జి.ఎం.సి.బాలయోగి

గంటి మోహనచంద్ర బాలయోగి (అక్టోబర్ 1, 1951 - మార్చి 3, 2002) ఆంధ్ర ప్రదేశ్కు చెందిన పార్లమెంట్ సభ్యుడు మరియు తొలి దళిత లోక్‌సభ స్పీకర్.

గంటి మోహనచంద్ర బాలయోగి
జి.ఎం.సి.బాలయోగి
జననంజి.ఎం.సి.బాలయోగి
అక్టోబర్ 1, 1951
తూర్పు గోదావరి జిల్లా యెదురులంక
మరణంమార్చి 3, 2002
కృష్ణా జిల్లా కువ్వడలంక
మరణ కారణముహెలికాప్టరు ప్రమాదం
సాధించిన విజయాలుపార్లమెంట్ సభ్యుడు
పదవీ కాలముమార్చి 24 - 2002 మార్చి 3 లోక్‌సభ స్పీకర్
భార్య / భర్తవిజయకుమారి
పిల్లలుముగ్గురు కుమార్తెలు
తండ్రిగన్నయ్య
తల్లిసత్యమ్మ

జననం

బాలయోగి 1945, అక్టోబర్ 1తూర్పు గోదావరి జిల్లా యెదురుగన్నయ్య మరియు సత్యమ్మ లంక గ్రామములో గంటి దంపతులకు ఒక దళిత రైతు కుటుంబములో జన్మించాడు. ఈయన ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎం.ఏ మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల నుండి లా డిగ్రీలతో పట్టభద్రుడయ్యాడు. 1982 ఏప్రిల్ 16 న విజయకుమారిని వివాహము చేసుకున్నాడు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు మరియు ఒక కుమారుడు.

మరణం

2002, మార్చి 3భీమవరము నుండి తిరిగివస్తుండగా సాంకేతిక లోపము వలన హెలికాప్టరు ఒక కొబ్బరి చెట్టుకు తగిలి కృష్ణా జిల్లా కువ్వడలంక గ్రామము సమీపములోని ఒక చేపల చెరువులో కూలిపోయి, ఆ ప్రమాదములో బాలయోగి మరణించాడు.

నిర్వహించిన పదవులు

వేమగిరి (తూ.గో.జిల్లా)లో జి.ఎం.సి.బాలయోగి విగ్రహం
  • 1987 - 1991 తూర్పు గోదావరి జిల్లా పరిషత్ అధ్యక్షుడు
  • 1991లో 10వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనాడు.
  • 1996 - 1998 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడు, ఉన్నత విద్యా శాఖా మంత్రి
  • 1998 - 12వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనాడు.
  • 1998, మార్చి 24 - 2002, మార్చి 3 లోక్‌సభ స్పీకర్
  • 1999 13వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనాడు.

మూలాలు

    ఇతర లింకులు

    అంతకు ముందువారు
    పి.ఎ.సంగ్మా
    భారత లోక్‌సభ స్పీకర్లు
    19982002
    తరువాత వారు
    మనోహర్ జోషి


    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.