మృకండు మహర్షి
మృకండు మహర్షి మృగశృంగ మహర్షి కుమారుడు. ఈతని కుమారుడే మార్కండేయుడు.
జీవిత విశేషాలు
మృగశృంగ మహర్షి తపశ్శక్తిచే చనిపోయిన సువృత్తను మరల బ్రతికించెను. సువృత్త తండ్రి నుచథ్యుడు తన కూతురిని, ఆమె ముగ్గురు చెలికత్తెలైన కమల, విమల, సురసలను ఆతని కిచ్చి వివాహము చేసెను. వారు నలుగురు మహర్షి నెల్ల విధముల సేవలతో సంతోషపెట్టిరి. అతడును వారియెడ సమానప్రేమను చూపుచు ఆనందపరిచెను. వారు నలుగురు ఒక్కసారిగా గర్భములు ధరించి నలుగురు పుత్రులను గాంచిరి. అందు సువృత్త కుమారుడే మృకండుడు. కమల కుమారునికి ఉత్తముడు, విమలకు సుమతి, సురసకు సువ్రతుడు యని నామకరణము చేసెను.
మూలాలు
- మహర్షుల చరిత్రలు (ఏడవ సంపుటము), విద్వాన్ బులుసు వేంకటేశ్వర్లు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1989.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.