భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం ఇరవై-తొమ్మిది రాష్ట్రములు మరియు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిగిన ఒక సంయుక్త రాష్ట్ర కూటమి. ఈ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లాలుగా పునర్విభజించబడ్డాయి.
రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు
| క్ర.సంఖ్య | పేరు | అవతరణ తేదీ | జనాభా | వైశాల్యం (km2 లో) |
రాజధాని | అతి పెద్ద నగరం (రాజధాని కానిచో) | జన సాంద్రత | అక్షరాస్యత శాతం |
|---|---|---|---|---|---|---|---|---|
| 1 | ఆంధ్ర ప్రదేశ్ | 1953 అక్టోబరు 1 | 49,386,799 | 1,60,205 | హైదరాబాద్ (తాత్కాలిక) అమరావతి (అమోదించబడిన) |
విశాఖపట్నం | 308 | 67.41[1] |
| 2 | అరుణాచల్ ప్రదేశ్ | 1987 ఫిబ్రవరి 20 | 1,382,611 | 83,743 | ఇటానగర్ | 17 | 66.95 | |
| 3 | అసోం | 1947 ఆగస్టు 15 | 31,169,272 | 78,550 | దిస్పూర్ | గౌహతి | 397 | 73.18 |
| 4 | బీహార్ | 1936 ఏప్రిల్ 1 | 103,804,637 | 99,200 | పాట్నా | 1,102 | 63.82 | |
| 5 | ఛత్తీస్గఢ్ | 2000 నవంబరు 1 | 25,540,196 | 1,35,194 | రాయపూర్ (తాత్కాలిక రాజధాని) [2] | 189 | 71.04 | |
| 6 | గోవా | 1987 మే 30 | 1,457,723 | 3,702 | పనజీ | 394 | 87.40 | |
| 7 | గుజరాత్ | 1960 మే 1 | 60,383,628 | 1,96,024 | గాంధీనగర్ | అహ్మదాబాద్ | 308 | 79.31 |
| 8 | హర్యానా | 1966 నవంబరు 1 | 25,353,081 | 44,212 | చండీఘడ్ (పంచుకోబడిన, కేంద్రపాలిత ప్రాంతం) |
ఫరీదాబాద్ | 573 | 76.64 |
| 9 | హిమాచల్ ప్రదేశ్ | 1971 జనవరి 25 | 6,856,509 | 55,673 | సిమ్లా | 123 | 83.78 | |
| 10 | జమ్మూ మరియు కాశ్మీర్ | 1947 అక్టోబరు 26 | 12,548,926 | 2,22,236 | శ్రీనగర్ (వేసవి) జమ్మూ (శీతాకాలము) |
124 | 68.74 | |
| 11 | ఝార్ఖండ్ | 2000 నవంబరు 1 | 32,966,238 | 74,677 | రాంచి | జంషెడ్పూర్ | 414 | 67.63 |
| 12 | కర్ణాటక | 1956 నవంబరు 1 | 61,130,704 | 1,91,791 | బెంగుళూరు | 319 | 75.60 | |
| 13 | కేరళ | 1956 నవంబరు 1 | 33,387,677 | 38,863 | తిరువనంతపురం | 859 | 93.91 | |
| 14 | మధ్య ప్రదేశ్ | 1956 నవంబరు 1 | 72,597,565 | 3,08,252 | భోపాల్ | ఇండోర్ | 236 | 70.63 |
| 15 | మహారాష్ట్ర | 1960 మే 1 | 112,372,972 | 3,07,713 | ముంబై | 365 | 82.91 | |
| 16 | మణిపూర్ | 1972 జనవరి 21 | 2,721,756 | 22,347 | ఇంఫాల్ | 122 | 79.85 | |
| 17 | మేఘాలయ | 1972 జనవరి 21 | 2,964,007 | 22,720 | షిల్లాంగ్ | 132 | 75.48 | |
| 18 | మిజోరం | 1987 ఫిబ్రవరి 20 | 1,091,014 | 21,081 | ఐజ్వాల్ | 52 | 91.58 | |
| 19 | నాగాలాండ్ | 1963 డిసెంబరు 1 | 1,980,602 | 16,579 | కొహిమా | దిమాపూర్ | 119 | 80.11 |
| 20 | ఒడిషా[3] (ఒడిషా) | 1936 ఏప్రిల్ 1 | 41,947,358 | 1,55,820 | భువనేశ్వర్ | 269 | 73.45 | |
| 21 | పంజాబ్ | 1966 నవంబరు 1 | 27,704,236 | 50,362 | చండీఘడ్ (పంచుకోబడిన, కేంద్రపాలిత ప్రాంతం) |
లుధియానా | 550 | 76.68 |
| 22 | రాజస్థాన్ | 1956 నవంబరు 1 | 68,621,012 | 3,42,269 | జైపూర్ | 201 | 67.06 | |
| 23 | సిక్కిం | 1975 మే 1 | 607,688 | 7,096 | గంగ్తోక్ | 86 | 82.20 | |
| 24 | తమిళ నాడు | 1950 జనవరి 26 | 72,138,958 | 1,30,058 | చెన్నై | 480 | 80.33 | |
| 25 | తెలంగాణ | 2014 జూన్ 2 | 35,193,978 [4] | 1,14,840 | హైదరాబాద్ | 307 [4] | అందుబాటులో లేవు | |
| 26 | త్రిపుర | 1972 జనవరి 21 | 3,671,032 | 10,492 | అగర్తలా | 350 | 87.75 | |
| 27 | ఉత్తర్ ప్రదేశ్ | 1950 జనవరి 26 | 199,581,477 | 2,43,286 | లక్నో | కాన్పూర్ | 828 | 69.72 |
| 28 | ఉత్తరాఖండ్ | 2000 నవంబరు 9 | 10,116,752 | 53,566 | డెహ్రాడూన్ | 189 | 79.63 | |
| 29 | పశ్చిమ బెంగాల్ | 1956 నవంబరు 1 | 91,347,736 | 88,752 | కలకత్తా | 1,029 | 77.08 | |
జమ్మూ కాశ్మీర్ యొక్క భాగాలు వివాదంలో ఉన్న భూభాగంగా పరిగణించబడుతున్నాయి, కాశ్మీర్ యొక్క పూర్వ రాష్ట్రంలో ఒక్కొక్క భాగాన్ని భారతదేశం, పాకిస్తాన్ మరియు చైనాలు పాలిస్తూ, అవి తమకే చెందుతాయని ప్రకటించుకున్నాయి.
అరుణాచల్ ప్రదేశ్ లో ఒక భాగం దక్షిణ టిబెట్ గా తమకు చెందుతుందని చైనా ప్రకటించింది
1956 కి పూర్వం
భారత ఉపఖండం దాని చరిత్ర అంతటా వివిధ జాతుల చేత పాలించబడింది, ప్రతి ఒక్కరు ఈ ప్రాంతాన్ని వారి స్వంత పరిపాలనా విభాగాలుగా విభజించుకున్నారు. ఆధునిక భారతదేశం యొక్క ప్రస్తుత పాలనా విభాగాలు న్యాయంగా ఇటీవలే అభివృద్ధి చెందాయి, ఇవి భారతదేశంలో బ్రిటిష్ రాచరిక పాలన సమయంలో వృద్ధిచెందటం మొదలుపెట్టాయి. బ్రిటిష్ ఇండియాలో ప్రస్తుత భారతదేశం యావత్తూ, పాకిస్తాన్, మరియు బంగ్లాదేశ్, అదేవిధంగా బ్రిటిష్ ఇండియా ఆధీనంలో ఉన్నఆఫ్ఘనిస్తాన్ మరియు దాని పరగణాలు, బర్మా (మయన్మార్) లోని బ్రిటిష్ స్థావరాలు మొదలైనవి ఉండేవి. ఈ సమయంలో, భారతదేశ ప్రాంతాలు నేరుగా బ్రిటిష్ వారి పాలనలో ఉండేవి లేదా స్థానిక రాజుల నియంత్రణలో ఉండేవి. 1947 లో వచ్చిన స్వతంత్రం ఈ విభాగాలను చాలా వరకు అలానే ఉంచగలిగింది, అయితే పంజాబ్ మరియు బెంగాల్ పరగణాలు భారతదేశం మరియు పాకిస్తాన్ల మధ్య విభజించబడ్డాయి. కొత్త దేశం ఎదుర్కోబోయే అనేక సవాళ్లలో రాచరిక రాష్ట్ర సమూహాన్ని సమైక్య భారతంలో విలీనం చేయటం అనేది మొదటిది.
స్వతంత్రం తర్వాత, ఏదిఏమైనప్పటికీ, భారతదేశంలో అస్థిరత్వం తలెత్తింది. చాల పరగణాలు, భారత పౌరుల ఇష్టంతో ప్రమేయంలేకుండా లేదా ఉపఖండం అంతటా ఉన్న సాంస్కృతిక విభాగాలతో నిమిత్తం లేకుండా, కేవలం వారి అధికారిక పనులను జరుపుకోవటానికి మాత్రమే బ్రిటిష్ వారిచేత రూపొందించబడ్డాయి. రాష్ట్రాల పునర్వ్యవస్తీకరణ చట్టం ద్వారా 1956 లో జాతి మరియు భాష ప్రాతిపదికన దేశాన్ని పునర్వ్యవస్తీకరించటం కొరకు భారత శాసనసభలో జాతిపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి.
1956 తర్వాత
భారతదేశంలోని పూర్వ ఫ్రెంచ్ మరియు పోర్చుగీసు స్థావరాలు (కాలనీలు) 1962 లో పాండిచ్చేరి, దాద్రా, నగర్ హవేలీ, గోవా, డామన్ మరియు డయ్యు మొదలైన కేంద్రపాలిత ప్రాంతాలుగా రాజ్యాంగం లోకి చేర్చబడ్డాయి.
1956 నుండి ఉన్న రాష్ట్రాల నుండి అనేక కొత్త రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు రూపొందించబడ్డాయి. బొంబాయి పునర్వ్యవస్తీకరణ చట్టం ద్వారా 1960 మే 1[5] న బొంబాయి రాష్ట్రం గుజరాత్ మరియు మహారాష్ట్ర అనే భాషాప్రయుక్త రాష్ట్రాలుగా చీలిపోయింది. 1963 డిసెంబరు 1 న నాగాలాండ్ ఒక రాష్ట్రంగా రూపొందింది. 7. 1966 యొక్క పంజాబ్ పునర్వ్యవస్తీకరణ చట్టం పంజాబ్ ను భాష మరియు మత ప్రాతిపదికన విభజించి, 1 నవంబరు న ఒక కొత్త హిందూ మరియు హిందీ మాట్లాడే హర్యానా రాష్ట్రాన్ని తయారుచేసింది[6], ఉత్తర పంజాబ్ జిల్లాలను హిమాచల్ ప్రదేశ్కు బదిలీచేసింది, మరియు పంజాబ్ మరియు హర్యానాల ఉమ్మడి రాజధాని చండీఘడ్కు ఒక కేంద్రపాలిత ప్రాంత హోదా కల్పించింది.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రతిపత్తి 1971 జనవరి 25 న, మణిపూర్, మేఘాలయ మరియు త్రిపుర లకు 1972 జనవరి 21న లభించింది.[7]సిక్కిం రాజ్యం 1975 ఏప్రిల్ 26 న ఒక రాష్ట్రంగా భారత కూటమిలో చేరింది. [10]1987 లో, అరుణాచల్ ప్రదేశ్ మరియు మిజోరాం 20 ఫిబ్రవరి న రాష్ట్రాలుగా అవతరించాయి, ఆ తర్వాత 30 మే న గోవా అవగా, గోవా యొక్క ఉత్తర భాగాలు డామన్ మరియు డయ్యు ఒక ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతం అయ్యాయి.[8]
2000 లో మూడు కొత్త రాష్ట్రాలు అవతరించాయి; ఛత్తీస్గఢ్ (2000 నవంబరు 1) తూర్పు మధ్య ప్రదేశ్ నుండి రూపొందింది, ఉత్తరాఖండ్గా పేరుమార్చబడిన, ఉత్తరాంచల్ (2000 నవంబరు 9), వాయువ్య ఉత్తర ప్రదేశ్ యొక్క పర్వత ప్రాంతాల నుండి రూపొందింది, మరియు ఝార్ఖండ్ (2000 నవంబరు 15) బీహార్ లోని దక్షిణ జిల్లాల నుండి తయారైంది. కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ మరియు పాండిచ్చేరి (పుదుచ్చేరిగా పేరు మార్చబడింది) తమ స్వంత శాసన సభను ఎన్నుకునే హక్కు పొందటంవల్ల ఇప్పుడు వాటిని చిన్న రాష్ట్రాలుగా లెక్కించవచ్చు.
ఇవి కూడా చూడండి
- భారతదేశం యొక్క ఉపవిభాగాలు
- భారతదేశ స్వాధికార ప్రాంతాలు
- ISO 3166-2:IN
సూచనలు
- "Literacy of AP (Census 2011)" (pdf). AP govt. portal. p. 43. Retrieved 11 June 2014.
- http://timesofindia.indiatimes.com/city/raipur/Half-marathon-in-Naya-Raipur/articleshow/17401264.cms?referral=PM
- "Orissa's new name is Odisha". The Times Of India. 24 March 2011.
- "Population of Telangana" (pdf). Telangana government portal. p. 34. Retrieved 11 June 2014.
- జే.సి. అగర్వాల్ మరియు ఎస్.పి. అగ్రవాల్, సంపాదకులు, ఉత్తరాఖండ్: పాస్ట్, ప్రెజెంట్, అండ్ ఫ్యూచర్ (న్యూ ఢిల్లీ: కాన్సెప్ట్ పబ్లిషింగ్, 1995), p89-90
- Ibid. at 89
- Ibid. at 89-90, 92
- Ibid. at 89, 91
వెలుపటి వలయము
- భారత ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్: రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు
- మీటనొక్కితే వచ్చే భారత చిత్రపటం మరియు రాష్ట్రాల చరిత్ర
- భారతదేశంలో ఉప-జాతీయ పరిపాలన పైన వ్యాసం
- భారతదేశం యొక్క ఇంటరాక్టివ్(సంకర్షణ జరపగలిగే) చిత్రపటం
మూస:భారతదేశం భౌగోళికం మూస:Articles on first-level administrative divisions of Asian countries