పుణ్యగిరి
పుణ్యగిరి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల విజయనగరం జిల్లాలో ఉన్న శృంగవరపుకోటకు పశ్చిమ దిశను ఎత్తయిన కొండలలో (తూర్పు కనుమలు) ఉంది. ఈ గ్రామం విజయనగరానికి 35 కి.మి దూరంలో, శృంగవరపుకోటకు 4 కి.మి దూరంలో ఉంది. ఇది ప్రసిద్దమైన శైవక్షేత్రం. ఇక్కడ గర్భగుడిలో నీరు భూగర్భంనుండి శివలింగం మీదకి ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఇక్కడకు దగ్గరలో త్రిమూర్తి గుహలో మూడు లింగాలు ప్రతిష్ఠ్హైంచబడి నీటి బిందువులు ఎప్పుడు పడుతూ ఉంటాయి. ఇక్కడ మహాశివరాత్రికి వేలసంఖ్యలో భక్తులు వస్తారు. అక్కడికి దగ్గరలో ఉన్న జలపాతంలో స్నానం చేసిశివదర్శనం చేస్తే లభించి మౌక్షాన్ని పొందుతాడని భక్తుల నమ్మకం.

'పుణ్యగిరి ముఖద్వారం
బయటి లింకులు
- విజయనగరం జిల్లా వెబ్ సైటు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.