కనకదుర్గ గుడి

కనకదుర్గ గుడి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. విజయవాడ పేరు చెప్పగానే కనక దుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది.[1] ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది.

కనకదుర్గ గుడి
KANAKADURGA TEMPLE
విజయవాడలోని కనకదుర్గ ఆలయం
కనకదుర్గ గుడి
KANAKADURGA TEMPLE
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం
భౌగోళికాంశాలు :16.516°N 80.616°E / 16.516; 80.616
పేరు
ప్రధాన పేరు :కనక దుర్గ అమ్మవారి ఆలయం
దేవనాగరి :कनकदुर्ग अम्मवारि आलय
ప్రదేశము
దేశము:భారత దేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:కృష్ణా జిల్లా
ప్రదేశము:విజయవాడ
ఆలయ వివరాలు
ప్రధాన దేవత:కనక దుర్గా దేవి
ఇతిహాసం
నిర్మాణ తేదీ:సమాచారం లేదు
సృష్టికర్త:సమాచారం లేదు
దుర్గాగుడి

పేరువెనుక చరిత్ర

కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మావారుని గురించి తపస్సు చేసి , ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్ధిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనక దుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది.

గుడి క్రింది భాగము

క్షేత్ర పురాణం

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.

కనకదుర్గ అమ్మవారి విగ్రహము

రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు. [2]

ఇటీవలి పరిణామాలు

రు.50 కోట్లతో దేవాలయాన్ని మరింత అభివృద్ధిపరుస్తున్నట్లు దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమీషనర్ ప్రకటించాడు.[3]

నవరాత్రి ఉత్సవాలు

ఈ దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరము దసర నవరోత్సవాలు జరుగుతాయి. ఈ దసర నవరోత్సవల లో ప్రతి రోజు ఒక అవతారముతో దర్శనము ఇస్తారు. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో దర్శనము ఇస్తారు.

  • మొదతి రోజు బాల త్రిపురసుందరి దేవి .
  • రెండొవ రోజు గాయత్రి దేవి.
  • ముడొవ రోజు అన్నపూర్ణా దేవి.
  • నాలుగోవ రోజు లలితా త్రిపురసుందరి దేవి.
  • ఐదవ రోజు సరస్వతి దేవి .
  • ఆరొవ రోజు దుర్గాదేవి.
  • ఎడొవ రోజు మహాలక్ష్మిదేవి.
  • ఎనిమిదొవ రోజు మహిషాసురమర్దినిదేవి.
  • తొమ్మిదొవ రోజు రాజరాజేశ్వారిదేవి.

ఈ ఐదొవ రోజున జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ రోజు అమ్మవరి జన్మనక్షత్రంగా అనగా ములానక్షత్రం గా భావిస్తారు. ఆ రోజున వేలాది మంది భక్తులు, విద్యార్థులు తరలివస్తారు. ఈ దేవాలయంలో వినాయక స్వామి, ఈశ్వరుడు, శ్రీ రాము ల వారు కొలువుతీరి ఉన్నారు. ఈ దేవాలయాన్ని దర్సించుటకు అనేక మంది భక్తులు అనేక ప్రదేశాల నుండి వస్తారు.

దసరా పండుగ సంభ్రమాలు-2014

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న కనకదుర్గమ్మ వారు ఈ క్రింది తెలిపిన విధంగా వివిధ అలంకారాల్లో దసరా పది రోజుల్లో దర్శనమివ్వనున్నారు

తేదీవారపు రోజుతిథిఅలంకరణ
25-09-2014గురువారంఆశ్వీయుజ శుద్ధ పాడ్యమిశ్రీ స్వర్ణకవచాలంకృత దేవి
26-09-2014శుక్రవారంఆశ్వీయుజ శుద్ధ విదియశ్రీ బాలా త్రిపురసుందరీ దేవి
27-09-2014శనివారంఆశ్వీయుజ శుద్ధ తదియశ్రీ గాయత్రీ దేవి
28-09-2014ఆదివారంఆశ్వీయుజ శుద్ధ చవితిశ్రీ అన్నపూర్ణా దేవి
29-09-2014సోమవారంఆశ్వీయుజ శుద్ధ పంచమిశ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
30-09-2014మంగళవారంఆశ్వీయుజ శుద్ధ షష్ఠిశ్రీ మహాలక్ష్మీ దేవి
1/10/2014బుధవారంఆశ్వీయుజ శుద్ధ సప్తమిశ్రీ మహాసరస్వతీ దేవి
2/10/2014గురువారంఆశ్వీయుజ శుద్ధ అష్టమిశ్రీ దుర్గా దేవి మరియు శ్రీ మహిషాసురమర్దినీ దేవి
3/10/2014శుక్రవారంఆశ్వీయుజ శుద్ధ నవమి మరియు దశమి (దసరా)శ్రీ రాజరాజేశ్వరీ దేవి

బయటి లింకులు

మూలాలు

  1. "Kanka Durga". Retrieved 2006-08-20.
  2. "Devi Kanaka Durga, Vijayawada, Andhra Pradesh". Retrieved 2006-08-20.
  3. ఈనాడు దినపత్రిక ఆన్‌లైన్ ఎడిషన్, పశ్చిమ గోదావరి జిల్లా వార్తలు, తేది 25-01-2009
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.