మహారాష్ట్రీ ప్రాకృతం

మహారాష్ట్రి లేదా మహారాష్ట్రీ ప్రాకృతం, అనేది ప్రాచీన మధ్యయుగాలనాటి భారతదేశంలో వాడుకలో ఉండిన భాష. ఆధునిక మరాఠీ, కొంకణి భాషలు దీనిని నుండే ఉద్భవించాయి. [1] ప్రాకృతంగా పిలువబడిన అనేక భాషల సమూహం (మాండలికాలు అని కూడా కొందరు వ్యవహరిస్తారు)లో, ఇది కూడా ఒకటి. అంతేగాక, ఒక ప్రధానమైన నాటక ప్రాకృతం. సుమారు 1000 సంవత్సరాలకి పైగా (క్రీ.పూ 500 - క్రీ.శ 500) వాడుకలో ఉండిన, మహారాష్ట్రీ ప్రాకృతంలో ఎన్నో సాహితీ గ్రంధాలు వెలువడినాయి. కాళిదాసు సంస్కృత నాటకాలలో, మహారాష్ట్రీ ప్రాకృతాన్ని విరివిగా వాడాడు.

శాతవాహన సామ్రాజ్యానికి అధికారభాష ఉండిన మహారాష్ట్రి ప్రాకృతం., క్రీ.శ 875 వరకూ మాట్లాడబడింది. శాతవాహన చక్రవర్తి, వ్రాసిన గాథా సప్తశతి, కర్పూరమంజరి మహారాష్ట్రి ప్రాకృతంలో వ్రాయబడింది.

అయితే, మహారాష్ట్రి అపభ్రంశ భాషలు జైన సాహిత్యంలో 13వ శతాబ్దం వరకూ వాడుకలో ఉన్నాయి. ఈ అపభ్రంశరూపాలని పునఃసంస్కృతీకరించటం వల్ల, నేటి మరాఠీభాష పుట్టింది.

విస్తృతి

మహారాష్ట్రీ ప్రాకృతం, ఉత్తరాన మాళవ, రాజపుతానా నుండి, దక్షిణాన కృష్ణ, తుంగ భద్ర వరకూ వాడుకలో ఉండినది.

సాహిత్యం

ప్రాకృత సంకలనాలు, గాథా సప్తశతి, సేతుబంధం, కర్పూరమంజరి వంటివి శాతవాహన చక్రవర్తి హాలుడు రచించినట్టు భావిస్తారు. కాళిదాసు రచించిన సంస్కృత నాటకాలు, నిమ్నజాతికి చెందిన పాత్రలు, ఈ భాషని మాట్లాడుతాయి.

రాజాశ్రయం

క్రీ.శ తొలి శతాబ్దాలలో., శాతవాహన సామ్రాజ్యానికి అధికారభాష. శాతవాహనులకాలం, మహారాష్ట్రీ ప్రాకృత వినియోగం, తక్కిన అన్ని ప్రాకృతాలకన్నా ఎక్కువగా ఉండినది.

మూలాలు

  1. "Roots of Konkani" (in English and Konkani). Goa Konkani Akademi. Retrieved 2009-09-03.CS1 maint: Unrecognized language (link)
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.