మూసా ప్రవక్త

మూసేసి కుటుంబానికి చెందిన అరటి ప్రజాతి మూసా కోసం ఇక్కడ చూడండి.

మూసా (అరబ్బీ موسى Musa ) మోషే (ఆంగ్లం : మోజెస్ Moses (క్రీ.పూ. 1436/1228 – 1316/1108 ) అబ్రహామిక మతస్తులకు గొప్ప ప్రవక్త. మొషే విగ్రహారాధనని తీవ్రంగా వ్యతిరేకించాడు. మోషే విగ్రహారాధకులని చిత్రహింసలు పెట్టి చంపినట్టు యూదుల బైబిల్లో కథలున్నాయి. ఇతని సోదరుడు హారూన్ / అహరోను కూడా ఒక ప్రవక్తే. మూసా యూదు మత స్థాపకుడు. ఇతనిపై అవతరింపబడ్డ గ్రంధములలో ఒకటైన తోరాహ్ ప్రకటింపబడింది.[1][2] ఈజిప్టు రాజైన ఫరో చక్రవర్తితో మాట్లాడి అల్లా అనుమతితో అనేక అద్భుతాలు చేసి ఎర్రసముద్రాన్ని చీల్చియూదులను ఈజిప్టు (ఐగుప్తు) నుండి పాలస్తీనా (మధ్యధరా సముద్రం మరియు జోర్డాన్ నది మధ్య ఉన్న దేశం) కు తరలిస్తాడు. ఫరో ఎర్రసముద్రంలో మునిగి చనిపోయేటప్పుడు అల్లాను నమ్ముతాడు.

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.