అఫ్జల్ ఉద్దౌలా


అఫ్జల్ ఉద్దౌలా - మీర్ టెహ్నియత్ అలీ ఖాన్ (11 అక్టోబర్ 1827 - 26 ఫిబ్రవరి 1869) నాసిర్ ఉద్దౌలా కుమారుడు నిజాం పరిపాలకులలో ఐదవ అసఫ్ జా. ఇతడు హైదరాబాదును క్రీ.శ. 1857 నుండి 1869 వరకు పరిపాలించెను.

అఫ్జల్ ఉద్దౌలా - మీర్ టెహ్నియత్ అలీ ఖాన్ - అసఫ్ ఝా V
GBE
పాలనాకాలం Nizam: 1827–1869
Titular Nizam:
ఉర్దూ Urdu: میر تہنیّت علی خان
తర్వాత వారు మహబూబ్ అలీ ఖాన్ ఆసఫ్ జాహ్ VI
రాజ మందిరం ఆసఫ్ జాహీ వంశం
మత విశ్వాసాలు ఇస్లాం

అసఫ్ జహ V హైదరాబాద్ రాబడి మరియు న్యాయ వ్యవస్థలు సంస్కరించింది, ఒక పోస్టల్ సర్వీస్ రూపొందించినవారు మరియు మొదటి రైలు మరియు టెలిగ్రాఫ్ నెట్వర్క్లు నిర్మించారు.

సిపాయిల తిరుగుబాటు

ఈతని పరిపాలన కాలంలోనే సిపాయిల తిరుగుబాటు జరిగింది. హైదరాబాదులో బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసిన తురాబజ్ ఖాన్ ను బ్రిటిష్ వారు కాల్చి చంపారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ముస్లిం ప్రజలను రెచ్చగొడుతున్న అల్లాఉద్దీన్ మౌల్వీని బంధించి అండమాన్ దీవులకు పంపారు.

ఈ తిరుగుబాటు సమయంలో నిజాం మరియు సాలార్ జంగ్లు కంపెనీకి పూర్తి సహకారం అందించి బ్రిటిష్ వారికి తోడ్పడినందుకు ప్రతిఫలంగా షోలాపూర్ను తిరిగి నిజాంకు స్వాధీనం చేశారు. నిజాం కంపెనీకి చెల్లించవలసిన 50 లక్షల రూపాయలు రద్దుచేశారు. బ్రిటిష్ వారు నిజాంకు "స్టార్ ఆఫ్ ఇండియా" అనే బిరుదును ఇచ్చి సత్కరించారు.

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.