మల్లాది రామకృష్ణశాస్త్రి
మల్లాది రామకృష్ణ శాస్త్రి (1905- 1965) ప్రముఖ తెలుగు రచయిత.[1]
| మల్లాది రామకృష్ణశాస్త్రి Malladi Ramakrishna Sastry | |
|---|---|
![]() బాపు గీసిన మల్లాది కేరికేచర్ | |
| పుట్టిన తేదీ, స్థలం | 16 జూన్ 1905 చిట్టిగూడూరు, కృష్ణా జిల్లా |
| మరణం | 12 సెప్టెంబర్ 1965 చెన్నై, భారతదేశం |
| జాతీయత | భారతీయుడు |
| విద్య | ఎం.ఎ. |
| రచనా రంగం | పండితుడు, రచయిత, కవి, గేయ మరియు నాటక రచయిత |
| గుర్తింపునిచ్చిన రచనలు | చలవ మిరియాలు |
| సంతకం | |
జీవిత విశేషాలు
మల్లాది రామకృష్ణశాస్త్రి 1905, జూన్ 17న కృష్ణా జిల్లా, చిట్టిగూడూరు గ్రామంలో ఒక సంపన్న కుటుంబంలో కనకవల్లి, నరసింహశాస్త్రి దంపతులకు జన్మించాడు. ఇతడు మచిలీపట్నంలో బి.ఎ. వరకు చదివాడు. తరువాత మద్రాసులో సంస్కృతాంధ్రాలలో ఎం.ఎ.పట్టా పుచ్చుకున్నాడు. నలభైకి పైగా భాషలను అభ్యసించి అనేక శాస్త్రాలలో పాండిత్యాన్ని సంపాదించాడు. ఇతడు వేద విద్యను యడవల్లి సుబ్బావధాన్లు వద్ద, మహాభాష్యాన్ని నోరి సుబ్రహ్మణ్యశాస్త్రి వద్ద, బ్రహ్మసూత్రాలను శిష్ట్లా నరసింహశాస్త్రి వద్ద నేర్చుకున్నాడు. నాట్యం, చిత్రలేఖనం, సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. ఆస్తి లావాదేవీలలో సంపదను అంతా పోగొట్టుకుని బందరు వదిలి కొంతకాలం గుంటూరులో ఉన్నాడు. ఇతనికి 15వ యేట పురాణం సూరిశాస్త్రి కుమార్తె వెంకటరమణతో వివాహం జరిగింది. ఇతనికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇతడు గుంటూరులో పాములపాటి వెంకట కృష్ణయ్యచౌదరి నడిపే దేశాభిమాని పత్రికకు ఉపసంపాదకుడిగా పనిచేశాడు. ఇతడు సినిమాలలో మాటలు, పాటలు రాయడానికి ముందు, పలు పత్రికల్లో వ్యాసాలు, కథలు వ్రాశాడు. నవలలు, నాటకాలు రాసి పేరు తెచ్చుకున్నాడు. దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం ‘పల్నాటియుద్ధం’ చిత్ర రచన విషయంలో సలహాల కోసం 1945లో ఇతడిని మద్రాసుకు ఆహ్వానించాడు. ఆ విధంగా ఇతడు 1945, మార్చి 24న మద్రాసులో అడుగుపెట్టాడు. మద్రాసులోని పానగల్ పార్కులో పగలంతా ఒక చెట్టు క్రింద ఉండే రాతిబల్లపై కూర్చుని వచ్చినవారికి మదనశాస్త్రం నుండి మంత్రశాస్త్రం వరకు బోధించేవాడు. ఎంతో మంది వర్ధమాన కవులకు సందేహ నివృత్తి చేసేవాడు. మద్రాసులో సముద్రాల రాఘవాచార్యకు అత్యంత ఆప్తుడయ్యాడు. అతడికి చాలా కాలం "ఘోస్ట్ రైటర్"గా ఉన్నాడు. 1952 వరకు ఇతడు చేసిన సినిమా రచనలలో ఇతని పేరు లేకపోవడం గమనార్హం. చిన్న కోడలు చిత్రంతో ఇతడు అజ్ఞాత వాసం వదిలి బహిరంగంగా సినీజీవితం కొనసాగించాడు. తన సొంత పేరుతో 39 చిత్రాలలో 200కు పైగా పాటలను రచించాడు[2],[3].
రచనలు
ఇతడు కృష్ణా పత్రికలో ఛందోబద్ధమైన కవిత్వం వ్రాశాడు. కృష్ణాపత్రికలో చలువ మిరియాలు పేరుతో వ్యంగ్య వ్యాసాలను వ్రాశాడు. 19వ యేట నుండే కథారచన ప్రారంభించి సుమారు 125 కథలను వ్రాశాడు. ఇతడు వ్రాసిన డుమువులు కథ 14 భారతీయ భాషలలోకి అనువదించబడింది. అహల్యా సంక్రందనం, హంసవింశతి గ్రంథాలకు అమూల్యమైన పీఠికలు వ్రాశాడు.
సంకలనాలు
- చలవ మిరియాలు
నవలలు
- కృష్ణాతీరం
- తేజోమూర్తులు
- క్షేత్రయ్య
నాటికలు
- గోపీదేవి
- కేళీగోపాలం
- బాల
- అ ఇ ఉ ఱ్
- సేఫ్టీ రేజర్
సినీ సాహిత్యం
* బాలరాజు (1948)
- చిన్న కోడలు (1952) (గీత రచయితగా తొలిచిత్రం)
- కన్యాశుల్కం (1955) (గీత రచయిత)
- రేచుక్క (1955) (గీత రచయిత)
- చిరంజీవులు (1956) (గీత రచయిత)
- కార్తవరాయని కథ (1958) (గీత రచయిత)
- జయభేరి (1959) (గీత రచయిత)
- తల్లి బిడ్డ (1963) (గీత రచయిత)
- జ్ఞానేశ్వర్ (1963) (గీత రచయిత)
- దేశద్రోహులు (1964) (గీత రచయిత)
- రహస్యం (1967) (గీత రచయిత)
- వీరాంజనేయ (1968) (గీత రచయిత)
- అత్తగారు కొత్తకోడలు (1968) (గీత రచయిత)
బయటి లంకెలు
మూలాలు
- రామకృష్ణశాస్త్రి, మల్లాది, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీలు: 515-6.
- పైడిపాల (2010). తెలుగు సినీ గేయ కవుల చరిత్ర (ప్రథమ ed.). చెన్నై: స్నేహ ప్రచురణలు. pp. 72–77.
|access-date=requires|url=(help) - టీవీయస్, శాస్త్రి (1 November 2013). "సుశాస్త్రీయం: సినీ పాటల శాస్త్రి - శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు". గో తెలుగు (33). Retrieved 1 December 2016.
