పద్మశ్రీ పురస్కారం
పద్మశ్రీ (ఆంగ్లం : Padma Shri) భారత ప్రభుత్వముచే ప్రదానం చేసే పౌర పురస్కారం. వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ మరియు ప్రజా జీవితాలు, మొదలగు వాటిలో సేవ చేసిన వారికి ప్రాథమికంగా ఇచ్చే పౌరపురస్కారం. పౌర పురస్కారాలలో ఇది నాలుగవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. అత్యున్నత పురస్కారం భారతరత్న, రెండవది పద్మ విభూషణ్ మూడవది పద్మ భూషణ్ మరియు నాలుగవది పద్మశ్రీ. ఈ పురస్కారం పతకం రూపంలో వుంటుంది, దీనిపై దేవనాగరి లిపిలో "పద్మ" "శ్రీ"లు వ్రాయబడి వుంటాయి. ఈ పురస్కారాన్ని 1954లో స్థాపించారు.
| పద్మశ్రీ | ||
![]() | ||
| పురస్కారం గురించి | ||
|---|---|---|
| ఎలాంటి పురస్కారం | పౌర | |
| విభాగం | సాధారణ | |
| వ్యస్థాపితం | 1954 | |
| మొదటి బహూకరణ | 1954 | |
| క్రితం బహూకరణ | 2014 | |
| మొత్తం బహూకరణలు | 2577 | |
| బహూకరించేవారు | భారత ప్రభుత్వం | |
| వివరణ | ' | |
| రిబ్బను | ||
ఫిబ్రవరి 2010 నాటికి, మొత్తం 2336 మంది పౌరులు ఈ పురస్కారాన్ని పొందారు.[1]
పద్మశ్రీ గ్రహీతలు
మూలాలు
- Padma Shri Award recipients list Government of India
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
