భూమిక చావ్లా
తెలుగు సినిమాలలో రంగప్రవేశం చేసిన ముంబయి కథానాయికలలో భూమిక చావ్లా ఒకరు. భూమికకు యువకుడు మొదటి సినిమా. తరువాత తమిళం, హిందీ చిత్రాలలో నటించి పేరు తెచ్చుకొంది. ఈమెకు మిస్సమ్మ (2003 సినిమా) చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది.
| భూమిక చావ్లా | |
![]() | |
| జన్మ నామం | రచన |
| జననం | 1978 ఆగస్టు 21 క్రొత్త ఢిల్లీ, భారత్ |
| ఇతర పేర్లు | గుడియ భూమిక భూమి |
| క్రియాశీలక సంవత్సరాలు | 2000 - ప్రస్తుతం |
| భార్య/భర్త | భరత్ ఠాకుర్ (2007 - ప్రస్తుతం) |
ఆగస్టు 21, 1978 లో ఢిల్లీలో జన్మించిన భూమిక తన చదువును కూడా అక్కడే పూర్తి చేసింది. తనకు ఇష్టమైన మోడలింగ్ రంగంలో అవకాశాలను వెదుక్కుంటూ ముంబై చేరింది. ఆమె తండ్రి ఆశిష్ సింగ్ చావ్లా సైన్యంలో అధికారి. ఆమె అన్న కూడా సైన్యంలోనే పనిచేస్తున్నాడు. మొదట్లో పాండ్స్ పౌడర్ ప్రకటనలో కనిపించిన ఆమెకు తరువాత నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు తలుపు తట్టాయి.
బాలీవుడ్ లో ఆమె మొదటి సినిమా 2003 లో విడుదలై, సల్మాన్ ఖాన్ కథా నాయకుడిగా నటించిన తేరే నామ్. ప్రముఖ యోగా గురువైన భరత్ ఠాకూర్ ను 2007 లో ఆమె వివాహం చేసుకున్నది. కవిత్వం అంటే ఆమెకు మంచి ఆసక్తి.[1]
భూమిక నటించిన తెలుగు చిత్రాలు
- యువకుడు (2000)
- ఖుషీ
- మిస్సమ్మ (2003)
- సింహాద్రి
- వాసు
- ఒక్కడు
- స్వాగతం
- అనసూయ
- కలెక్టర్ గారి భార్య (2010)
- మల్లెపూవు
- సత్యభామ
- మాయాబజార్
- జై చిరంజీవ
- లడ్డు బాబు
- ఎంసిఎ
అవార్డులు
- మిస్సమ్మ (2003 సినిమా) చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం.
