ఎం.జి.రామచంద్రన్
ఎంజీఆర్ లేదా పురచ్చి తలైవర్ (క్రాంతియుత నాయకుడు) గా ప్రసిద్ధి చెందిన మరుదూరు గోపాల రామచంద్రన్ (తమిళం: மருதூர் கோபால இராமச்சந்திரன்) (జనవరి 17, 1917 – డిసెంబర్ 24, 1987) తమిళ సినిమా రంగములో ప్రముఖ నటుడు మరియు 1977 నుండి ఆయన మరణించేంతవరకు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
![]() పురచ్చి తలైవర్, (తమిళం: క్రాంతియుత నాయకుడు), | |
| జననం: | 1917 జనవరి 17 నవలపితియా, శ్రీలంక |
|---|---|
| మరణం: | 1987 డిసెంబరు 24 (వయసు 70) తమిళనాడు |
| వృత్తి: | సినీ నటుడు, రాజకీయ నాయకుడు |
| భర్త/భార్య: | తంగమణి, సదానందవతి & వి.ఎన్.జానకి |
| సంతానం: | లేరు |
తొలి జీవితం
రామచంద్రన్ శ్రీలంకలోని కాండీ సమీపములోని నవలపితియాలో మరదూరు గోపాల మీనన్ మరియు సత్యభామ దంపతులకు జన్మించాడు. ఈయన కేరళ రాష్ట్రములోని పాలక్కడ్ జిల్లా, వడవన్నూరులోని మీనన్ కుటుంబానికి చెందినవాడు. ఈయన తాత కుటుంబముతో సహా శ్రీలంకకు తరలి వెళ్ళాడు.[1][2]
తండ్రి మరణము తర్వాత, పేదరికము వలన ప్రాథమిక స్థాయిని దాటి విద్యాభ్యాసము కొనసాగించలేక రామచంద్రన్ ఒరిజినల్ బాయ్స్ అనే ఒక నాటకబృందములో చేరాడు. ఇక్కడ రంగస్థలంపై తగినంత అనుభవము గడించి, సినిమా రంగములో అడుగుపెట్టి అవిరాళ కృషి, పట్టుదలతో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. అత్యంత ప్రజాదరణ కలిగిన నటునిగా ఎదిగాడు. ఈయన మంచి దర్శకుడు, నిర్మాత మరియు నైపుణ్యమున్న సినిమా ఎడిటరు కూడా. ఎంజీయార్ భార్గవి (తంగమణి) ని పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళైన కొన్నాళ్ళకే ఈమెకు జబ్బు చేసి మరణించింది. ఆ తరువాత సదానందవతిని రెండవ పెళ్ళి చేసుకున్నాడు. ఈమె కూడా కొన్నాళ్ళకే క్షయ వ్యాధితో మరణించింది. రామచంద్రన్ మూడవ భార్య వి.ఎన్.జానకి, తమిళ సినిమా నటి, తన మొదటి భర్త గణపతి భట్ కు విడాకులిచ్చి రామచంద్రన్ను వివాహమాడింది. ఎంజీయార్ కు ఎవరూ పిల్లలు లేరు[3]
మూలాలు
| Wikimedia Commons has media related to M. G. Ramachandran. |
- MGR
- L. R., Jegatheesan. "ஆளும் அரிதாரம்" (in Tamil). BBC. Retrieved 2006-11-08.CS1 maint: Unrecognized language (link)
- http://www.nilacharal.com/enter/celeb/MGR.asp

