పీడనం మరియు సుదూర ప్రదేశాలపై క్షిపణి దాడులు చేయడం (2 km (1 mi) దూరం వరకు) సాధ్యపడింది. నాలుగో ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ చివరకు పరాజయం చవిచూసిన తరువాత మైసూర్ ఇనుప రాకెట్లను బ్రిటీష్వారు స్వాధీనం చేసుకున్నారు, బ్రిటీష్ రాకెట్ అభివృద్ధిలో ఇవి ప్రభావం చూపాయి, కాంగ్రెవ్ రాకెట్ల నిర్మాణానికి ఇవి స్ఫూర్తిగా నిలిచాయి, వీటిని ఆ వెంటనే నెపోలియన్ యుద్ధాల్లో ఉపయోగించారు.[158]
స్టీఫెన్ అలీవర్ ఫాట్ మరియు జాన్ ఎఫ్ గిల్మార్టిన్ జూనియర్లు ఎన్సైక్లోపీడియా బ్రిటానికా (2008) లో: మైసూర్ రాజు "హైదర్ అలీ" ఒక ముఖ్యమైన మార్పుతో యుద్ధ రాకెట్లను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు; దహనమయ్యే పొడిని ఉంచేందుకు లోహ స్తంభాలు ఉపయోగించడం ముఖ్యమైన మార్పుగా పేర్కొన్నారు. ఆయన ఉపయోగించిన సుత్తితోకొట్టి మృదువుగా చేసిన ఇనుము ముడిదైనప్పటికీ, నల్ల మందు పాత్ర యొక్క పేలుడు సామర్థ్యం ముందు కాలానికి చెందిన కాగిత నిర్మాణం కంటే బాగా ఎక్కువగా ఉంటుంది. తద్వారా అత్యధిక అంతర్గత పీడనం సాధ్యపడింది, దీంతో దూర ప్రాంతాలపై దాడికి అనువైన పరిస్థితి ఏర్పడింది. ఒక పొడవైన వెదురు కర్రకు తోలు వార్లతో రాకెట్ శరీరాన్ని కట్టేవారు. వీటి పరిధి మైలులో మూడో వంతుకు చేరుకుంది (అంటే కిలోమీటరుకుపైగా). ఈ రాకెట్లు బాగా కచ్చితత్వంతో కూడుకున్నవి కానప్పటికీ, వెదజల్లడంలో ఏర్పడే దోషానికి తక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ఎందుకంటే మూకుమ్మడి దాడుల్లో అనేక రాకెట్లను ఒకేసారి పేల్చేవారు. అశ్విక దళంపై ఇవి బాగా సమర్థవంతమైన ఆయుధాలుగా గుర్తింపు పొందాయి, ఇవి గాలిలోకి వెళ్లిన తరువాత మండి కఠినమైన పొడి నేలలోకి చొచ్చుకెళ్లేవి. హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్ రాకెట్ ఆయుధాలను అభివృద్ధిని కొనసాగించారు, ఆయన రాకెట్ దళాన్ని 1200 నుంచి 5000 మందికి పెంచినట్లు తెలుస్తోంది. 1791 మరియు 1799లో జరిగిన శ్రీరంగపట్నం యుద్ధాల్లో బ్రిటీష్వారిపై రాకెట్లు గణనీయమైన ప్రభావం చూపాయి.[159]
వీటిని కూడా చూడండి
- భారతదేశ సంస్థానాదీశుల రాష్ట్రాల జాబితా
- కేరళపై మైసూర్ దండయాత్ర
గమనికలు
- కామత్ (2001), పేజీలు 11–12, పేజీలు 226–227; ప్రాణేష్ (2003), పే. 11
- నరసింహచార్య (1988), పే 23
- సుబ్రహ్మణ్యం (2003), పే 64; రైస్ E.ప. (1921), పే. 89
- కామత్ (2001), పే 226
- రైస్ B.L. (1897), పే. 361
- ప్రాణేష్ (2003), పేజీలు 2–3
- విల్క్స్, ఐయంగర్ ఇన్ ఐయంగర్ అండ్ స్మిత్ (1911), పేజీలు 275–276
- ఐయంగర్ (1911), పే 275; ప్రాణేష్ (2003), పే 2
- స్టెయిన్ (1989), పే. 82
- Stein 1987, p. 82
- కామత్ (2001), పే. 227
- సుబ్రహ్మణ్యం (2001), పే. 67
- సుబ్రహ్మణ్యం (2001), పే 68
- వెంకట రామనప్ప, M. N. (1975), పే. 200
- కామత్ లో షమ రావు (2001), పే. 227
- వెంకట రామనప్ప, M. N. (1975), పే.201
- సుబ్రహ్మణ్యం (2001), పే 68; కామత్ (2001), పే. 228
- వెంకట రామనప్ప, M. N. (1975), పే. 201
- సుబ్రహ్మణ్యం (2001), పే.71
- కామత్ (2001), పేజీలు. 228–229
- సుబ్రహ్మణ్యం (2001), పే.69; కామత్ (2001), పేజీలు. 228–229
- సుబ్రహ్మణ్యం (2001), పే.69
- సుబ్రహ్మణ్యం (2001), పే. 70
- సుబ్రహ్మణ్యం (2001), పేజీలు. 70–71; కామత్ (2001), పే. 229
- ప్రాణేష్ (2003), పేజీలు. 44–45
- కామత్ (2001), పే. 230
- వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (కందనూరు నవాబు రాజరికం) (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
- కామత్ లో షమ రావు (2001), పే. 233
- ఒక మిలిటరీ నిపుణుడు మరియు అత్యంత భలం, తేజం మరియు సమృద్ధి కలిగిన వ్యక్తీ,(చోప్రా et al. 2003, పే. 76)
- వెంకట రామనప్ప, M. N. (1975), పే 207
- చోప్రా et al. (2003), పే. 71, 76
- చోప్రా et al. (2003), పే. 55
- కామత్ (2001), పే. 232
- చోప్రా et al. (2003), పే. 71
- చోప్రా et al. (2003), పే. 73
- చోప్రా et al. (2003), పే. 74
- చోప్రా et al. (2003), పే. 75
- చోప్రా et al. 2003, పే. 75
- వెంకట రామనప్ప, M. N. (1975), పే 211
- చోప్రా et al. (2003), పే. 78–79; కామత్ (2001), పే. 233
- చోప్రా et al. (2003), పే. 75–76
- చోప్రా et al. (2003), పే. 77
- చోప్రా et al. (2003), పేజీలు. 79–80; కామత్ (2001), పేజీలు. 233–234
- చోప్రా et al. (2003), పేజీలు. 81–82
- కామత్ (2001), పే. 249
- కామత్ (2001), పే 234
- వెంకట రామనప్ప, M. N. (1975), పే. 225
- వాక్య:"దివాన్ ఇండస్ట్రి మరియు సంపద వృద్ది కోసం తెలివైన మరియు అత్యంత ఉదారమైన విద్య పొందనున్నాడు " (Gen. వేల్లెస్లే ఇన్ కామత్ 2001, పే 249)
- వెంకట రామనప్ప, M. N. (1975), పేజీలు 226-229
- కామత్ (2001), పే. 250
- వెంకట రామనప్ప, M. N. (1975), పేజీలు. 229-231
- వెంకట రామనప్ప, M. N. (1975), పేజీలు. 231-232
- లివైస్ రైస్, B. 1881. మైసూర్ సెన్సస్ యోక్క నివేదిక. బెంగుళూరు: మైసూరు గవర్నమెంట్ ప్రెస్. పే 3
- కామత్ (2001), పేజీలు. 250–254
- [3] ^ రమా జోయిస్, M. 1984. లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఏన్షియంట్ లీగల్ జ్యుడిషియల్ అండ్ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ ఢిల్లీ: యూనివర్సల్ లా Pub. Co. పే 597
- [10] ^ పుట్టస్వామయ్య, K., 1980. ఎననమిక్ డెవలప్మెంట్ ఆఫ్ కర్నాటక ఎ ట్రీటైజ్ ఇన్ కంటిన్యుటీ అండ్ ఛేంజ్ న్యూఢిల్లీ: ఆక్స్ఫర్డ్ & IBH, పే. 3
- "The Mysore duo Krishnaraja Wodeya IV & M. Visvesvaraya". India Today. Retrieved 2007-10-23.
- [6] ^ ప్రాణేష్ (2003), పే 162
- కామత్ (2001), పే 228; వెంకట రామనప్ప, M. N. (1975), పే. 201
- వెంకట రామనప్ప, M. N. (1975), పే.203
- కామత్ (2001), పేజీలు 228–229; వెంకట రామనప్ప, M. N. (1975), పే. 203
- కామత్ (2001), పే. 233
- కామత్ (2001), పే. 235
- కామత్ (2001), పే. 251
- కామత్ (2001), పే. 252
- కామత్ (2001), పే. 254
- కామత్ (2001), పేజీలు. 254–255
- కామత్ (2001), పే. 257
- కామత్ (2001), పే. 259
- ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (2003), పే.139
- కామత్ (2001), పే 258
- ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (2003), పేజీలు.139–140
- కామత్ (2001), పే. 260
- శాస్త్రి (1955), పే. 297–298
- చోప్రా et al. (2003), పే. 123
- కామత్ లో M.H.గోపాల్ 2001, పే.235
- కామత్ (2001), పేజీలు. 235–236
- కామత్ (2001), పేజీలు. 236–237
- చోప్రా et al. (2003), పే. 124
- చోప్రా et al. (2003), పే. 129
- చోప్రా et al. (2003), పే. 130
- కామత్ (2001), పే. 286
- చోప్రా et al. (2003), పే. 132
- కామత్ (2001), పే. 287
- కామత్ (2001), పేజీలు. 288–289
- చోప్రా et al. (2003), పే. 134
- రైస్ E.పే (1921), పే. 89
- ప్రాణేష్ (2003), పే 5, పే.16, పే. 54
- పొల్లాక్ లో నాగరాజ్(2003), పే. 379
- కామత్ (2001), పే. 229
- ఐయంగర్ అండ్ స్మిత్ (1911), పే.304
- [6] ^ ప్రాణేష్ (2003), పే. 162
- ఐయంగర్ అండ్ స్మిత్ (1911), పే. 290
- కామత్ (2001), పేజీలు. 229–230
- సింగ్ (2001), పేజీలు. 5782–5787
- శాస్త్రి (1955), పే.396
- మొహిబుల్ హస్సన్ ఇన్ చోప్రా et al., 2003, పే. 82, part III
- చోప్రా et al. (2003), పే 82
- కామత్ (2001), పే. 237
- శాస్త్రి (1955), పే. 394
- కామత్ (2001), పే. 278
- చోప్రా et al. (2003), పే 185
- చోప్రా et al. (2003), పే. 186
- కామత్ (2001), పేజీలు. 278–279
- చోప్రా et al. (2003), పేజీలు. 196–197, పే. 202
- కామత్ (2001), పే. 284
- కామత్ (2001), పే. 275
- కామత్ (2001), పేజీలు. 279–280; మూర్తి (1992), పే 168
- కామత్ (2001), పే. 281; మూర్తి (1992), పే.172
- మూర్తి (1992), పే. 169
- కామత్ (2001), పే. 282
- ప్రాణేష్ (2003), ప.163
- కామత్ (2001), పే. 283
- నరసింహాచార్య (1988), పేజీలు. 23–27
- ముఖర్జీ (1999), పే 78; నరసింహాచార్య (1988), పే. 23, పే. 26
- కామత్ (2001), పేజీలు 229–230; ప్రాణేష్ (2003), ప్రిఫేస్ చాప్టర్ p(i)
- నరసింహాచార్య (1988), పేజీలు. 23–26
- నరసింహాచార్య (1988), పే.25
- కామత్ (2001), పే. 281
- మూర్తి (1992), పే 168–171; కామత్ (2001), పే. 280
- రైస్ E.పే (1921), పే. 90; ముఖర్జీ (1999), పే. 119
- కామత్ (2001), పే 227; ప్రాణేష్ (2003), పే. 11
- ముఖర్జీ (1999), పే. 78; ప్రాణేష్ (2003), పే 21
- ముఖర్జీ (1999), పే. 143, పే 354, పే. 133, పే 135; నరసింహాచార్య (1988), పేజీలు. 24–25
- ప్రాణేష్ (2003), పేజీలు. 33–34; రైస్ E.పే. (1921), పేజీలు. 72–73, పేజీలు. 83–88, పే. 91
- ప్రాణేష్ (2003), పేజీలు 37–38
- నరసింహాచార్య (1988), పే. 26; మూర్తి (1992), పే.167; ప్రాణేష్ (2003), పే. 55
- మూర్తి (1992), పే. 167
- మూర్తి (1992), పే. 170
- సాహిత్య అకాడమీ (1988), పే. 1077; ప్రాణేష్ (2003), పే.82
- వీడ్మన్ (2006), పే.66
- వీడ్మన్ (2006), పే. 65
- ప్రాణేష్ (2003), పే xiii ఆదర్స్ నోట్ లో
- కామత్ (2001), పే282
- వీడ్మన్ (2006), పే. 67
- వీడ్మన్ (2006), పే.68
- బక్షి (1996), పే.12; కామత్ (2001), పే.282
- ప్రాణేష్ (2003), పేజీలు.110–111
- Satish Kamat. "The final adjustment". Metro Plus Bangalore. The Hindu. Retrieved 2007-10-10.
- సుబ్రమణియన్ (2006), పే.199; కామత్ (2001), పే.282
- సుబ్రమణియన్ (2006), పే 202; కామత్ (2001), పే. 282
- ప్రాణేష్ (2003), పే. 214, 216
- మిచెల్, పే.69
- మంచండ (2006), పే. 158
- మంచండ (2006), పేజీలు.160–161
- మంచండ (2006), పే.161
- రామన్ (1994), పేజీలు.87–88
- రామన్ (1994), పేజీలు. 83–84, పేజీలు. 91–92
- రామన్ (1994), పే. 84
- బ్రాడ్నాక్ (2000), పే.294
- రామన్ (1994), పేజీలు. 81–82
- రామన్ (1994), పే. 85
- రామన్ (1996), పే. 83
- మిచెల్ పే.71
- రామన్ (1994), పే. 106
- అబ్రం et al. (2003), పే. 225
- అబ్రం et al. (2003), పేజీలు. 225–226
- రొడ్డం నరసింహ (1985). రాకెట్స ఇన్ మైసూరు అండ్ బ్రిటిన్, 1750-1850 A.D. నేషనల్ ఏరోనాటికల్ లేబొరేటరి అండ్ ఇండియన్ ఇన్స్టిట్యుట్ అఫ్ సైన్స్.
- ఎన్సైక్లోపెడియా బ్రిటాన్నికా (2008), "రాకెట్ అండ్ మిస్సైల్"
సూచనలు
- Abram, David; Edwards, Nick; Ford, Mike; Sen, Devdan; Wooldridge, Beth (2003). South India. Rough Guides. ISBN 1-84353-103-8.
- Aiyangar, Krishnaswami S. (1911). Ancient India: Collected Essays on the Literary and Political History of Southern India. New Delhi: (Facsimile Reprint 2004) Asian Educational Services. ISBN 81-206-1850-5.
- Bakshi, Shiri Ram (1996). Gandhi and the Congress. New Delhi: Sarup and Sons. ISBN 81-85431-65-5.
- Bradnock, Robert (2000) [2000]. South India Handbook - The Travel Guide. Footprint Travel Guide. ISBN 1-900949-81-4.
- Chopra, P. N.; Ravindran, T. K.; Subrahmanian, N. (2003). History of South India (Ancient, Medieval and Modern) Part III. New Delhi: Sultan Chand and Sons. ISBN 81-219-0153-7.
- Indian Science Congress Association (various authors), Presidential Address, vol 1: 1914-1947 (2003). The Shaping of Indian Science. Orient Blackswan. ISBN 81-7371-432-0.CS1 maint: Multiple names: authors list (link)
- Kamath, Suryanath U. (2001) [1980]. A concise history of Karnataka : from pre-historic times to the present. Bangalore: Jupiter books. OCLC 7796041. LCCN 809-5179.
- Manchanda, Bindu (2006) [2006]. Forts & Palaces of India: Sentinals of History. Roli Books Private Limited. ISBN 81-7436-381-5.
- Michell, George. "Temple Architecture: The Kannada and Telugu zones". The new Cambridge history of India: Architecture and Art of Southern India. Cambridge University Press. ISBN 0-521-44110-2.
- Mukherjee, Sujit (1999) [1999]. A Dictionary of Indian Literature. Orient Blackswan. ISBN 81-250-1453-5.
- Murthy, K. Narasimha (1992). "Modern Kannada Literature". In George K.M. Modern Indian Literature:An Anthology - Vol 1. Sahitya Akademi. ISBN 81-7201-324-8.
- Nagaraj, D.R. (2003) [2003]. "Critical Tensions in the History of Kannada Literary Culture". In Sheldon I. Pollock. Literary Cultures in History: Reconstructions from South Asia. Berkeley and London: University of California Press. ISBN 0-520-22821-9.
- Narasimhacharya, R (1988) [1934]. History of Kannada Literature. New Delhi: Asian Educational Services. ISBN 81-206-0303-6.
- Pranesh, Meera Rajaram (2003) [2003]. Musical Composers during Wodeyar Dynasty (1638–1947 A.D.). Bangalore: Vee Emm.
- Raman, Afried (1994). Bangalore - Mysore: A Disha Guide. Bangalore: Orient Blackswan. ISBN 0-86311-431-8.
- Rice, E. P. (1921). Kannada Literature. New Delhi: (Facsimile Reprint 1982) Asian Educational Services. ISBN 81-206-0063-0.
- Rice, B.L. (2001) [1897]. Mysore Gazatteer Compiled for Government-vol 1. New Delhi, Madras: Asian Educational Services. ISBN 81-206-0977-8.
- Sastri, Nilakanta K.A. (2005) [1955]. A history of South India from prehistoric times to the fall of Vijayanagar. New Delhi: Indian Branch, Oxford University Press. ISBN 0-19-560686-8.
- Singh, Nagendra Kr (2001). Encyclopaedia of Jainism. Anmol Publications. ISBN 81-261-0691-3.
- Stein, Burton (1987), Vijayanagara (The New Cambridge History of India), Cambridge and New York: Cambridge University Press. Pp. 156, ISBN 0-521-26693-9
- Subrahmanyam, Sanjay (2001). "Warfare and State Finance in Wodeyar Mysore". In Subrahmanyam, Sanjay. Penumbral Visions. Ann Arbor: University of Michigan Press. pp. 161–193. ISBN 978-0-472-11216-6.
- Subramaniyan, V.K. (2006) [2006]. 101 Mystics of India. Abhinav Publications. ISBN 81-7017-471-6.
- Various (1988) [1988]. Encyclopaedia of Indian literature - vol 2. Sahitya Akademi. ISBN 81-260-1194-7.
- Venkata Ramanappa, M. N. (1975) [1975]. Outlines of South Indian history : with special reference to Karnataka. Delhi : Vikas Pub. House ; London (38 Kennington La., SE11 4LS) : [Distributed by] Independent Pub. Co.,. ISBN 0-7069-0378-1.
- Weidman, Amanda J (2006) [2006]. Singing the Classical, Voicing the Modern. Duke University Press. ISBN 0-8223-3620-0.
