కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లా కు ఆ పేరు జిల్లాలో ప్రవహించే కృష్ణా నది వల్ల వచ్చింది. జిల్లా అధికారిక కేంద్రం మచిలీపట్నం కాగా, వాణిజ్య కేంద్రంగా విజయవాడ ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లా సరిహద్దులలో ఉత్తరాన ఖమ్మం జిల్లా, తూర్పున పశ్చిమ గోదావరి, దక్షిణాన బంగాళాఖాతము, నైరుతిలో గుంటూరు జిల్లా, వాయవ్యంలో నల్గొండ జిల్లా ఉన్నాయి.

కృష్ణా జిల్లా
.
Countryభారత దేశం
Stateఆంధ్ర ప్రదేశ్
Regionకోస్తా
Headquarterగుంటూరు
విస్తీర్ణం
  మొత్తం8,727
జనాభా (2011)
  మొత్తం45,29,009
  సాంద్రత519
Languages
  Officialతెలుగు
సమయప్రాంతంIST (UTC+5:30)
Telephone code+91 0( )
Literacy74.37 (2001)
Literacy Male79.13
Literacy Female69.62
వెబ్‌సైటుhttp://krishna.ap.nic.in/


జిల్లా చరిత్ర

అంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య పుణ్యక్షేత్రాలు

కృష్ణా పరీవాహక ప్రాంతం కనుక ఈ జిల్లాకు ఈ పేరు వచ్చింది. ఈ జిల్లాలో ఉన్న ఇంద్రకీలాద్రి మీద అర్జునుడు పాశుపతాస్త్రం కొరకు పరమశివుని ఉద్దేశించి తపమాచరించాడని, దుర్గాదేవి ఇక్కడ మహిశాసురుడిని సంహారం చేసిందని పురాణకథనాలు వివరిస్తున్నాయి. కృష్ణా నది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువు తీరి ఉన్న కనక దుర్గాదేవి భక్తజన పూజలను అందుకొంటూ ఉంది. చరిత్రలో వివిధ కాలాల్లో శాతవాహనులు, చోళులు, రెడ్డిరాజులు, గోల్కొండ నవాబులు మొదలైనవారు ఈ ప్రాంతాన్ని పాలించారు. మొవ్వ గ్రామము లోని కృష్ణుని దేవాలయము చాలా పురాతనమైనది. ఈ ఊరి స్థల పురాణము ప్రకారం మౌద్గల్య మహర్షి చేత ఇసుకతో ఇచటి మువ్వ గోపాల స్వామి విగ్రహం తయారుచేయబడెను. ఆ విగ్రహం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. అంతే కాక చదువు రాని వరదయ్య తరువాతి కాలంలో క్షేత్రయ్యగా స్వామి కృపతో గొప్ప కవి అయ్యాడని ప్రతీతి. క్షేత్రయ్య రాసిన శృంగార కవిత్వం ఎంతో ప్రసిద్ధి. కృష్ణా జిల్లాను ఇంతకు ముందు "మచిలీపట్నం జిల్లా" అని పిలిచేవారు. 1859లో గుంటూరు జిల్లాలోని కొన్ని తాలూకాలను ఈ జిల్లాలో కలిపి కృష్ణాజిల్లాగా పేరు మార్చారు. 1925లో కృష్ణాజిల్లాను కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలుగా విభజించారు.

శాతవాహనుల కాలం

శ్రీకాకుళం రాజధానిగా శ్రీముఖుడు శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. శాతవాహన రాజులు నాలుగు శతాబ్దాల కాలం పాటూ ఈ ప్రదేశాన్ని పాలించారు.

పల్లవులు

గుంటూరు జిల్లా మైదవోలులో లభించిన తామ్ర శాసనాలననుసరించి పల్లవులు ఈ ప్రాంతాన్ని 250 నుండి 340 క్రీ.శ॥ వరకూ పాలించారు.

బృహత్పలాయనులు

వీరు కోడూరు రాజధానిగా ఈ జిల్లా ప్రాంతాన్ని పల్లవుల తదుపరి పాలించారు.

విష్ణు కుండినులు

వీరు క్రీ.శ॥5వ శతాబ్దంలో పాలించారు. వీరి కాలంలోనే మొగల్రాజపురం ఇంకా ఉండవల్లిలోని గుహలు తవ్వించి తీర్చిదిద్దబడ్డాయి.

తూర్పు ఉండవల్లిలోతూర్పుచాళుక్యులు

వీరుని గుహామందిరాలు ఇంకా శివాలయాలు కట్టించారు.

కాకతీయులు

క్రీ.శ॥1323 వరకు వీరి పాలన జరిగింది. వీరి కాలంలో జిల్లాలోని ఎన్నో దేవాలయాలు పోషించబడ్డాయి.

రెడ్డిరాజులు

కొండపల్లిలోని కోట శిథిలాలు వీరి పాలనకు తార్కాణంగా నిలుస్తాయి.

గజపతులు

రెడ్డిరాజుల అనంతరం గజపతుల పాలనలో కృష్ణా జిల్లా ప్రాంతం వచ్చింది. ప్రస్తుత పమిడిముక్కల మండలంలోని కపిలేశ్వరపురం గజపతి రాజయిన కపిలేశ్వర గజపతి పేరున నామకరణం చేయబడింది. కపిలేశ్వర గజపతి తదుపరి వచ్చిన విద్యాధర గజపతి విజయవాడలోని విద్యాధరపురాన్ని ఇంకా కొండపల్లి సరస్సుని నిర్మించాడు.

విజయనగర సామ్రాజ్యం

విజయనగర సామ్రాజ్య కాలంలో జిల్లాలో ఎన్నో దేవాలయాలు, కోటలు వెలిశాయి. జీర్ణ దేవాలయాలు ఉద్ధరింపబడ్డాయి. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు సన్నిధిలోనే కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదను రచించి అంకితమిచ్చాడు.

కుతుబ్ షాహీలు

క్రీ.శ॥1512 లో గోల్కొండ వద్ద సుల్తాన్ కులీ కుతుబ్ షా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ సామ్రజ్యంలో జిల్లా కూడా ఒక భాగమే. మచిలీపట్నం ఓడ రేవుగా ఎగుమతి-దిగుమతులు జరిగేవి. తానీషాగా ప్రసిద్ధి చెందిన అబూ హుసేన్ షా మంత్రులయిన అక్కన్న ఇంకా మాదన్న వారి కార్యాలయాన్ని విజయవాడలో స్థాపించారు. వీరిరువురు కనక దుర్గ అమ్మవారిని ఆరాధించేవారు. నేటికీ ఇంద్రకీలాద్రి కొండ దిగువన వీరు ఆరాధించిన గుహలు మనకు దర్శనమిస్తాయి.

నిజాములు

ఔరంగజేబు సామ్రాజ్యంలో భాగమయిన గోల్కొండను 5 నవాబులకు విభజించి ఆసఫ్ ఝా సుబేదారుగా పాలించాడు. ఆర్కాటు, కడప, కర్నూలు, రాజమండ్రి మరియు చీకకోల్(శ్రీకాకుళం) నవాబుల కింద పాలించబడ్డాయి. రాజమండ్రి నవాబు కృష్ణా జిల్లాను పాలించేవాడు.

ఆంగ్లేయులు

క్రీ.శ॥1611 లో ఆంగ్లేయులు మచిలీపట్నంలో బస చేసారు. 1641 లో మద్రాసుకు తరిలి వెళ్ళే వరకూ ఇది వారికి ముఖ్యపట్నం(హెడ్‍క్వార్టర్)గా కొనసాగింది. ఆంగ్లేయుల తరువాత డచ్చి మరియు ఫ్రెంచి వారు మచిలీపట్నాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. 1748 లో నిజాం-ఉల్-ముల్క్ మరణంతో జిల్లా ఆంగ్లేయులు మరియు ఫ్రెంచి వారి హస్తగతమయింది. 1761 లో నిజాం అలీ ఖాన్ తిరిగి గోల్కొండ నవాబు అయినపుడు మచిలీపట్నం నిజాం పట్నం ఇంకా కొండవీడులో కొంత భాగం బ్రిటిష్ వారికి కానుక ఇచ్చాడు. మెల్లిగా సర్కారు ప్రాంతం మొత్తం బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది.

వృత్తి

పట్టణ ప్రాంత ప్రజలలో ఎక్కువ మంది వ్యాపారంలో ఉండగా, గ్రామాల్లో వ్యవసాయం ప్రధాన వృత్తి.

నదులు

కృష్ణా నది(పొడవు 1280 కి.మీ.) జిల్లాలో ప్రవహించే ముఖ్యమయిన నది. బుడమేరు, మున్నేరు మరియు తమ్మిలేరు ఇతర నదులు. కృష్ణా నది బంగాళా ఖాతంలోకి హంసలదీవి మరియు నాచుగుంట వద్ద కలుస్తుంది. ఇవి కాక జిల్లాలో చిన్న కొండవాగులు కూడా ప్రవహిస్తాయి. ఇవి జయంతి, కట్టలేరు, ఇప్పలవాగు, ఉప్పుటేరు, తెల్లేరు, బళ్ళలేరు, ఇంకా నడిమేరు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సులో కొంత భాగం కృష్ణా జిల్లాలో ఉంది.

ముఖ్యమయిన పట్టణాలు

విజయవాడ, గుడివాడ, ఉయ్యూరు,మచిలీపట్నం,చల్లపల్లి, కొండపల్లి, తిరువూరు, కైకలూరు, నందిగామ, నూజివీడు, జగ్గయ్యపేట, మొవ్వ మొ॥ ఈ జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలు. జిల్లాలోని హనుమాన్ జంక్షన్ కు ప్రత్యేకత ఉంది. ఇక్కడ కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలు కలిసి నూజివీడు-మచిలీపట్నం రహదారికిరువైపులా ఉంటాయి. అలాగే మూడు మండలాలు కలిసి ఉంటాయి. ఇక్కడ ఉన్న హనుమంతుని ఆలయము చాలా విశిష్టమైనది. పట్టణానికి ఆ పేరు ఈ ఆలయము వలన వచ్చినదే.

భౌగోళిక స్వరూపం

  • కృష్ణా జిల్లా పీఠభూమి మరియు తీర ప్రాంతాలుగా విభజించబడింది. భారతదేశ అత్యంత పర్యావరణ సంబంధిత ముఖ్యమైన చిత్తడినేలలో కొల్లేరు సరస్సు ఒకటి ఈజిల్లా లోనే పాక్షికంగా ఉంది.

కొండలు

నీటివనరులు

కృష్ణ నది మీదుగా విజయవాడ వద్ద ప్రకాశం బారేజి

భూమి మరియు భూగర్భ వనరులు

  • జిల్లాలో నల్లమట్టి (57.6%), ఇసుక బంకమట్టి (22.3%) ఎర్ర బంకమట్టి (19.4%) అను మూడు రకాల నేలలు ఉన్నాయి.
ఆంశంకొలమానంసంఖ్యమూలం
మైనింగ్ & గనుల త్రవ్వకం%0.451991 జనాభా లెక్కల ప్రకారం
  • విస్తృతంగా సహజ వాయువు మరియు ముడి పెట్రోల్ నిక్షేపాలు తీరం వెంబడి సముద్రం మరియు జిల్లా యొక్క తీర ప్రాంతములో ఉన్నాయి.
  • కొద్దిపాటి వజ్రాల చిన్న చిన్న నిక్షేపాలు లభిస్తాయి.
  • సున్నపురాయి ప్రధాన ఖనిజముగా ఈ జిల్లా నుండి సేకరిస్తారు.
  • భవన నిర్మాణం కోసం వాడబడే ఇసుకను కృష్ణ మరియు మున్నేరు నదుల నుండి త్రవ్వకాలు జరిపి సేకరిస్తారు.
  • ఖనిజాలు దొరుకు ప్రాంతములు:
  • క్రోమైటు : కొడపల్లి కొండలు మరియు దగ్గర ప్రాంతాలలో
  • వజ్రాలు : పరిటాల, ఉస్తేపల్లి, కొండవీటికల్లు, రామన్నపేట, సూర్యవరం, కొత్తపేట, నెమలిపురం, మాగులూరు మరియు పుట్రేల (రాజస్థాన్ లో ప్రముఖ మైనవి) మొదలైన ప్రాంతాలు.
  • ఇనుము ధాతువు : జగ్గయ్యపేట ప్రాంతం.
  • సున్నపురాయి : జగ్గయ్యపేట ప్రాంతం.
  • మైకా : తిరువూరు ప్రాంతం.

ఆటవీ ప్రదేశం

ఆంశంకొలమానంసంఖ్యమూలం
అటవీ ప్రాతం%7.51997-98 లెక్కల ప్రకారం (సుమారు 9% ఉజ్జాయింపుగా ఉండవచ్చును.)

వాతావరణం

  • జిల్లా వాతావరణ పరిస్థితులు వేసవికాలం చాలా వేడిగా, శీతాకాలం తేలికపాటిగా ఉంటాయి. అంతేకాక ఇక్కడి వాతావరణం పరిస్థితులు ఉష్ణ ప్రాంతములుగా వర్గీకరింపబడ్డాయి. ఏప్రిల్ ప్రారంభ కాలం నుండి జూన్ వరకు చాలా వేడిగా ఉంది. ఈ ప్రాంతంనకు నైరుతి రుతుపవనాల ద్వారా వర్షపాతం 1028 మి.మీ. అందించబడుతుంది.

ఆర్ధిక స్థితి గతులు

వ్యవసాయం

వ్యవసాయం గురించిన సమగ్రసమాచారం [1] కంప్యూటర్ ద్వారా అందుబాటులో ఉంది. దీనిని ఎక్కడికైనా తీసుకెళ్లగల కంప్యూటర్ మరియు ప్రొజెక్టర్ ద్వారా రైతులకు అందుబాటులోనికి తెస్తున్నారు.

వ్యాపారం

  • కృష్ణా జిల్లా పట్టణ ప్రాంతాలలో ఎక్కువ మంది వ్యక్తులు వ్యాపారము మరియు వాణిజ్యం లతో నిమగ్నమై ఉన్నారు. వ్యవసాయం జిల్లా ప్రజల యొక్క అతి ముఖ్యమైన వృత్తిగా ఉంది.
ఆంశంకొలమానంసంఖ్యమూలం
వ్యవసాయం & అనుబంధ కార్యకలాపాలు%66.181991 జనాభా లెక్కల ప్రకారం
స్థూల సాగునీటి ప్రాంతం%62.001997-98 లెక్కల ప్రకారం
తలసరి ఆహార ధాన్యాల ఉత్పత్తికి.గ్రా.3211997-98 లెక్కల ప్రకారం
  • కృష్ణా జిల్లాలో ఎన్నో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లా అనేక పరిశ్రమలకు ఆతెధ్యము ఇస్తున్నది. వాటిలో కెసీపి చక్కెర కర్మాగారం చెప్పుకోతగ్గది. ఉయ్యూరు వద్ద ఉన్న KCP షుగర్ ఫ్యాక్టరీ భారతదేశంలోని అతిపెద్ద చక్కెర కర్మాగారములలో ఒకటి. ఇబ్రహీంపట్నం సమీపంలో, విజయవాడ థర్మల్ పవర్ స్టేషను (VTPS) దాని పనితీరునకు భారతదేశంలో నం .1 అధిక పవర్ ఉత్పత్తి యూనిట్‌గా స్థానం పొందింది. ఇది కాక, అనేక మీడియం స్కేల్ సిమెంట్ కర్మాగారాలు జిల్లా అంతటా ఉన్నాయి. మచిలీపట్నం వద్ద బంగారం-లేపనం ఆభరణాలు, కొండపల్లి వద్ద బొమ్మలు మరియు జగ్గయ్యపేట వద్ద సంగీత సాధన తయారీ పరికరాలు వంటి పలు చిన్న తరహా పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి.
ఆంశంకొలమానంసంఖ్యమూలం
మాన్యుఫాక్చరింగ్ (గృహేతర) పరిశ్రమలు%6.181991 జనాభా లెక్కల ప్రకారం
గృహ పరిశ్రమలు%2.391991 జనాభా లెక్కల ప్రకారం
నిర్మాణము%1.611991 జనాభా లెక్కల ప్రకారం
సేవలు%23.091991 జనాభా లెక్కల ప్రకారం
  • విజయవాడ వద్ద సిరీస్ (SIRIS) ఫార్మాస్యూటికల్ కంపెనీ, అలోపతిక్ మందులు తయారీ దిగ్గజాలలో ఇది మరొక సంస్థ. ఆంధ్ర ప్రదేశ్ లోని అతి పురాతన పోర్ట్ మచిలీపట్నంలో ఉంది. ఇదికాక ఎన్నో సిమెంటు ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. విజయవాడ దగ్గర ఇబ్రహీమ్ పట్నం వద్ద ఉన్న తాప విద్యుత్కేంద్రం చాలా పేరెన్నికగన్నది. ఇవికాక మచిలీపట్నంలో గిల్టునగల తయారీ, కొండపల్లి చెక్కబొమ్మలు, జగ్గయ్యపేటలో సంగీత సాధనముల తయారీ మొదలయిన చేతి వృత్తి పనులు కూడా ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన సాంప్రదాయిక నృత్య రీతి యైన కూచిపూడి నృత్యం జిల్లాలోని కూచిపూడి గ్రామంలో పుట్టింది.

జీవనస్థాయి

  • ఈ జిల్లాలో ఉన్న 4.187.841 (2001 నాటికి) జనాభాలో 32,08% శాతం పట్టణ జనాభా. జిల్లా పరిపాలన ప్రధాన కార్యాలయం మచిలీపట్నంలో ఉంది. విజయవాడకార్పొరేషన్ జిల్లా ప్రముఖ వ్యాపార, వాణిజ్య కేంద్రంగా ఉంది.
ఆంశంకొలమానంసంఖ్యమూలం
పట్టణీకరణం%35.821991 జనాభా లెక్కల ప్రకారం
మొత్తం జనాభాలో పనివారి శాతం%43.31991 జనాభా లెక్కల ప్రకారం

ఆర్థిక గణాంకాలు

ఆంశంకొలమానంసంఖ్యమూలం
తపాలా కార్యాలయములు (ప్రతి 100,000 మంది జనాభా)నిష్పత్తి22.041996-97 లెక్కల ప్రకారం
బ్యాంకులు (ప్రతి 100,000 మంది జనాభా)నిష్పత్తి9.331994-95 లెక్కల ప్రకారం
తలసరి బ్యాంకు డిపాజిట్లురూ.3386.421994-95 లెక్కల ప్రకారం
తలసరి బ్యాంకు ఋణాలురూ.2250.491994-95 లెక్కల ప్రకారం
వ్యవసాయానికి తలసరి బ్యాంకు ఋణాలురూ.604.491994-95 లెక్కల ప్రకారం
ఎస్.ఎస్.ఐ.(SSI)లకి తలసరి బ్యాంకు ఋణాలురూ.168.671994-95 లెక్కల ప్రకారం
పరిశ్రమలకు తలసరి బ్యాంకు ఋణాలురూ.490.861994-95 లెక్కల ప్రకారం

డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు

భౌగోళికంగా కృష్ణా జిల్లాను 50 రెవిన్యూ మండలాలుగా విభజించారు.[2].

కృష్ణా జిల్లా మండలాలు, రెవెన్యు విభాగాలు
1 జగ్గయ్యపేట మండలం18 పెనమలూరు మండలం35 నాగాయలంక మండలం
2 వత్సవాయి మండలం19 తోట్లవల్లూరు మండలం36 కోడూరు
3 పెనుగంచిప్రోలు మండలం20 కంకిపాడు మండలం37 మచిలీపట్నం మండలం
4 నందిగామ మండలం21 గన్నవరం38 గూడూరు
5 చందర్లపాడు మండలం22 అగిరిపల్లి మండలం39 పామర్రు మండలం
6 కంచికచెర్ల మండలం23 నూజివీడు మండలం40 పెదపారుపూడి మండలం
7 వీరులపాడు మండలం24 చాట్రాయి మండలం41 నందివాడ మండలం
8 ఇబ్రహీంపట్నం25 ముసునూరు మండలం42 గుడివాడ మండలం
9 జి.కొండూరు మండలం26 బాపులపాడు మండలం43 గుడ్లవల్లేరు మండలం
10 మైలవరం27 ఉంగుటూరు44 పెడన మండలం
11 ఏ.కొండూరు మండలం28 ఉయ్యూరు మండలం45 బంటుమిల్లి మండలం
12 గంపలగూడెం మండలం29 పమిడిముక్కల మండలం46 ముదినేపల్లి మండలం
13 తిరువూరు మండలం30 మొవ్వ మండలం47 మండవల్లి మండలం
14 విస్సన్నపేట మండలం31 ఘంటసాల48 కైకలూరు మండలం
15 రెడ్డిగూడెం మండలం32 చల్లపల్లి మండలం49 కలిదిండి మండలం
16 విజయవాడ గ్రామీణ మండలం33 మోపిదేవి మండలం50 కృత్తివెన్ను మండలం
17 విజయవాడ పట్టణం34 అవనిగడ్డ

లోకసభ నియోజకవర్గాలు

అసెంబ్లీ నియోజకవర్గాలు

  • ఆంధ్ర ప్రదేశ్ కృష్ణ జిల్లాలో 16 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
2014 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు తెలిపే పటము
(పసుపురంగులో తెదెపా+భజపా కూటమి గెలిచిన స్థానాలు)
(నీలం రంగులో వైకాపా గెలిచిన స్థానాలు)
క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ
188 తిరువూరు కెఆర్ నిధి వై.కా.పా
189 నూజివీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వై.కా.పా
190 గన్నవరం వల్లభనేని వంశీ తె.దే.పా
191 గుడివాడ కొడాలి నాని వై.కా.పా
192 కైకలూరు కామినేని శ్రీనివాసరావు భాజపా
193 పెడన కాగిత వెంకట్రావు తె.దే.పా
194 మచిలీపట్నం కొల్లు రవీంద్ర తె.దే.పా
195 అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్ తె.దే.పా
196 పామర్రు ఉప్పులేటి కల్పన వై.కా.పా
197 పెనమలూరు బోడె ప్రసాద్ తె.దే.పా
198 విజయవాడ పశ్చిమ జలీల్ ఖాన్ వై.కా.పా
199 విజయవాడ సెంట్రల్ బొండా ఉమామహేశ్వరరావు తె.దే.పా
200 విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ రావు తె.దే.పా
201 మైలవరం దేవినేని ఉమామహేశ్వరరావు తె.దే.పా
202 నందిగామ తంగిరాల ప్రభాకరరావు తె.దే.పా
203జగ్గయ్యపేట శ్రీ రామ రాజగోపాల్ (తాతయ్య) తె.దే.పా

పార్టీలు

రవాణా వ్వవస్థ

  • విజయవాడ వద్ద పండిట్ నెహ్రూ బస్ స్టేషను ఆసియాలోని అతి పెద్ద బస్ కాంప్లెక్స్‌లలో ఒకటి.
  • విజయవాడ వద్ద రైల్వే స్టేషను భారతదేశంలో 2 వ రద్దీగా ఉండే జంక్షన్ ఉంది. 200 కంటే ఎక్కువ రైళ్లు ఈ రైల్వే స్టేషను ద్వారా (పాస్) ప్రయాణించడము మరియు రైల్వే స్టేషను వద్ద రైలు ఆగిపోవడము లేదా (ప్రారంభము) బయలుదేరడము కాని జరుగుతుంది.
  • విజయవాడకు ఈశాన్యదిశలో 16 కి.మీ. దూరములో గన్నవరము వద్ద ఉన్న విమానాశ్రయం నుండి హైదరాబాద్, చెన్నై, బెంగుళూర్, రాజమండ్రి నగరములకు అనుసంధానముతో విమాన ప్రయాణమునకు వీలు ఉంది.
ఆంశంకొలమానంసంఖ్యమూలం
రహదారి పొడవు ప్రతి 100 చ.కి.మీ.కి.మీ.78.761996-97 లెక్కల ప్రకారం
రైలు మార్గము పొడవు ప్రతి 100 చ.కి.మీ.కి.మీ.2.141996-97 లెక్కల ప్రకారం
  • నాలుగు జాతీయ రహదారులు ఈ జిల్లా నుండి కలుపుతున్నాయి.
  1. కోల్‌కత నుండి చెన్నై = NH-5
  2. మచిలీపట్నం నుండి పూనే = NH-9
  3. జగదల్‌పూర్ నుండి విజయవాడ = NH-221
  4. ఒంగోలు నుండి కత్తిపూడి = NH-214

కృష్ణా జిల్లా రైల్వే స్టేషన్లు

స్టేషను పేరుస్టేషను కోడ్నగరం/పట్టణం
విజయవాడబిజడ్‌ఎవిజయవాడ
విజయవాడయుఎన్‌డబ్ల్యుసివిజయవాడ
విజయవాడయుఎన్‌ఐసివిజయవాడ
విజయవాడవిఎన్‌సివిజయవాడ
విజయవాడబిడబ్ల్యుడిసివిజయవాడ
విజయవాడబిజడ్‌ఎడబ్ల్యువిజయవాడ
అంబాపురంఎబిఎంఅంబాపురం
చెరువు మాధవరంసివివిచెరువు మాధవరం
గుడివాడజిడివిగుడివాడ
మచిలీపట్నంఎమ్‌టిఎమ్మచిలీపట్నం
మచిలీపట్నం ఫోర్ట్ఎమ్‌టిఎఫ్మచిలీపట్నం ఫోర్ట్
మధురానగర్మధురానగర్, (పాత సత్యనారాయణపురం స్టేషనుకు బదులుగా), విజయవాడ
కొండపల్లికెఐకొండపల్లి
గన్నవరంగన్నవరం
ఇందుపల్లిఇందుపల్లి
తాడేపల్లిటిపిఎల్తాడేపల్లి
కైకలూరుకెకెఎల్‌ఆర్కైకలూరు
ఉప్పలూరుఉప్పలూరు
చెరువు మాధవరంచెరువు మాధవరం
తరిగొప్పులతరిగొప్పుల
తెన్నేరుటిఎన్‌ఆర్‌యుతెన్నేరు
తేలప్రోలుతేలప్రోలు
దోసపాడుడిపిడిదోసపాడు
నిడమానూరుఎన్‌డిఎమ్నిడమానూరు, విజయవాడ
నూజివీడుఎన్‌జడ్‌డినూజివీడు, విజయవాడ
వెంట్రప్రగడవిపిజివెంట్రప్రగడ
నూజెళ్ళఎన్‌యుజెనూజెళ్ళ
పల్లెవాడపల్లెవాడ
పసలపూడిపిఎస్‌ఎల్‌పిపసలపూడి
పుట్లచెరువుపిసియుపుట్లచెరువు
పెడనపిఎవిపెడన
పెద ఆవుటపల్లిపిఎవిపిపెద ఆవుటపల్లి
మండవల్లిఎమ్‌డివిఎల్మండవల్లి
ముస్తాబాదఎమ్‌బిడిముస్తాబాద, విజయవాడ
మొఖాసా కలవపూడిఎమ్‌విపిమొఖాసా కలవపూడి
మోటూరుఒటిఆర్
రామవరప్పాడుఆర్‌ఎమ్‌విరామవరప్పాడు
రాయనపాడుఆర్‌వైపిరాయనపాడు
రాయనపాడు షాప్ఆర్‌వైపిఎస్రాయనపాడు
వడ్లమన్నాడువిఎమ్‌డివడ్లమన్నాడు
వీరవల్లివిఆర్‌విఎల్వీరవల్లి
గుడ్లవల్లేరుజివిఎల్గుడ్లవల్లేరు
చిలకలపూడిసిఎల్‌యుచిలకలపూడి
గంగినేనిజిఎన్‌ఎన్గంగినేని
గుణదలజిఎఎల్‌ఎగుణదల
గుంటాకోడూరుగుంటాకోడూరు
కౌతవరంకెవిఎమ్కౌతవరం
జగ్గయ్యపేటజెపిటిఎన్జగ్గయ్యపేట
కృష్ణాకెఎస్‌ఎన్కృష్ణా
మాచవరంఎమ్‌సివిఎమ్మాచవరం
మందపాడుఎమ్‌డిపిడిమందపాడు
రెడ్డిగూడెంఆర్‌ఈఎమ్రెడ్డిగూడెం
తేలప్రోలుటిఒయుతేలప్రోలు

జనాభా లెక్కలు

  • జనసాంద్రత అనేది ఒక జనాభా కొలమాన విధానము. ఒక చదరపు కిలోమీటరు ప్రాంతంలో నివసించే జనాభాను జనసాంద్రతగా పరిగణిస్తారు.
  • కృష్ణా జిల్లా 8.727 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఆక్రమించింది (3,370 sq mi),[3] ఈ జిల్లా సుమారు, తులనాత్మకంగా కోరిస్కాతో [4] సమానం.
ఆంశంకొలమానంసంఖ్యమూలం
ప్రదేశంచ.కి.మీ87272001 జనాభా లెక్కల ప్రకారం
జనాభావేలల్లో4218.412001 జనాభా లెక్కల ప్రకారం
పురుషులువేలల్లో2151.182001 జనాభా లెక్కల ప్రకారం
స్తీలువేలల్లో2067.222001 జనాభా లెక్కల ప్రకారం
పట్టణవేలల్లో1365.642001 జనాభా లెక్కల ప్రకారం
గ్రామీణవేలల్లో2852.762001 జనాభా లెక్కల ప్రకారం
జనాభా పెరుగుదల (దశసంఖ్యతో సం.)%+14.052001 జనాభా లెక్కల ప్రకారం
జనసాంద్రత (మనిషి/చ.కి.మీ.)నిష్పత్తి4832001 జనాభా లెక్కల ప్రకారం

విభాగాలు

గృహోపకరణ సూచికలు

  • 2007–2008 సంవత్సరములో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాప్యులేషన్ సంస్థ వారు జిల్లా అంతటా 1229 గృహాలు 34 గ్రామాలలో ఇంటర్వ్యూ జరిపారు.[5] వారు 94.7% విద్యుత్, 93,4% నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం, 60.3% టాయిలెట్ సౌకర్యాలు, మరియు 45.5 (శాశ్వత) నివాస గృహాసౌకర్యాలు ఉన్నట్లు కనుగొన్నారు.[5] 20.6% మంది స్త్రీలు అధికారక వయస్సు 18 సం.లు నిండక ముందే వివాహము చేసుకున్నారు.[6]
  • ఇంటర్వ్యూ నిర్వహించిన వారిలో 76,9% ఒక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు ఉన్నారు.

సంస్కృతి

  • ప్రపంచ ప్రసిద్ధ కూచిపూడి నృత్య రూపం ఈ జిల్లాలో నుండి ఉద్భవించింది.[7]
  • ఈ జిల్లా వాసులు మాట్లాడే తెలుగు యాసను తెలుగు భాషయొక్క సహజరూపమని భావించబడుతుంది.[8]

పశుపక్ష్యాదులు

వృక్షజాలం మరియు జంతుజాలం

  • జిల్లాలో చెప్పుకోదగ్గ అటవీప్రాంతం లేదు. అడవి మొత్తం జిల్లా వైశాల్యంలో 9% మాత్రమే ఉంది. అయితే నందిగామ, విజయవాడ,నూజివీడు, తిరువూరు,గన్నవరము, మచిలీపట్నం ప్రాంతాలలో మరియు దివి తాలూకాలలో రిజర్వు ఫారెస్ట్ కలిగి ఉంది. ఒక రకం అయిన పొనుకు (గైరోకాపస్ జాక్విని) అని పిలువబడే తేలికపాటి రకమయిన చెక్కకొండపల్లి కొండలు ప్రాంతములో కనిపిస్తుంది. ఈ చెక్కను ఎక్కువగా బాగా అందరికీ తెలిసిన కొండపల్లి బొమ్మలు తయారీకి ఉపయోగిస్తారు. చాలా గుర్తించదగ్గ చెట్లు అయిన టెరోకార్‌పస్, టెర్‌మినాలియా, ఎనోజీస్సస్, లోగస్ట్రోయినయ్ మరియు కాజురినా లాంటివి కూడా ఉన్నాయి.
  • పాంథర్స్ పులులు, దుమ్ములగొండులు, అడవి పిల్లులు, నక్కలు, ఎలుగుబంట్లు మరియు ఇతర మాంసాహార క్షీరదాల జంతుజాలం ​​ఇక్కడ కనిపిస్తాయి. జింక, మచ్చల లేడి సాంబార్, కృష్ణ జింక మరియు ఇతర శాకాహార జంతువులు ఈ భూభాగ అడవులలో గుర్తించవచ్చు.
  • కృష్ణ జిల్లా సరిహద్దు కొల్లేరుసరస్సులో ఒక వలస బూడిద రంగు గల పెలికాన్ బిల్డ్ అనే ఒక రక్షిత పక్షి ఉంది.
  • ఈ జిల్లా అనేక ముర్రా జాతి గేదెలు మరియు ఆవులు పెద్ద సంఖ్యలో కలిగి ఉంది.

విద్యాసంస్థలు

  • విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన విద్యా కేంద్రాలలో ఒకటి.[8]
  • కృష్ణా జిల్లాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు:
  1. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, విజయవాడ.
  2. కృష్ణ విశ్వవిద్యాలయం మచిలీపట్నం.
  3. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అనగా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నూజివీడు.
  4. దక్షిణ భారత శాఖ యొక్క స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయం
  5. ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్నం
  • భారతదేశం లోనే కార్పొరేట్ విద్యా సంస్థలు అతిపెద్ద / పెద్ద /మధ్య రకములు అయిన, అనేక నివాస కళాశాలలు మరియు పాఠశాలలు కలిగి ఉన్న సంస్థలలో పేరెన్నికగన్న శ్రీ చైతన్య, నలందా, గౌతమ్, శ్రీ కృష్ణవేణి సంస్థలు, అమెరికన్ మెడికల్ విద్య (USMLE) శిక్షణ సంస్థల ప్రధాన కార్యాలయములు
  • జిల్లాలో అనేకం ఇంజనీరింగ్ కాలేజ్‌లు ఉన్నాయి. వాటిలో ప్రముఖమైన వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్, కె.ఎల్.సి.ఈ., ఏ.ఏ.ఎన్.ఎమ్.‍ ‍‍& వి.వి.ఎస్.ఆర్ (గుడ్లవల్లేరు) పాలిటెక్నిక్ కళాశాల, మేరీ స్టెల్లా కళాశాల, సిద్ధార్థ డిగ్రీ కళాశాల సహా అనేక ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. జిల్లాలో అనేక ప్రసిద్ధ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలు కూడా ఉన్నాయి.
ఆంశంకొలమానంసంఖ్యమూలం
అక్షరాస్యత%69.912001 జనాభా లెక్కల ప్రకారం
అక్షరాస్యత (పురుషులు )%74.572001 జనాభా లెక్కల ప్రకారం
అక్షరాస్యత (స్తీలు )%65.052001 జనాభా లెక్కల ప్రకారం

కళాశాలలు

  • డా.ఎన్.టి.ఆర్. యూనివర్సిటి ఆఫ్ హెల్త్ సైన్సెస్. విజయవాడ
  • శ్రీమతి.వెలగపూడి దుర్గాంబ సిద్ధార్థ లా కాలేజ్, విజయవాడ.
  • జెస్తో కలినరి ‍అండ్ హాస్పిటాలిటి ఎకాడమి, గవర్నర్ పేట, విజయవాడ
  • ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్. గర్నమెంట్ కాలేజ్, విజయవాడ.
  • కె.బీ.న్.కాలేజ్,విజయవాడ.
  • సయ్యద్ అప్పల స్వామి కాలెజ్, విజయవాడ.
  • శాతవాహన కాలెజ్, విజయవాడ.
  • ఆంధ్ర లయెల కళాశాల, విజయవాడ.

ఆకర్షణలు

జిల్లాలో చారిత్రక స్థలాలు

మతపరంగా ముఖ్యమైన స్థలాలు

క్రీడలు

  • ఈ జిల్లాలో కబాడీ ఆట అత్యంత ప్రజాదరణ ఉన్న క్రీడతో పాటు క్రికెట్, వాలీబాల్ మరియు టెన్నిస్ ఆటలు ప్రాముఖ్యమైనవి. విజయవాడ లోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నందు, భారతదేశం యొక్క అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయి. ప్రముఖ హాకీ క్రీడాకారుడు బలరాం ఈ జిల్లాకు చెందినవారు.

ప్రముఖవ్యక్తులు

కృష్ణా జిల్లా ఎందరో ప్రఖ్యాత వ్యక్తులకు, నిపుణులకు ఆలవాలం. వీరిలో కొందరికి ఇది పుట్టినిల్లు కాగా, మరికొందరికి కార్యస్థానం. తమ తమ రంగాల్లో చిరస్మరణీయమైన సేవలందించిన ఎంతో మంది కృష్ణా జిల్లాతో ప్రత్యక్ష/పరోక్ష సాంగత్యాన్ని కలిగి ఉన్నారు. అంశాల వారీగా వారిలో కొందఱు...

లలిత కళలు మరియు సాహిత్యం:

రచయితలు

సంస్కరణ మరియు అభ్యుదయం:

శాస్త్ర సాంకేతిక రంగాలు :

  • ఆచార్య సూరి భగవంతం - ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త
  • డా. కానూరి లక్ష్మణరావు - ప్రఖ్యాత ఇంజనీర్
  • డా. నోరి దత్తాత్రేయుడు - కాన్సర్ వైద్య నిపుణులు
  • వేలూరి వేంకట కృష్ణ శాస్త్రి - పురావస్తు నిపుణులు, చరిత్ర కారులు
  • డా. సమరం

క్రీడలు:

రంగస్థలం మరియు సినిమా:

రాజకీయం

సంగీతం, సాహిత్యం

ప్రముఖులు

బయటి లింకులు

  1. సస్యశ్రీ జాలస్థలం
  2. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో కృష్ణా జిల్లా తాలూకాల వివరాలు. జూలై 26, 2007న సేకరించారు.
  3. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Andhra Pradesh: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1111–1112. ISBN 978-81-230-1617-7. |access-date= requires |url= (help)CS1 maint: Extra text: authors list (link)
  4. | title = Island Directory Tables: Islands by Land Area | accessdate = 2011-10-11 | date = 1998-02-18 | publisher = United Nations Environment Program | quote = Corsica 8,741
  5. | title = District Level Household and Facility Survey (DLHS-3), 2007-08: India. Andhra Prades | accessdate = 2011-10-03 | year = 2010 | format = PDF | publisher = International Institute for Population Sciences and Ministry of Health and Family Welfare
  6. | title = How Do I? : Obtain Marriage Certificate | accessdate = 2011-10-03 | year = 2005 | publisher = National Portal Content Management Team, National Informatics Centre | quote = To be eligible for marriage, the minimum age limit is 21 for males and 18 for females.

మూలాలు

    మూసలు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.