కురు వంశం

విశ్వామిత్రుడు మేనక సంభోగం వల్ల జన్మించిన శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమములో పెరుగుచుండగా ఒకరోజు ఆ మార్గములో అప్పటి రాజు దుష్యంతుడు వెళ్తుండగా , దుష్యంతుడు శకుంతలని చూసి ఆకర్షితుడై ఆమెని గాంధర్వ వివాహం చేసుకొని ఆమెను రాజ్యానికి వెళ్ళి రాజ్యసంస్కారలతో ఆహ్వానిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో శకుంతల భరతుడిని ప్రసవిస్తుంది. కణ్వ మహర్షి దివ్య దృష్టితో జరిగింది గ్రహించి శకుంతలని దుష్యంతుడి రాజ్యానికి పంపుతాడు. మెదట శకుంతల తన భార్య కాదు భరతుడు తన కుమారుడు కాదు అని అన్న దుష్యంతుడు, ఆకాశవాణి పలుకులతో జరిగిన వృత్తంతం గుర్తు తెచ్చుకొని భరతుడిని కుమారుడిగా అంగీకరిస్తాడు.

భరతుడి తరువాత వంశం

భరతుడి కుమారుడు భుమన్యుడు, భుమన్యుడి కుమారుడు సుహోత్రుడు, సుహోత్రుడి కుమారుడు హస్తి , హస్తి పేరు తోనే ఉన్నదే అప్పటి కురురాజుల రాజధాని, ఇప్పటి ఢిల్లీ నగరమైన హస్తినాపురం. హస్తి కుమారుడు వికంఠనుడు, వికంఠనుడి కుమారుడు అజమేఢుడు. అజమేఢుడికి 124 కుమారులు. వాని కుమారులలో ఒకడైన సంవరణుడికి సూర్యుని కుమార్తె అయిన తపతికి వివాహం జరిగింది. వారి కుమారుడు కురు. కురు పేరు తోనే కురువంశం వృద్ధి చెందింది. కురు కుమారుడు విదూరధుడు. విదూరధుడి కుమారుడు అనశ్వుడు. అనశ్వడి కుమారుడు పరిక్షిత్తు , పరిక్షిత్తు కుమారుడు భీమసేనుడు. భీమసేనుడు కొడుకు ప్రదీపుడు. ప్రదీపుడి కుమారుడు శంతనుడు

శంతనుడి తరువాతి వంశం

శంతనుడి భార్య గంగ శంతనుడికి గంగ వలన కలిగిన వాడు భీష్ముడు. శంతనుడికి సత్యవతి కి జన్మించినవారు చిత్రాంగదుగు మరియు విచిత్రవీరుడు. వీరికి దేవరన్యాయం ప్రకారం వ్యాసుని వల్ల జన్మించిన వారు దృతరాష్ట్ర, పాండు రాజులు జన్మించారు. దృతరాష్ట్ర కుమారులు కౌరవులు, పాండురాజు కుమారులు పాండవులు . కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు మరియు ఉపపాండవులు అంతమొందగా ఉత్తర గర్భంలో అభిమన్యుడి వలన భ్రూణం గా ఉన్న పరిక్షిత్తు ని రక్షించాడు శ్రీకృష్ణుడు. పరిక్షిత్తు కుమారుడు జనమేజయుడు

కురు వంశ వృక్షం


This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.