అబ్దుల్‌ జలీల్‌ షేక్‌

అబ్దుల్‌ జలీల్‌ షేక్‌, ఉర్దూ, అరబిక్‌ భాషలలోని ధార్మిక గ్రంథాలను తెలుగులోకి అనువదించి ప్రచురిస్తున్నారు.

బాల్యము

అబ్దుల్‌ జలీల్‌ షేక్‌: కృష్ణా జిల్లా, విజయవాడలో 1953 మే 15న జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్‌ అమీనాబీ, షేక్‌ అబ్దుల్‌ గపూర్‌. వీరు పదవ తరగతి వరకు చదువు కున్నారు. వృత్తి: వ్యాపారం., ధార్మిక సేవ. ప్రస్తుతం గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలానికి చెందిన నులకపేట గ్రామంలోని 'నూరాని జామియా మస్జిద్‌' ఇమాంగా పనిచేస్తున్నారు. వీరు 2005 నుండి రచన వ్యాసంగం ఆరంభించి ఉర్దూ-అరబిక్‌ భాషలలోని ధార్మిక గ్రంథాలను తెలుగులోకి అనువదించి ప్రచురిస్తున్నారు.

రచనలు

  1. 'దానమహిమలు' (2005),
  2. 'పవిత్ర ఖుర్‌ఆన్‌ (తాత్పర్యము, 2009),
  3. ఖుర్‌ఆన్‌-హదీస్‌ మరియు అహ్‌లె హదీస్‌ ధర్మము (2010).

లక్ష్యం

ప్రజలలో ముఖ్యంగా ముస్లిం ప్రజానీకంలో చిట్లం కట్టుకు పోయిన ధార్మిక అలసత్యం, ఉదాసీనతను పోగొట్టాలన్నది వీరు ప్రధాన లక్ష్యము.

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.