పతివాడ నారాయణస్వామి నాయుడు
పతివాడ నారాయణస్వామి నాయుడు 2014 సార్వత్రిక ఎన్నికలలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల శాసనసభా నియోజకవర్గం నుంచి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు శాసనసభ్యునిగా ఎన్నికైనాడు. ఇతను భోగాపురం శాసనసభా నియోజకవర్గం నుండి 1983, 1985, 1989, 1994, 1999 మరియు 2004 సంవత్సరాలలో 6సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. విజయనగరం జిల్లా, పూసపాటిరేగ మండలానికి చెందిన రెల్లివలస వీరి స్వగ్రామము.
ప్రొటెం స్పీకర్గా
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ నరసింహన్ 20-06-2014న ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ప్రొటెం స్పీకర్గా పతివాడ నారాయణ స్వామి నాయుడు చేత రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేయించారు.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.