నంద్యాల
నంద్యాల ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్న ఒక మండలం, లోక్ సభ మరియు శాసన సభ నియోజకవర్గం, మరియు అదే పేరుగల పట్టణం. పిన్ కోడ్: 518501. కుందూ నదీ తీరాన ఉన్న ఈ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలకు ఒక పెద్ద వాణిజ్య కేంద్రం. నంద్యాలకు భారత రాజకీయాలలో ఒక రాష్ట్రపతిని మరియు ప్రధానమంత్రి అందించిన ఏకైక పార్లమెంటు నియోజకవర్గముగా విశిష్టత ఉంది. నంద్యాల స్థానికులు కానప్పటికీ నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా, పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా ఇక్కడినుండే పోటీచేశారు. పి.వి.నరసింహారావు నంద్యాల నియోజకవర్గము నుండి లోక్సభకు అత్యంత భారీ మెజారిటీ వోట్లతో ఎన్నికై ప్రపంచ రికార్డు సృష్టించాడు.నంద్యాల గురించి ప్రాంతీయ వెబ్ సైట్ దినంద్యాల్.కాం. ఇందులో నంద్యాలకు సంబంధించిన అన్ని రకముల ఫోన్ నంబర్స్, షాప్స్,హాస్పిటల్స్, స్కూల్స్, వార్తలు మరెన్నో అవసరమగు విషయాలు ఉన్నాయి. దీనిని కామిని విష్ణు వర్ధన్ రెడ్డి ప్రారంబించారు.పూర్వము నంద్యాలకు నందియాల అని పిలిచేవారు. నంద్యాల దగ్గరలో మహానంది అనే ప్రముఖ పుణ్యక్షేత్రం, యాత్రా స్థలం ఉంది.
నంద్యాల ప్రాంత భౌగోళికము

Climate: Tropical ఉష్ణోగ్రత శ్రేణి: వేసవికాలము: 30 °C. - 44 °C. (దాదాపు 81.56F - 119.6F) శీతాకాలము: 21 °C. - 30 °C. (దాదాపు 57F - 81.56F) వర్షపాతము: 695 మి.మీ (Seasonal) నదులు: చిత్రావతి, కుందేరు, పాపాఘ్ని, సగిలేరు మరియు చెయ్యేరు నంద్యాలలో ప్రవహించే ప్రధాన నదులు. కొండలు: నల్లమల కొండలు ఈ జిల్లాలో విస్తారంగా వ్యాపించి ఉన్నాయి.నీటి పారుదల: తుంగభద్ర నది మీద సుంకేశుల డ్యామ్ వద్ద మొదలై కడప-కర్నూలు (కె.సి)కెనాల్ కర్నూలు జిల్లాల ద్వారా ప్రవహిస్తూ 4000 నాలుగు వేలు హెక్టార్ల సాగుభూమికి నీటిని సమకూరుస్తున్నది. సాగునీటి పారుదల కొరకు హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు మరియు పులివెందల కాలువ నిర్మాణములో ఉన్నాయి. నది మీద వేలుగోడ్ గ్రామము వద్ద తెలుగుగంగ జలాశ్రయము నిర్మించబడింది. వెలుగోడు ప్రాజెక్టు త్రాగునీటికి ముఖ్య ఆధారము. వ్యవసాయం: వరి, సజ్జ, జొన్న, రాగి వంటి ఆహార ధాన్యాలు, మామిడి, చీనీ, బొప్పాయి వంటి పండ్ల తోటలు, చెఱకు, పసుపు వంటి వాణిజ్య పంటలు పండుతున్నాయి. అరటి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. నంద్యాల ప్రాంతంలో పండే వరి విదేశాలకు ఎగుమతి అవుతుంది. దేశంలోని అతి ప్రధానమైన రైలు మార్గాల్లో ఒకటిగా ఈ మధ్య కాలంలో వేయబడిన బెంగుళూరు -కలకత్తా రైలు మార్గం. ఈ రైలు మార్గం కలిపే ముఖ్య పట్టణాలు. ముఖ్య వాణిజ్యపట్టణమైన ప్రొద్దటూరుకు నంద్యాల-ఎర్రగుంట్ల మీదుగా రైలు మార్గం నిర్మాణదశలో ఉంది. కడప-నెల్లూరు, కడప-బెంగుళూరు రైలు మార్గాలు వెయ్యాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. కర్నూలు-కడప-చిత్తూరు పట్టణాలను కలిపే 18వ నంబరు జాతీయ రహదారి, కర్నూలు-చెన్నై, కర్నూలు-బెంగుళూరు స్టేట్ హైవేలు. కర్నూలు -నెల్లూరు లను కలిపే మరో ముఖ్యమైన రహదారి ఆళ్ళగడ్డ మీదుగా వెళ్తుంది. ప్రసార సాధనాలు: నంద్యాలలో దూరదర్శన్ రిలే కేంద్రం ఉంది.ఇక నంద్యాలలో రాయలసీమలోని నాలుగు జిల్లాలు మరియు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నడిబొడ్డైన నంద్యాలలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక వ్యవసాయ ప్రాంతీయ, కేంద్ర కార్యాలయాలు ఉన్నాయి. ధార్మిక వ్యవస్థకు పునాదులైన ఎన్నో దేవాలయాలు, క్షేత్రాలు, తీర్థాలు ఈ జిల్లాలో ఉన్నాయి. రాజులు, రాజ్యాలు అంతరించినా ఆనాటి చరిత్రకు గుర్తులుగా కోటలు మిగిలి ఉన్నాయి. ప్రకృతి రమణీయాలైన కొండలు, కోనలు, చందన వృక్షాలు, వన్యమృగాలు ఈ ప్రదేశములో ఉన్నాయి.
నంద్యాల ప్రాంత చరిత్ర
నంద్యాల చుట్టూవున్న నవ నందులు విజయనగర సామ్రాజ్యంలో ముఖ్యమైన పుణ్యక్ష్యేత్రాలుగా వర్దిల్లాయి.
నంద్యాల ప్రాంత ఆర్థిక రంగం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలాగే నంద్యాల ప్రాంతంలోకూడా వ్యవసాయమే ప్రధాన వృత్తి, ఆదాయ వనరు.ఇక్కడ ఎక్కువ భాగం వ్యవసాయం వర్షాధారితమే అయినా కె.సి.కెనాల్, తెలుగుగంగ కింద చాలా ప్రాంతం సాగుబడికి వస్తుంది. వీటి పరీవాహక ప్రాంతాల్లో వరి పండిస్తారు. ఇవి కాకుండా వెలుగోడు ప్రాజెక్టు, పోతిరెడ్డిపాడు, కింద చాలా ప్రాంతం సాగుబడికి వస్తుందిరాష్ట్రం,జిల్లాలో తక్కిన ప్రాంతాలలాగే నంద్యాల ప్రాంతంలో, ముఖ్యంగా మండలంలోని గ్రామాలలో, వ్యవసాయమే ప్రధాన వృత్తి. కుందూ నది మరియు ఇతర వాగుల రూపంలో జలవనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ గత కొంత కాలంగా నెలకొన్న వర్షాభావం వల్ల కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రాంతంలో పండించే పంటలలో ముఖ్యమైనవి పత్తి, చెఱకు, పొగాకు, పసుపు, వరి, శనగ, జొన్నలు మరియు కూరగాయలు. నంద్యాల పట్టణం మండలంలోని గ్రామాలకు మరియు దగ్గ్గరలో గల పలు మండలాలకు వాణిజ్య మరియు వర్తక కేంద్రం.ఛెక్కెర కర్మాగారం, నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, గెలివి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చెప్పుకోదగిన వ్యాపార సంస్థలు. పత్తి జిన్నింగ్ ఇక్కడ మరొక ప్రధాన వృత్తి, 100 కు మించి జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి
రవాణా
నంద్యాల పట్టణానికి రైలు మరియు బస్సు సౌకర్యం రెండూ ఉన్నాయి. buvaneswr -బెంగుళూరు మద్డ్య నడిచే ప్రశాంతి ఎక్స్ ప్రెస్ మరియు గోవా, vasco di gama-howra,colcatta మద్డ్య నడిచే అమరావతి ఎక్స్ ప్రెస్ రైల్లు నంద్యాల మీదుగా ప్రయాణిస్తాయి.నంద్యాల పట్టణములో కూడళ్ళలో గాంధీచౌకు,నూనెపళ్ళి మరియు బొమ్మలసత్రం ముఖ్యమైనవి. బొమ్మల సత్రం 18వ నంబరు జాతీయరహదారిని ఆనుకొని ఉంది. కర్నూలు వైపు నుండి నంద్యాల పట్టణములో ప్రవేశించేవారికి బొమ్మలసత్రం ముఖద్వారం. బొమ్మల సత్రము పక్కనే కుందు నది ప్రవహిస్తూ ఉంది. ప్రతి రోజూ నంద్యాల నుండి హైదెరాబాద్ కు రాత్రి ప్రైవేటు రవాణా సంస్థలు బస్సులను నడుపుతాయి. బాలగంగాధర ట్రావెల్స్ (బి.అర్.ఎస్ ట్రావెల్స్), మహకాళి ట్రాంస్పొపోర్ట్ మరియు మేఘనా ట్రావెల్స్ బస్సులను నడుపును. నంద్యాలకు సమీపమైన అంతర్జాతీయ విమానాశ్రయం రాజీవ్ గాంధి అంతర్జాతీయ విమానాశ్రయం ఇది 270 కిలోమిటర్ల దూరములో ఉన్న హైదరాబాదులో ఉంది.
శీర్షిక పాఠ్యం
నంద్యాల పట్టణంలోని హొటళ్ళు, రెస్టారెంట్లు
- శంకర్ విలాస్ (100% శాకాహారము) - రామలయము దగ్గర
- సితార ఫ్యామిలి రెస్టారెంట్ (పద్మావతి నగర్, తి.తి.దె వెనుక)
- ఛాణిక్య హొటల్
- హొటల్ శొభ
- శశి రెసిడెన్సి
- మౌర్య
- హొటల్ సూరజ్
- తిరుమల రెసిడెన్సి
- త్రినేత్ర లార్జింగ్
- Dwaraka Hotel Nandyal
- హొటల్ సవితా ( శశి రెసిడెన్సి )
- శ్రినిధి టిఫిన్ ( శ్రినివాసనగర్)
నంద్యాల ప్రాంత పర్యాటక ఆకర్షణలు
- పుణ్య క్షేత్రాలు -మహానంది, అహొబిలం, యాగంటి, బెలూం గుహలు, మహానంది,ఒంకారమ్ పుణ్యక్షేత్రం ఇక్కడ చూడదగిన ప్రదేశాలలో ముఖ్యమైనది.
- కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన పవిత్రాలయం నంద్యాల పట్టణంలో నెలకొని ఉంది. 2004 వ సంవత్సరం నృసింహజయంతి నాడు ఈ ఆలయ ప్రారంభోత్సవం జరిగిన నాటినుండి, దినదిన ప్రవర్ధమానమై అశేష భక్త జనాన్నీ విశేషంగా ఆకర్షించుచున్నది. [1]
- నంద్యాల చేరుకొను విధము : రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు 300 కి.మీ దూరమున ఉంది.
- ఇక్కడ దేశంలోనే రెండవ జగజ్జనని ఆలయం ఉంది. [2]
నంద్యాల ప్రాంత ప్రముఖులు
- ఎస్.పి.వై.రెడ్డి (ప్రస్తుత ఎంపీ)
- BHOOMA NAGI రెడ్డి (EX ఎంఎల్యే)
- భూమా శోభా నాగిరెడ్డి
- బొజ్జా వెంకటరెడ్డి (మాజీ ఎంపీ)
- గంగుల ప్రతాప రెడ్డి (మాజీ ఎంపీ)
- SHILPA MOHAN రెడ్డి మాజీ MLA
- మహామ్మద్ ఎన్ ఫరూక్ (మాజీ మంత్రి)
- రామనాథ రెడ్డి (మాజీ ఎంఎల్యే)
నంద్యాల పట్టణంలోని విద్యా సంస్థలు
- ప్రభుత్వ వ్యవసాయ కళాశాల, మహానంది
- రాజీవ్ గాంధీ స్మారక వైజ్ఞానిక సంస్థ, నంద్యాల
- గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడీయం స్కూల్ నంద్యాల
- కేశవ రెడ్డి ఇంగ్లీష్ మీడీయం స్కూల్ నంద్యాల
- ఈ.యస్.సి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల
- శాంతిరాం మెడికల్ కళాశాల
- పి.స్.సి, కె.వి.స్.సి ప్రభుత్వ డెగ్రీ మరియు పి.జి కళాశాల
- శ్రీ రామకృష్ణ డిగ్రీ & పి.జి కళాశాల
- నంది అకాడమి అంతర్జాతీయ పాఠశాల
- శ్రీ యస్.పి.వై డిగ్రీ & పి.జి కళాశాల
- నేషనల్ జూనియార్ & డిగ్రీ మరియు పి.జి కళాశాల
- నందిఅకాడమి.అంతర్జాతీయ పాఠశాల,
(యస్.పి.వై రెడ్డి విద్యా సంస్థల్లో ఒకటి..
V - Tel Computer Education Nandyal
- WISDOM PUBLIC SCHOOL
నంద్యాల పట్టణంలో చలనచిత్ర ప్రదర్శనశాలలు
- ప్రతాప్
- రామనాథ్
- మిని ప్రతాప్
- రాజ్
- సంగీత్
- ఖలీల్
- శ్రీరామ
- అభిరామ్
- నిధి
- ఏ.ఆర్.
ఇవి కూడా చూడండి
బయటి లింకులు
[1] ఈనాడు జిల్లా 23 ఆగస్టు 2013, 13వ పేజీ [2] http://srijagajjananitemple.org/index.html
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 2,69,368 - పురుషులు 1,35,267 - స్త్రీలు 1,34,101
- అక్షరాస్యత (2011)- మొత్తం 67.18% - పురుషులు 77.68% - స్త్రీలు 56.46%
