గోవింద్ వల్లభ్ పంత్

గోవింద్ వల్లభ్ పంత్ (1887 సెప్టెంబరు 10 - 1961 మార్చి 7 ) భారతదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ నాయకుడు. హిందీని భారత దేశ అధికార భాషగా చేయడానికి ఈయన కృషి చేశాడు.

గోవింద్ వల్లభ్ పంత్
గోవింద్ వల్లభ్ పంత్
జననంగోవింద్ వల్లభ్ పంత్
1887 సెప్టెంబరు 10
మరణం1961 మార్చి 7
ఇతర పేర్లుగోవింద్ వల్లభ్ పంత్
ప్రసిద్ధిస్వాంతంత్ర్య సమరయోధుడు

ఒక పేద కుటుంబములో జన్మించిన పంత్, వకీలు వృత్తిని ఎంచుకుని 1914లో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వ్యాజ్యములో విజయం సాధించాడు. 1921లో అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసి గెలవడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగు పెట్టాడు. 1937-39, 1946-50 లలో సంయుక్త రాజ్యాలకు (United Provinces: యునైటెడ్ ప్రావిన్సెస్) ముఖ్యమంత్రిగా, ఆ పైన ఉత్తర్ ప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1950-54 లలో తొలి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 1955 లో కేంద్ర ప్రభుత్వంలో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఈయనకు 1957లో భారతరత్న పురస్కారం లభించింది.

రాజకీయ కార్యాలయాలు
అంతకు ముందువారు
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి
26 జనవరి 1950 – 27 డిసెంబర్ 1954
తరువాత వారు
సంపూర్ణానంద్
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.