బసప్ప దానప్పజత్తి

బి.డి.జత్తి గా పిలవబడే బసప్ప దానప్ప జత్తి తాత్కాలిక రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించిన వారిలో రెండవవాడు. 1974 సంవత్సరం ఆగస్టు 24 న అప్పటికి రాష్ట్రపతిగా ఉన్న ఫకృద్దీన్ అలీ అహ్మద్ హఠాత్తుగా మరణించడంతో బసప్ప తాత్కాలికంగా రాష్ట్రపతిగా పనిచేసాడు. ఈయన తల్లిదండ్రులు 'దానప్పజత్తి, శ్రీమతి సంగమ్మ'లు. ముక్కు సూటి మనిషి అని పేరు పడ్డ జత్తి 1912, 24 ఆగస్టున జన్మించాడు. బసప్పజత్తి బి.ఏ.ఎల్.ఎల్.బి చదివి అనేక పదవులు చేపట్టాడు.

మరణం

జూన్ 07 2002 లో చనిపోయాడు.

బసప్ప నిర్వహించిన పదవులు

  • ఆనాటి బొంబాయి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
  • మైసూరు రాష్ట్రానికి భూసంస్కరణ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసాడు.
  • కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నరుగా 1968 నుండి 1972 వరకూ సమర్ధవంతంగా పనిచేసాడు.
  • 1972 నుండి 1974 ప్రాంతములో ఒడిషా గవర్నరుగా ఉన్నాడు.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.