ఝాన్సీ
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో ఝాంసీ జిల్లా ఒకటి. ఝాంసీ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,746,715 . 1891లో ఝాంసీ జిల్లాతో లలిత్పూర్ ప్రాంతం ఝాంసీ జిల్లాతో చేర్చబడింది. 1974లో లలిత్పూర్ ప్రాంతం ప్రత్యేక జిల్లాగా రూపొందించబడింది.

| Jhansi జిల్లా झांसी जिला | |
|---|---|
| Uttar Pradesh జిల్లాలు | |
![]() Uttar Pradesh రాష్ట్రంలో Jhansi యొక్క స్థానాన్ని సూచించే పటం | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | Uttar Pradesh |
| డివిజన్ | Jhansi |
| ముఖ్యపట్టణం | Jhansi |
| తాలూకాలు | 1. Jhansi, 2. Mauranipur, 3. Moth, 4.Tehroli, 5.Garautha |
| ప్రభుత్వం | |
| • లోకసభ నియోకవర్గాలు | Jhansi |
| విస్తీర్ణం | |
| • మొత్తం | 5,024 |
| జనాభా (2011) | |
| • మొత్తం | 1 |
| • సాంద్రత | 400 |
| • Urban | 549 |
| జనగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | 866 |
| వెబ్సైటు | అధికారిక వెబ్సైటు |
ఝాన్సీ (ఆంగ్లం: Jhansi; హిందీ: झांसी) భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని చారిత్రాత్మక నగరం మరియు జిల్లా ముఖ్యపట్టణము. ఇది ఒక ప్రధానమైన రహదారి మరియు రైల్వే జంక్షన్. ఝాన్సీ పట్టణము రాతితో కట్టిన ఝాన్సీ కోట (ఝాంసీ ఫోర్ట్) చుట్టూ అభివృద్ధి చెందినది.
జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టు (నేషనల్ హైవే డెవెలెప్మెంట్ ప్రాజెక్ట్) మూలంగా ఝాన్సీ త్వరగా అభివృద్ధి చెందుతున్నది. కాశ్మీర్ నుండి కన్యాకుమారిని కలిపే ఉత్తర-దక్షిణ కారిడార్ మరియు తూర్పు-పడమర కారిడార్ లు రెండూ ఝాన్సీ మీదుగా ప్రయాణిస్తాయి.
సరిహద్దులు
జిల్లా ఉత్తర సరిహద్దులో జులాన్ జిల్లా, తూర్పు సరిహద్దులో హమీర్పూర్ జిల్లా మరియు మహోబ జిల్లా, దక్షిణ సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని తికమార్గ్ జిల్లా, వాయవ్య సరిహద్దులో లలిత్పూర్ జిల్లా, తూర్పు సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దతియ జిల్లా మరియు భింద్ జిల్లా ఉన్నాయి.
చరిత్ర
1861లో ఝాంసీ నగరప్రాంతం గ్వాలియర్ రాజాస్థానానికి ఇవ్వబడింది. ఝాంసీ రాజధాని ఝాంసీ నయోబద్కు తరలించబడింది. ఝాంసీ సైన్యరహిత గ్రామం. ఝాంసీ నగరం గ్వాలియర్ సుభాహ్ రాజధానిగా మారింది. 1886 నాటికి ఈ నగరం బ్రిటిష్ పాలకులు గ్వాలియర్ కోట మరియు సమీపంలోని మోరర్ కంటోన్మెంటుకు ఇచ్చి ఝాంసీ పట్టణాన్ని తీసుకుంది. తరువాత ఇది ఆగ్రా - ఓధ్ ప్రొవింస్లో జిల్లాగా చేయబడింది.[1] ఇది గ్వాలియర్ మహారాజుకు ఇవ్వబడిన తరువాత భూభాగ పరస్పర మార్పిడిలో భాగంగా 1886లో తిరిగి బ్రిటిష్ ప్రభుత్వ వశం అయింది. 1891లో 4,07,000 మంది ప్రజలు నివసించిన ఉన్న ఝాంసీ జిల్లా జనసంఖ్య 1991లో జిల్లా జనసంఖ్య 55,000 అయింది. [1]
విభాగాలు
- ఝాంసీ.
- లలిత్పూర్
- జలన్ (ఒరై)
- బరుయా సాగర్ (ఝాంసీ)
- బత్గ్యుయాన్ ఝాంసీ.
భౌగోళికం

జిల్లాలో పలు రైలుమార్గాలు ఉన్నాయి. జిల్లా దక్షిణ భూభాగం కొండలమయంగా ఉంటుంది. ఇది విద్యా పర్వత శ్రేణిలో ఉంది. జిల్లాలోని భుండేల్ఖండు వద్ద లెవల్ మైదానం ఉంది. ఇక్కడ సారవంతమైన నల్లరేగడి మట్టి ఉంది. ఇక్కడ పత్తిపంట పండుతుంది. జిల్లా పహుజ్, బెత్వా మరియు ధాసన్ నదుల మద్య ఉంది.
ప్రధాన పట్టణాలు
జిల్లా కేంద్రం ఝాన్సీ నగరం కాక జిల్లాలో మౌరనిపుర్, గరౌథ, మాత్, బబిన, చిర గాన్, సంథర్, గుర్సరై, ఎరిచ్ ( ఉత్తర ప్రదేశ్) వంటి ప్రధాన నగరాలు ఉన్నాయి.
2001 లో గణాంకాలు
| విషయాలు | వివరణలు |
|---|---|
| జిల్లా జనసంఖ్య . | 1,998,603,[2] |
| ఇది దాదాపు. | స్లొవేనియా దేశ జనసంఖ్యకు సమానం.[3] |
| అమెరికాలోని. | న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.[4] |
| 640 భారతదేశ జిల్లాలలో. | 231వ స్థానంలో ఉంది.[2] |
| 1చ.కి.మీ జనసాంద్రత. | 398 .[2] |
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 14.54%.[2] |
| స్త్రీ పురుష నిష్పత్తి. | 890:1000,[2] |
| జాతియ సరాసరి (928) కంటే. | |
| అక్షరాస్యత శాతం. | 75.05%.[2] |
| జాతియ సరాసరి (72%) కంటే. |
మూలాలు
- "Dschansi". Meyers Grosses Konversations-Lexikon. September 1905. Retrieved 18 November 2012.
- "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Slovenia 2,000,092 July 2011 est.
line feed character in|quote=at position 9 (help) - "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.
New Mexico - 2,059,179



