ద్వితీయోపదేశ కాండము

ద్వితియోపదేశ కాండం ఒకటి నుండి ముప్పై మూడు అధ్యాయాలు మోషేచే రాయబడ్డాయి. ముప్పైనాలుగో అధ్యాయాన్ని యెహోషువ రాశాడు. ఇది క్రీ.పూ. 1446-1406 లో రాయబడింది. ఇందులో ఇశ్రాయేలు ప్రజలు కనాను ప్రవేశించే ముందు మోషే గత 40 ఏండ్ల ప్రయాణాల్లో దేవుడు చేసిన మహాక్రియలు, అనుగ్రహమూ, వాత్సల్యమూ, విశ్వసనీయత వారికి జ్ఞాపకానికి తేవడం, దేవుని శాసనాలను తిరిగి ఇవ్వడం, అవిధేయత విషయం హెచ్చరించడం, చివరి అధ్యాయాల్లో మోషే తుదిపలుకులు, మోషే మృతిచెందడం, మొదలగు విషయాలు చెప్పబడినవి.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.