అరుణ్ జైట్లీ
అరుణ్ జైట్లీ భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. జైట్లీ 1952 నవంబర్ 28న కొత్తఢిల్లీలో జన్మించారు. వాజపేయి మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీ ప్రస్తుతం రాజ్యసభలో adikara నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో అమృత్సర్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు.
| అరుణ్ జైట్లీ | |||
![]() | |||
వ్యక్తిగత వివరాలు |
|||
|---|---|---|---|
| జననం | 1952 నవంబరు 28 కొత్త ఢిల్లీ | ||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| జీవిత భాగస్వామి | సంగీత జైట్లీ | ||
| సంతానము | రోహన్ జైట్లీ, సోనాలీ జైట్లీ | ||
| వృత్తి | భారత ఆర్దిక శాఖ మంత్రి | ||
| మతం | హిందూమతము | ||
| వెబ్సైటు | Official website | ||
బాల్యం
అరుణ్ జైట్లీ నవంబర్ 28, 1952న కొత్తఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. ఇతని తండ్రి మహారాజ్ కిషన్ జైట్లీ ప్రముఖ న్యాయవాది. అరుణ్ జైట్లీ ఢిల్లీ నుంచే డిగ్రీ మరియు న్యాయశాస్త్ర పట్టా పొందినారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అభ్యసిస్తున్నప్పుడు విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించారు.
రాజకీయ ప్రస్థానం
విద్యార్థి దశలోనే అరుణ్ జైట్లీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడుగా పనిచేశారు. అత్యవసర పరిస్థితి కాలంలో 19 నెలలు జైలుకు వెళ్ళారు. జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్ పార్టీ (ఇప్పటి భారతీయ జనతా పార్టీ) లో చేరారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రి హయంలో అరుణ్ జైట్లీ సొలిసిటర్ జనరల్గా పనిచేశారు. 1991 నుంచి భారతీయ జనతా పార్టీ కార్యవర్గంలో పనిచేస్తున్నారు. అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేబినెట్ హోదా కల మంత్రిగా నియమించబడ్డారు. పలు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా వ్యవహరించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికలలో అమృత్సర్ నియోజకవర్గం నుంచి పోటీపడి... కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు
