తిరుమల తెప్పోత్సవం

ఇది ప్రతి యేటా ఫాల్గుణ పౌర్ణమి నాడు జరిగే ఉత్సవం. తిరుమలలోని స్వామివారి పుష్కరణిలో ప్రతి ఏటా వైభవంగా ఐదు రోజుల పాటు జరుగుతుంది.

మొదటి రోజు

సీతారాములతో పాటు లక్ష్మణుడు కూడా పూజింపబడతాడు.

రెండవ రోజు

శ్రీకృష్ణుడు మరియు రుక్మిణి పూజింపబడతారు

మూడు, నాలుగు మరియు ఐదవ రోజు

చివరి మూడు రోజుల పూజలు త్రయోదశితో మొదలయ్యి పౌర్ణమితో ముగుస్తాయి. ఈ మూడు రోజుల్లో ఉత్సవ విగ్రమైన మలయప్ప స్వామితో పాటు శ్రీదేవి, భూదేవి పూజింపబడతారు. ఈ ఉత్సవ మూర్తుల్ని అద్భుతంగా అలంకరించి పుష్కరిణి పై ఉన్న ప్రత్యేక తెప్పలపై ఉంచి పూజిస్తారు.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.