చదలవాడ సుందరరామశాస్త్రి
చదలవాడ సుందరరామశాస్త్రి సంస్కృతాంధ్రాలలో పండితుడు, బహుగ్రంథకర్త. వేంకటగిరి రాజాస్థానంలో ఆస్థాన పండితులుగా పనిచేశారు. "శారదాంబావిలాస ముద్రాక్షరశాల"ను స్థాపించి ఎన్నో గ్రంథాలను ప్రచురించారు. 1922లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుండి తన సాహితీసేవకు గాను స్వర్ణకంకణం అందుకున్నారు.
| చదలవాడ సుందరరామశాస్త్రి | |
|---|---|
| జననం |
చదలవాడ సుందరరామశాస్త్రి 1865 వెంకన్నపాలెం |
| మరణం | 1925 |
| వృత్తి | పండితుడు, రచయిత |
| తండ్రి | రామశాస్త్రి |
| తల్లి | సీతమ్మ |
ముద్రాక్షరశాల స్థాపన, నిర్వహణ
శాస్త్రిగారు 1889లో "శారదాంబ విలాస ముద్రాక్షరశాల" స్థాపించారు. దీనికి అప్పటి వెంకటగిరి రాజా శ్రీ సర్వజ్ఞ కుమార యాచేంద్రులు (1831-1892) ప్రధానపోషకులు. ఈ సంస్థ వెలువరించిన కొన్ని గ్రంథములు - రాజావారు రాసిన "మనః సాక్ష్యము, గోపీనాథుని వెంకయ్య శాస్త్రి రాసిన కృష్ణజన్మఖండము, సర్వజ్ఞ కుమార యాచేంద్రులు రాసిన సభారంజని మరియు చదలవాడ వారే రాసిన మనుధర్మశాస్త్రము (తెలుగు లిపిలో).
గ్రంథముల పట్టిక
- భగవద్గీతా పరమార్థ చంద్రిక (భగవద్గీతకు తెలుగు టీక)
- శ్రీమద్రామాయణము (తెలుగులిపిలో, టీకాతాత్పర్యాలతో)
- దక్షిణామూర్తి స్తోత్రం
- ఆంధ్ర రుద్రాధ్యయనము
- వేదాంత డిండిమము
- అపరోక్షానుభూతి
- గౌతమ స్మృతి
- మనుధర్మ శాస్త్రము (తెలుగు లిపి, టీక)
- అంబగీతం
- శ్రీరామ హృదయము
- శ్రీ రామాయన సార సంగ్రహము
- ఆదిత్య హృదయము
- ధర్మ సింధువు
- ఆదివిరాట పర్వములు (టీక - దండిగుంట సూర్యనారాయణ శాస్త్రి తో కలిసి)
- వశిష్ట రామాయణము
- జగన్నాథ శతకము
మూలాలు
తెలుగు జాతిరత్నాలు - వావిళ్ళ రామస్వామిశాస్త్రి, సి.పి.బ్రౌన్ ప్రచురణ 2009, అధ్యాయం -ఏడు.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.