కడప
కడప - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలోని నగరం. వైఎస్ఆర్ కడప జిల్లాకు ముఖ్య పట్టణం.
| రాయలసీమ*వేదిక |
| ?కడప ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం | |
![]() View of కడప, India | |
![]() ![]() | |
| అక్షాంశరేఖాంశాలు: 14.48°N 78.81°E | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ప్రాంతం | రాయలసీమ |
| జిల్లా(లు) | kadapa జిల్లా |
| గ్రామాలు |
}} --> |
| జనాభా | 3,25,725 (2001 నాటికి) |
| మేయరు | |
| కోడులు • పిన్కోడు • టెలిఫోను • వాహనం |
• 516001 • +91-8562 • AP04 |
రాష్ట్ర రాజధాని హైదరాబాదుకి దక్షిణదిశగా 412 కి.మీ ( మైళ్ళ) దూరంలో పెన్నా నదికి 8 కి.మీ (5 మైళ్ళ) దూరంలో ఉంది. నగరానికి రెండు వైపులా నల్లమల అడవులు ఉండగా, ఒక వైపు పాలకొండలు గలవు. తిరుమల వెంకటేశ్వర స్వామికి గడప కావటంతో దీనికి ఆ పేరు సిద్ధించింది.
రామాయణం లోని నాల్గవ భాగమైన కిష్కింధకాండం ఇక్కడికి 20 కి.మీ (12 మైళ్ళు) గల ఒంటిమిట్టలో జరిగినదని నమ్మకం. గండిలో కల ఆంజనేయ స్వామి గుడి కూడా రామాయణం లోని భాగమే అని నానుడి. రాముడు సీతని కనిపెట్టటంలో ఆంజనేయ స్వామి యొక్క సహాయాన్ని అంగీకరిస్తూ, తన బాణం యొక్క మొనతో ఈ గుడిని కట్టినట్లు ప్రతీతి.
వ్యుత్పత్తి
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఆంగ్లేయుల ఉచ్చారణకు అనుగుణంగా సృష్టించిన స్పెల్లింగు "Cuddapah" కి బదులుగా 19 ఆగష్టు 2005 లో ప్రాంతీయులకి సౌకర్యంగా ఉండేవిధంగా "Kadapa" అని మార్చారు.

చరిత్ర
11 నుండి 14వ శతాబ్దాల వరకు కడప చోళ సామ్రాజ్యము లోని భాగం.14వ శతాబ్దపు ద్వితీయార్థంలో ఇది విజయనగర సామ్రాజ్యములో భాగమైంది. గండికోట నాయకుల పరిపాలనలో రెండు శతాబ్దాల వరకూ ఉంది. 1422 లో పెమ్మసాని నాయకుడైన పెమ్మసాని తిమ్మయ్య నాయుడు ఈ ప్రాంతంలో పలు దేవాలయాలను, నీటిని నిల్వ ఉంచే తొట్లని కట్టి అభివృద్ధి చేపట్టాడు. 1594 లో రెండవ మీర్ జుమ్లా ఈ ప్రాంతాన్ని ఆక్రమణ చేసి చిన్న తిమ్మయ్య నాయుడిని మోసంతో గెలవటంతో ఇది గోల్కొండ ముస్లిముల పరమైనది. 1800 లో బ్రిటీష్ సామ్రాజ్యంలో భాగమైంది. కడప నగరం పురాతనమైంది. అయిననూ కుతుబ్ షాహీపాలకుడైన నేక్ నాం ఖాన్ దీనిని విస్తరించి దీనిని నేక్నామాబాద్ గా వ్యవహరించాడు. కొంత కాలం ఇలా సాగినా తర్వాత ఇది పతనంవగా 18వ శతాబ్దపు రికార్డుల ప్రకారం ఇది నేక్నాం ఖాన్ కడప నవాబు అని తేలింది. 18వ శతాబ్దపు ప్రారంభాన్ని మినహాయిస్తే మయానా నవాబులు|మయాన నవాబులకి ఇది ముఖ్య కేంద్రంగా విలసిల్లింది. బ్రిటీషు పాలనలో సర్ థామస్ మున్రో క్రింద ఉన్న నాలుగు కలెక్టరేట్ లలో ఇది కూడా ఒకటైంది. 1830 లో కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఆనాటి కడప స్థితిగతులను తన కాశీయాత్ర చరిత్రలో రికార్డు చేశాడు. దాని ప్రకారం అప్పటికి కడప మంచి స్థితిలోని పట్టణంగా చెప్పవచ్చు. అందరు పనివాళ్ళూ ఉన్నారని, జిల్లా కోర్టూ, కలక్టరు కచ్చేరీ కలదని వ్రాశాడు. ఆయా ఇలాకా ముసద్దీలు ఇళ్ళుకట్టుకుని పట్టణంలో కాపురమున్నారన్నారు. జలవనరులకై దగ్గరలో నది, ఊరినడుమ నీటిబుగ్గ ఉందని, ఇళ్ళు సంకుచితంగా ఉండేవని వర్ణించారు. ఊరివద్ద ఒక రెజిమెంటు ఉండేది, అందులో ఆ ప్రాంతపు దొరలు కాపురం ఉండేవారని తెలిపారు.[1] 2004 లో కడప మునిసిపల్ కార్పొరేషన్ గా గుర్తింపు పొందింది.
భౌగోళికం
కడప పట్టణం భౌగోళికంగా 14.47°N 78.82°E వద్ద ఉంది. 138 మీ (452 అడుగుల) సరాసరి ఎత్తు ఉంది. కడప జిల్లా వైశాల్యం 8723 చ.కి.మీ. తూర్పు కనుమలు జిల్లాని రెండుగా విడదీస్తాయి. ఈశాన్య, ఆగ్నేయ భాగాలు తక్కువ ఎత్తు గల పీఠభూమి కాగా, దక్షిణ, నైరుతి భాగాలు సముద్ర మట్టానికి 1500 నుండి 2,500 ఎత్తు గల భూమి. పశ్చిమం దిశగా బళ్ళారి నుండి అనంతపురం గుండా పారే పెన్నా నది ఇక్కడి నుండి తూర్పు భాగాన ఉన్న నెల్లూరు జిల్లా లోనికి ప్రవేశిస్తుంది. పరిమాణంలో ఈ నది పెద్దదిగా ఉండి, వర్షాకాలంలో బాగానే పారిననూ వేసవుల్లో మాత్రం చాలా భాగం ఎండిపోతుంది. దీని ప్రధాన ఉప నదులు కుందూ, సగిలేరు, చెయ్యేరు మరియు పాపాఘ్ని.
కడప నగరపాలక సంస్థ

కడప నగరపాలక సంస్థ వై.ఎస్.ఆర్ జిల్లా లోని ఏకైక నగరపాలక సంస్థ.
దర్శనీయ ప్రదేశాలు
- దేవుని కడప (లేదా) పాత కడప
- దేవుని కడప చెరువు
- అమీన్ పీర్ దర్గా (ఆస్థాన్-ఎ-మగ్దూమ్-ఇలాహి దర్గా)
- సి. పి. బ్రౌన్ గ్రంథాలయము
- సెయింట్ మేరీస్ క్యాథెడ్ర చర్చ్, మరియాపురం
- విజయదుర్గా దేవి గుడి, చిత్తూరు జాతీయరహదారి
- కడప శిల్పారామం
- వై ఎస్ ఆర్ క్రికెట్ స్టేడియం
- పాలకొండలు
- శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, కడప సమీపంలో
విద్యారంగం

- రాజీవ్ గాంధీ వైద్య కళాశాల, పుట్లంపల్లి
- కందుల శ్రీనివాస రెడ్డి స్మృత్యర్థ ఇంజినీరింగ కళాశాల
- హైదరాబాద్ పబ్లిక్ పాఠశాల
- యోగి వేమన విశ్వవిద్యాలయము
ప్రముఖులు
- కడప కోటిరెడ్డి
- మహబూబ్ మియా సాహెబ్ (తొలి తెలుగు ముస్లిం కదా రచయిత)
- షేక్ బేపారి రహంతుల్లా
- సజ్జా జయదేవ్ బాబు
- వై.యస్. రాజశేఖరరెడ్డి
ప్రదేశాలు
- మృత్యుంజయకుంట
- నబీకోట
- నకాష్
- ప్రకాశ్ నగర్
- ఓంశాంతి నగర్
- కో ఆపరేటివ్ కాలనీ
- ఎన్ జీ ఓస్ కాలనీ
- పోలీస్ క్వార్టర్స్
- రాజారెడ్డి వీధి
- మరియాపురం
- సీయోనుపురం
- రైల్వే స్టేషను రోడ్డు
- ఎర్రముక్కపల్లి
- కాగితాల పెంట
- మాచంపేట
- చంద్ర మౌలినగర్
సినిమా థియేటర్లు
- రమేష్
- అప్సర
- అమీర్
- తాహర్
- రవి
- సుధ
- ప్రతాప్
- మురళి
- రాజా (రహత్)
- ఎస్.ఆర్.సినిమాస్
రవాణా
కడపలో ముంబై చెన్నై రైల్వే లైన్ ఇది చాల పురాతనమైంది. అలాగే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కడప బెంగళూర్ రైల్వే లైన్ ఉన్నాయి. ఇది పెళ్ళిమర్రి వరకు పూర్తి అయింది .
- కడపలో కర్నూలు రాణిపేట లను కలిపే 40 వ జాతీయ రహదారి,
- చెన్నై ముంబైలను 716 వ జాతీయ రహదారి వయా పుత్తూరు, రేణిగుంట, కడప, తాడిపత్రి, గుత్తి, బళ్ళారి, ముంబై ల రహదారి
- కడప బెంగళూర్ 340 వ జాతీయ రహదారి వయా రాయచోటిి, మదనపల్లె,
- బెంగళూరు రహదారి మరియు కడప విజయవాడ హైవే వయా మైదుకూరు, పొరుమామిళ్ళ, కంభం,
- మార్కాపురం, గుంటూరు, విజయవాడ, హైవే మరియు కడప పులివెందుల హైవే, కడప బద్వేల్ నెల్లూరు హైవేలు కడప లో ఉన్నాయి.
వెలుపలి లింకులు
| Wikimedia Commons has media related to Kadapa. |
ఇవి కూడా చూడండి
మూలాలు
| వికీవాయేజ్ కోసం ఒక ట్రావెల్ గైడ్ ఉంది కడప . |
- వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
This article incorporates text from a publication now in the public domain: Chisholm, Hugh, ed. (1911). Encyclopædia Britannica (11th ed.). Cambridge University Press.


