పవని నిర్మల ప్రభావతి
పవని నిర్మల ప్రభావతి అగ్రశ్రేణి కథా, నవలా రచయిత్రి. ఈమె 1933, మార్చి 12వ తేదీన ఒంగోలులో విప్పగుంట వెంకట నరసింహారావు, సరస్వతమ్మ దంపతులకు జన్మించింది[1]. ఈమె ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదువుకుంది. ఈమె భర్త పేరు పవని శ్రీధరరావు.

రచనలు
కథాసంపుటాలు
- అనాథ
- ఎదలో ముల్లు
- నాగరికత నవ్వుతోంది
- పాలఘాటు పిల్ల
- భగవాన్ నేనేమీ కోరను
- స్త్రీ
- హనీమూన్
నవలలు
- శలభాలు
- ఉదయకిరణాలు
- శాపగ్రస్తులు
- రాలినపూలు
- ఓ జరుగుతున్న కథ
- నాలుగిళ్ల లోగిలి
- శేషప్రశ్నలు
- పాములూ నిచ్చెనలూ
- ముగింపేమిటి?
- కప్పలు
- మండోదరి మళ్ళీ పుట్టింది
- మనుషులు మనసులు
- మనస్తత్వాలు
- పంజర కీరాలు
- సప్తవర్ణాలు
- శిథిలాల నుండి శిఖరాలకు
- ఈ జీవిత సంధ్యాసమయంలో
ఆధ్యాత్మికం
- భవాని సౌందర్యలహరి[2]
- శివదూతీ! సప్తశతీ!
- శ్రీ లలితానామ సహస్ర స్త్రోత్ర సర్వస్వం
- శ్రీ శిరిడీ సాయినాథ భాగవతము
కథలు
ఆమె వ్రాసిన కథలు వివిధ పత్రికలలో ప్రచురింపబడినవి.[3]
మరణం
ప్రకాశం జిల్లా, లింగసముద్రం మండలంలోని మొగిలిచర్లలో 2015, మే 27 న మరణించారు.
మూలాలు
- ఒంగోలు జిల్లా రచయితల మహాసభలు ప్రారంభ సంచిక, సంపాదకుడు- నాగభైరవ కోటేశ్వరరావు - జూన్ 1971- పుట 90
- పవని నిర్మల ప్రభావతి (1994). భవాని సౌందర్యలహరి (1 ed.). విజయవాడ: పవని నిర్మలప్రభావతి. Retrieved 17 March 2015.
- కథానిలయం లో
- కథానిలయం వెబ్సైట్లో కథ
- కథానిలయంలో ప్రతి
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.