కె. రామలక్ష్మి
కె. రామలక్ష్మి డిసెంబరు 31, 1930 వ తేదీన కోటనందూరులో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం బి.యే. పట్టభద్రులు. 1951నుండీ రచన సాగిస్తున్నారు. ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యం, ప్రాచీనాంధ్రసాహిత్యం చదివేరు. తెలుగు స్వతంత్రలో ఇంగ్లీషు విభాగానికి ఉపసంపాదకులుగా పని చేసేరు. అనువాదాలు చేసేరు. స్త్రీసంక్షేమసంస్థలలో పని చేసేరు. ఈమె రామలక్ష్మి ఆరుద్ర అన్న కలంపేరుతో కూడా రచనలు చేసేరు. 1954లో ప్రముఖ కవి, సాహిత్యవిమర్శకుడు అయిన ఆరుద్రతో వివాహమయింది. వీరికి ముగ్గురు కుమార్తెలు. ప్రస్తుతం హైదరాబాదులో నివాసం.
నవలలు
- విడదీసే రైలుబళ్ళు (1954)
- అవతలిగట్టు
- మెరుపుతీగె
- తొణికిన స్వర్గం (1961)
- మానని గాయం
- అణిముత్యం
- పెళ్ళి (2013)
- ప్రేమించు ప్రేమకై
- ఆడది
- ఆశకు సంకెళ్ళు
- కరుణ కథ
- లవంగి
- ఆంధ్ర నాయకుడు
- పండరంగని ప్రతిజ్ఞ
కథాసంకలనాలు
- నీదే నాహృదయం
- అద్దం
- ఒక జీవికి స్వేచ్ఛ
పురస్కారాలు
వనరులు
- [ రామలక్ష్మి, కె. (సం.) ఆంధ్రరచయిత్రులు సమాచార సూచిక. ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీ, 1968.]
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.