మారేమండ

మారేమండ గ్రామం కృష్ణా జిల్లా లోని విస్సన్నపేట మండలానికి చెందిన గ్రామం.

మారేమండ
  రెవిన్యూ గ్రామం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం విస్సన్నపేట
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి చాట్ల సావిత్రి
పిన్ కోడ్ 521215
ఎస్.టి.డి కోడ్ 08598

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

"మారేమండ" అనగా "మారెమ్మతల్లి స్థలం" అని అర్థము. ఈ ప్రాంత దైవము మారమ్మతల్లి.

గ్రామ భౌగోళికం

[1] సముద్రమట్టానికి 73 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

విస్సన్నపేట గ్రామానికి 4 కి.మీ దూరంలో ఉంది.

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

విస్సన్నపేట, పుట్రేల నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 56 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

జిల్లాపరిషత్ హైస్కూల్, వేమిరెడ్డిపల్లి శ్రీ ప్రజ్నహైస్కూల్, విస్సన్నపేట

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

పెద్ద చెరువు.

గ్రామ పంచాయతీ

  1. ఈ గ్రామం 2001 వరకూ తాతకుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలో అనుబంధ గ్రామంగా ఉండేది, 2001 లో ప్రత్యేక పంచాయతీగా ఆవిర్భవించింది. 2001లో ప్రథమంగా ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో గ్రామస్థులు సర్పంచిగా శ్రీ వడిత్యా భద్రుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ గ్రామం ఆయన హయాంలో నిర్మల్ పురస్కారానికి ఎన్నికైనది.
  2. 2006 లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో గ్రామస్తులు శ్రీ చాపలమడుగు దేవసహాయం ను సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరు తన హయాంలో మన రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారి నుండి ఉత్తమ సర్పంచిగా పురస్కారం గ్రహించారు.
  3. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి చాట్ల సావిత్రి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

ఈ గ్రామంలో ప్రసిద్ధ రామాలయం ఉంది.. ఈ గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరం ఉత్సవాలను జరుపుకుంటారు.

గ్రామంలో ప్రధాన పంటలు

మామిడి, వరి, చెరకు పండిస్తుంటారు.

గ్రామంలో ప్రధాన వృత్తులు

ఈ గ్రామ ప్రజల్లో అనేక మంది వ్యవసాయదారులు.

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

ఈ గ్రామ సమీపంలో వేప చెట్టు ఉంది. దీని వయస్సు 150 సంవత్సరాలు ఉంటుంది..

విస్సన్నపేటలోని ఇండేన్ గ్యాస్ కంపెనీవారు దత్తత తీసుకున్న విస్సన్నపేట మండలంలోని రెండు గ్రామాలలో ఇది ఒకటి. ఆ కంపెనీవారు ఈ గ్రామస్తులందరికీ గ్యాస్ కనెక్షన్ పంపిణీ చేసారు. అందువలన అధికారులు ఈ గ్రామానికి, 2016, ఫిబ్రవరి-1వ తేదీనాడు, పొగరహిత గ్రామం గా ధృవీకరణ పత్రం అందజేసినారు. ఈ గ్రామంలో మొత్తం 232 కుటుంబాలు ఉండగా, 46 గృహాలకు ఇదివరకే గ్యాస్ కనెక్షన్ ఉంది. ఇప్పుడు మిగతా 186 మందికి గూడా, "దీపం" పథకం క్రింద గ్యాస్ కనెక్షన్ పంపిణీ చేయడంతో గ్రామం పొగరహిత గ్రామంగా తయరైనది. [2]

మూలాలు

వెలుపలి లింకులు

[1] ఈనాడు కృష్ణా; 2013, జూలై-18; 11వపేజీ. [2] ఈనాడు కృష్ణా; 2016, ఫిబ్రవరి-2; 10వఫేజీ.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.