కె.విజయరామారావు

పుట్టింది కరీంనగర్‌ జిల్లా ఏటూరు నాగారం.ఉన్నత పాఠశాల‌ దాకా విద్యాభ్యాసం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరిగింది.తాతగారు (అమ్మ నాన్న) కల్యాణరావు స్వాతంత్య్ర సమరయోధుడు. వెంకటగిరిలో చాలా పెద్ద భూస్వామ్య కుటుంబం.వెంకటగిరిలో విద్యాభ్యాసం అయిపోయాక పైచదువులకు మద్రాసు యూనివర్సిటీలో చేరాడు.బి.ఎ. ఆనర్స్‌ పూర్తవగానే 1958 అక్టోబరులో కరీంనగర్‌ ఎస్‌.ఆర్‌.ఆర్‌. కాలేజీలో లెక్చరర్‌ ఉద్యోగంలో చేరాడు.విశ్వనాథ సత్యనారాయణ ఆ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉండేవాడు.1959 అక్టోబరు నాటికి ఐ.పి.ఎస్‌. ట్రైనీగా శిక్షణ పొంది చిత్తూరు ఏ.ఎస్పీ.గా చేరాడు.1984 ఆగస్టు సంక్షోభం నాటికి ఇతను హైదరాబాద్‌ కమిషనర్‌గా ఉన్నాడు.సి.బి.ఐ. డైరెక్టర్‌గా హవాలా కుంభకోణం, బాబ్రీమసీదు విధ్వంసం, ఇస్రో గూఢచర్యం కేసు,ముంబై బాంబు పేలుళ్లు.మొదలైన కేసులు దర్యాప్తు నిర్వహించాడు. సర్వీసులో ఉండగానే ఎల్‌.ఎల్‌.బి.పూర్తి చేశాడు.రిటైరైయిన తర్వాత పోలీస్‌ మాన్యువల్‌ రాశాడు. అధికార వికేంద్రీకరణ మీద నమ్మకం ఎక్కువ. తెదేపా పార్టీలో చేరాడు.ఖైరతాబాద్‌ నుంచి శాసన సభ్యుడిగా గెలిచాడు.శాసన సభ్యుడిగా ఎన్నికైన తొలిసారే మంత్రి పదవి (రోడ్లూ భవనాల శాఖ) దక్కింది.

భావాలు

  • ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం పొట్టిశ్రీరాములు నిరాహార దీక్ష ప్రారంభించినప్పుడు ఇతను డిగ్రీ చదువుతున్నాడు. తెలుగువాళ్లు ఎక్కడ చేరినా అదే మాట్లాడుకునేవాళ్లు.ఆయన చనిపోయాక అప్పటి ప్రధాని నెహ్రూ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాడు. అదీ మద్రాసు లేకుండా. 'ఈ ప్రకటనేదో కొన్నిరోజులు ముందు చేసి ఉంటే ఆయన మనకు దక్కేవారు కదా' అని అతను ఎంతో బాధపడ్డసందర్బాలు ఉన్నాయి.

మూలాలు

  • ఈనాడు పత్రికలో వ్యాసం
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.