మాడా వెంకటేశ్వరరావు
మాడా (అక్టోబర్ 10, 1950 - అక్టోబర్ 24, 2015) అని పిలువబడే మాడా వెంకటేశ్వరరావు ప్రముఖ తెలుగు నటుడు. ఇతడు నపుంసక పాత్రలకు పెట్టింది పేరు.
| మాడా | |
![]() లంబాడోళ్ళ రాందాసు చిత్రంలో మాడా | |
| జన్మ నామం | అభినయకళానిధి మాడా వెంకటేశ్వరరావు |
| జననం | 1950 అక్టోబరు 10 [1] |
| మరణం | అక్టోబర్ 24, 2015 [2] హైదరాబాదు |
| ప్రముఖ పాత్రలు | చిల్లరకొట్టు చిట్టెమ్మ-పున్నయ్య లంబాడోళ్ళ రాందాసు మాయదారి మల్లిగాడు ముత్యాలముగ్గు సఖియా శివయ్య |
జీవిత విశేషాలు
1950, అక్టోబర్ 10 న వెంకటేశ్వరరావు తూర్పు గోదావరి జిల్లా, కడియంలో జన్మించారు. సినిమాల్లోకి రాకముందు విద్యుత్ సంస్థలో ఉద్యోగం చేసేవారు. ఆ సమయంలో పలు నాటకాల్లో నటించారు. ముత్యాలముగ్గు, చిల్లరకొట్టు చిట్టెమ్మ సినిమాలతో మాడకు మంచి గుర్తింపు లభించింది. లంబాడోళ్ల రాందాసు, మాయదారి మల్లిగాడు, ముత్యాలముగ్గు, సఖియా, శివయ్య వంటి చిత్రాలలో నటించారు. మాడాకు అభినయ కళానిధి అనే బిరుదు ఉంది. చూడు పిన్నమ్మ అనే పాత్రతో మాడాకు మంచి గుర్తింపు వచ్చింది.[3]
నేపథ్యము
చలన చిత్రాలలో నటించడానికి ముందు ఇతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ విభాగంలో ఉప సాంకేతిక అధికారిగా పనిచేశాడు[4].
నటించిన సినిమాలు
ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
- మాయదారి మల్లిగాడు (1973)
- ముత్యాలముగ్గు (1975)
- చిల్లరకొట్టు చిట్టెమ్మ (1978)
- లంబాడోళ్ళ రాందాసు (1978)
- మెరుపు దాడి (1984)
- ఆస్తులు అంతస్తులు (1988)
- శివయ్య (1998)
- సఖియా (2004)
పేరుపడ్డ సంభాషణలు
- ఏంటి బాయ్యా?
సన్మానం
2012 అక్టోబరు 7, ఆదివారం నాడు, మాడా వెంకటేశ్వరరవుకు అనంతపురంలో అనంతకళావాహిని సంస్థ దశమ వార్షికోత్సవం సందర్భంగా స్వర్ణకంకణ ధారణ జరిపి, అభినయ కళానిధి బిరుదును ప్రధానం చేశారు.[5]
మరణం
కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ 2015, అక్టోబర్ 24 శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
