తిరువల్లవాయ్
తిరువల్లవాయ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
| తిరువల్లవాయ్ | |
|---|---|
![]() | |
| ప్రదేశము | |
| దేశము: | భారత దేశము |
| ఆలయ వివరాలు | |
| ప్రధాన దైవం: | నారాయణన్(నావాయ్ ముకుందన్) |
| ప్రధాన దేవత: | మలర్ మంగై తాయార్ |
| దిశ మరియు స్థానం: | దక్షిణ ముఖము |
| పుష్కరిణి: | శెంగమల పుష్కరిణి |
| విమానం: | వేద విమానం |
| కవులు: | భంగిమ నమ్మాళ్వార్ తిరుమంగై ఆళ్వార్ |
| ప్రత్యక్షం: | లక్ష్మీదేవికి గజేంద్రునకు |
విశేషాలు
మలైనాడు సన్నిధులలో తాయార్లకు వేరుగా సన్నిధి ఇచట మాత్రమే ఉంది. నమ్మాళ్వార్లు ఈ పెరుమాళ్ల విషయమై "ఆసృశంస్యము" అనే గుణమును ప్రకాశింపజేసిరి.
సర్వేశ్వరుని వియోగముచే కలిగిన దు:ఖ సముద్రమును దాటించు నావవంటివాడు ఈస్వామి "ఆవానడి యానివనెన్నరుళాయే" వీడు నా దాసుడని నన్ను దయజూడుమా! అని ఆసృశంస్య గుణమును (9-8-7) ప్రకాశింపజేసిరి.
పేరువెనుక చరిత్ర
ఇచట "నవాయుఱైకిన్ఱ" "నావగా వసించుచున్నట్టివాడు" అని పేర్కొనుటచే ఈ దేశమునకును తిరునావాయ్ అను నామము వచ్చింది.
సాహిత్యం
శ్లో. శ్రీమచ్చెంగమలాభిధాన సరసా యుక్తే పురే సుందరే
నావాయ్ నామని వేద మందిర వరే యా మ్యాఅసనాలంకృత:
లక్ష్మీ నాగవరేక్షిత స్సముపయన్ దేవీం మలర్ మంగ ఇ
త్యాస్తే స్తుత్య వపు శ్శఠారి కలిజిత్ యుగ్మేణ నారాయణ:||
పాశురాలు
పా. కోవాగియ;మావలియై నిలజ్కొణ్డాయ్
తేవాశురమ్; శెత్తవనే తిరుమాలే!
నావా యుఱైగిన్ఱ ఎన్నారణ నమ్బీ;
ఆవా వడియా నివ నెన్ఱరుళాయే.
నమ్మాళ్వార్-తిరువాయిమొழி 9-8-7.
వివరాలు
| ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
|---|---|---|---|---|---|---|---|
| నారాయణన్ (నావాయ్ ముకుందన్) - | మలర్ మంగై తాయార్ | శెంగమల పుష్కరిణి | దక్షిణ ముఖము | కూర్చున్నసేవ భంగిమ | నమ్మాళ్వార్ తిరుమంగై ఆళ్వార్ | వేద విమానం | లక్ష్మీదేవికి గజేంద్రునకు |
చేరే మార్గం
షోరానూర్ నుండి కళ్లికోట పోవు మార్గములో గల "ఎడకోలమ్" నకు 1 కి.మీ. దూరమున గలదు. షోరానూర్ నుండి బస్లో కుట్టీపురంచేరి అక్కడ నుండి వేరుబస్సులోను చేరవచ్చును. వసతులు స్వల్పము
చిత్రమాలిక
ఇవికూడా చూడండి
మూలాలు
వెలుపలి లింకులు
| Wikimedia Commons has media related to Sreevallabha Temple. |
