ఉండ్రాజవరం గ్రామం
ఉండ్రాజవరం, పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు మండలానికి చెందిన ఒక గ్రామము.[1].[1] ఈ గ్రామం పోతునూరు గ్రామ పంచాయతి పరిధిలోనిది. గ్రామ జనాభా సుమారు 2000 ఉంటారు. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ప్రదానంగా వరి సాగుచేస్తారు. ఈ గ్రామానికి దగ్గరలోనే జాతీయ రహదారి-5 మరియు గోదావరి పశ్చిమ కాలువ వెలుతున్నాయి. ఈ కాలువ కారణంగా గ్రామ ప్రజలకు నీటి కొరత అనేదే ఉండదు. వీరు ఏడాదికి మూడు పంటలు పండిస్తారు.
| ఉండ్రాజవరం గ్రామం | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | పశ్చిమ గోదావరి |
| మండలం | దెందులూరు |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 534450 |
| ఎస్.టి.డి కోడ్ | |

ఉండ్రాజవరం గ్రామం
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.