నువ్వొస్తానంటే నేనొద్దంటానా

నువ్వొస్తానంటే నేనొద్దంటానా ప్రభుదేవా దర్శకత్వంలో 2005 లో విడుదలైన సినిమా. ఎం. ఎస్. రాజు నిర్మాణ సారథ్యంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాలో సిద్ధార్థ్, త్రిష ముఖ్య పాత్రలు పోషించారు. ప్రేమించిన అమ్మాయి కోసం ఒక ధనవంతుల కొడుకైన కథానాయకుడు వ్యవసాయం చేసి ఆమె అన్నయ్యను మెప్పించడం ఈ చిత్ర కథాంశం.[1]

నువ్వొస్తానంటే నేనొద్దంటానా
దర్శకత్వము ప్రభు దేవా
నిర్మాత ఎం. ఎస్. రాజు
రచన పరుచూరి సోదరులు, సందీప్ మలాని,
ఎం. ఎస్. రాజు
తారాగణం సిద్ధార్థ్,
త్రిష కృష్ణన్,
ప్రకాష్ రాజ్
సంగీతం దేవి శ్రీ ప్రసాద్
సినిమెటోగ్రఫీ వేణు గోపాల్
కూర్పు కె. వి. కృష్ణా రెడ్డి
డిస్ట్రిబ్యూటరు సుమంత్ ఆర్ట్ పిక్చర్స్
విడుదలైన తేదీలు జనవరి 14, 2005 (2005-01-14)
నిడివి 165 ని.
భాష తెలుగు

కథ

శివరామకృష్ణ, అతని చెల్లెలు సిరి చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతారు. శివరామకృష్ణ ఆ ఊరి స్టేషన్ మాస్టర్ సాయంతో అప్పులో ఉన్న పొలాన్ని దక్కించుకుని వ్యవసాయం చేసుకుంటూ చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఇద్దరూ పెరిగి పెద్దవారవుతారు. సిరి చిన్నప్పటి నుంచి లలిత అనే స్నేహితురాలు ఉంటుంది.

నటవర్గం

సిద్ధార్థ్ నారయణ్
త్రిష కృష్ణన్

పాటలు

దేవి శ్రీ ప్రసాద్
  • చంద్రుళ్ళో ఉండే కుందేలు
  • సంథింగ్ సంథింగ్
  • ఆకాశం తాకేలా
  • పారిపోకే పిట్టా

పురస్కారాలు

మూలాలు

  1. "ఒక బస్తా ఎక్కువే పండిస్తా". sakshi.com. సాక్షి. Archived from the original on 13 November 2017. Retrieved 13 November 2017.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.