పర్వతాపురం (మైలవరం)
పర్వతాపురం కృష్ణా జిల్లా, మైలవరం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మైలవరం నుండి 17 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నూజివీడు నుండి 24 కి. మీ. దూరంలోనూ ఉంది. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588937[1].
| పర్వతాపురం (మైలవరం) | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | మైలవరం |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 521230. |
| ఎస్.టి.డి కోడ్ | |
గ్రామ చరిత్ర
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[2]
కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
మైలవరం మండలం
మైలవరం మండలంలోని కనిమెర్ల, కీర్తిరాయణగూడెం, గణపవరం, చంద్రగూడెం, చంద్రాల, జనగాలపల్లె, గన్నవరం, తొలుకోడు, పర్వతపురం, పొందుగుల, తుమ్మలగుంట, , వెదురుబీడెం, మైలవరం, వెల్వడం మరియు సబ్జపాడు గ్రామాలు ఉన్నాయి.
తాగు నీరు
తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు.
భూమి వినియోగం
పర్వతాపురంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 58 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 50 హెక్టార్లు
- బంజరు భూమి: 30 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 100 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 100 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 30 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
పర్వతాపురంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- చెరువులు: 30 హెక్టార్లు